DA Hike: డియర్నెస్ అలవెన్స్ అంటే ఏమిటి..? ఉద్యోగులకు ప్రయోజనం ఉంటుందా..?
హోలీ పండుగకు ముందు మోడీ ప్రభుత్వం కేంద్ర ఉద్యోగులకు శుభవార్త అందించింది. వాస్తవానికి ఈరోజు గురువారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో డియర్నెస్ అలవెన్స్ (DA Hike)లో 4 శాతం పెంపునకు ఆమోదం లభించింది.
- By Gopichand Published Date - 08:16 AM, Fri - 8 March 24
DA Hike: హోలీ పండుగకు ముందు మోడీ ప్రభుత్వం కేంద్ర ఉద్యోగులకు శుభవార్త అందించింది. వాస్తవానికి ఈరోజు గురువారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో డియర్నెస్ అలవెన్స్ (DA Hike)లో 4 శాతం పెంపునకు ఆమోదం లభించింది. దీంతో కేంద్ర ఉద్యోగుల భత్యం 50 శాతానికి పెరిగింది. ప్రస్తుతం భత్యం 46 శాతం అని మనకు తెలిసిందే. ఈ పెంపు తర్వాత అది 50 శాతానికి చేరుకుంది.
ప్రభుత్వం కొత్త నిర్ణయం జనవరి 1, 2024 నుండి జూన్ 2024 వరకు వర్తిస్తుంది. ఈ నిర్ణయంతో దేశంలోని కోటి మందికి పైగా కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల అలవెన్సులు భారీగా పెరగనున్నాయి. డీఏ 4 శాతం పెరగడం ఇది వరుసగా మూడోసారి.
HRA కూడా పెరుగుతుంది
ఇప్పుడు కొత్త పెంపు తర్వాత డీఏ 50 శాతానికి చేరుతుంది. 7వ వేతన సంఘం సిఫారసుల ప్రకారం.. ఈ పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు టేక్-హోమ్ జీతం ప్యాకేజీలో పెరుగుదల ఖచ్చితంగా ఉంది. ఏడవ వేతన సంఘం సిఫారసుల ప్రకారం హెచ్ఆర్ఏ పెంపు కోసం నగరాలను మూడు వర్గాలుగా విభజించారు. ఈ వర్గాలు- X,Y & Z.
X కేటగిరీ ఉద్యోగి నగరాలు/పట్టణాలలో నివసిస్తుంటే.. అతని HRA 30 శాతానికి పెరుగుతుంది. అదేవిధంగా Y కేటగిరీకి HRA రేటు 20 శాతం, Z కేటగిరీకి ఇది 10 శాతం ఉంటుంది. ప్రస్తుతం, X, Y & Z నగరాలు/పట్టణాలలో నివసిస్తున్న ఉద్యోగులు వరుసగా 27, 18, 9 శాతం HRA పొందుతున్నారు.
గ్రాట్యుటీ పరిమితి కూడా పెరిగింది
కేబినెట్ సమావేశం గురించి సమాచారం ఇస్తూ.. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై రూ.12,869 కోట్ల భారం పెరుగుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఈ నిర్ణయంతో హెచ్ ఆర్ ఏ కూడా పెరుగుతుందని పీయూష్ గోయల్ తెలిపారు. దీంతోపాటు గ్రాట్యుటీ పరిమితిని కూడా పెంచారు. గ్రాట్యుటీ పరిమితిని రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారు. పీయూష్ గోయల్ ప్రకారం.. ఈ పెంపుతో కేంద్ర ఉద్యోగులు వివిధ కేటగిరీలలో అనేక పెద్ద ప్రయోజనాలను పొందుతారు.
అక్టోబర్ 2023లో కూడా ప్రకటించారు
అంతకుముందు 2023 అక్టోబర్లో ప్రభుత్వం డీఏను 4 శాతం పెంచింది. దీని కింద జులై 1, 2023 నుండి డియర్నెస్ అలవెన్స్, డియర్నెస్ రిలీఫ్ 4 శాతం నుండి 46 శాతానికి పెరిగింది.
We’re now on WhatsApp : Click to Join
డియర్నెస్ అలవెన్స్ అంటే ఏమిటి?
డియర్నెస్ అలవెన్స్ అనేది ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగుల జీవన ప్రమాణాలను కాపాడుకోవడానికి ఇచ్చే డబ్బు. ఈ డబ్బును ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ ఉద్యోగులు, పెన్షనర్లకు అందజేస్తారు. దేశం ప్రస్తుత ద్రవ్యోల్బణం ప్రకారం దీని గణన ప్రతి 6 నెలలకు జరుగుతుంది. ఇది సంబంధిత పే స్కేల్ ఆధారంగా ఉద్యోగుల ప్రాథమిక వేతనం ప్రకారం లెక్కించబడుతుంది.
Tags
Related News
e-Shram Card: ఈ కార్డు ఉంటే బోలెడు ప్రయోజనాలు.. నెలకు రూ.3000 పెన్షన్ కూడా..!
ఆర్థికంగా వెనుకబడిన ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. వీటిలో ఒకటి ఈ-శ్రమ్ కార్డ్ స్కీమ్. ఈ పథకం కింద ఆర్థికంగా వెనుకబడిన కూలీలకు ప్రతినెలా రూ.1000 సాయం అందుతుంది.