IT Raids: కింగ్స్ ప్యాలెస్ యజమాని ఇంట్లో ఐటీ సోదాలు
హైదరాబాద్లోని పాతబస్తీలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ రాజకీయ పార్టీ కోసం పెద్దఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం
- By Praveen Aluthuru Published Date - 03:22 PM, Sat - 25 November 23
IT Raids: హైదరాబాద్లోని పాతబస్తీలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ రాజకీయ పార్టీ కోసం పెద్దఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం అందడంతో పాతబస్తీలోని బడా వ్యాపారుల ఇళ్లలో ఐటీ సోదాలు నిర్వహించింది. ఈ రోజు నవంబర్ 25న శనివారం ఫలక్ నామలోని కింగ్స్ ప్యాలెస్ యజమాని షానవాజ్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు .షానవాజ్ ఇంటితో పాటు సంబంధిత ఫంక్షన్ హాల్ కార్యాలయం, హోటళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు . ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందంతో కలిసి సోదాలు నిర్వహిస్తున్నారు .గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేసిన మాజీ ఐఏఎస్ ఏకే గోయల్ నివాసంలో కూడా నిన్నరాత్రి సోదాలు జరిగాయి.
Also Read: Bunny Vasu : పొరపాటున కూడా రాజకీయాల్లోకి రాకండి..బన్నీవాసు సూచన
Related News
Hyderabad: అమిత్ షా మీటింగ్ లో పిల్లలు, కేసు నమోదు
కేంద్ర మంత్రి అమిత్ షా, హైదరాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థి మాధవీలత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, బిజెపి రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి, యమన్ సింగ్ తదితరులపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో పిల్లలను పాల్గొనేలా చేసినందుకు మొగల్పురా పోలీసులు కేసు నమోదు చేశారు.