HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Brs Leader Ktr Slams Congress Government Over Failures

KTR : అతి విశ్వాసం, చిన్నచిన్న తప్పిదాలతో అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయాం

KTR : "అతి విశ్వాసం , కొన్ని చిన్న తప్పిదాల వల్ల మా పార్టీకి ఈ ఫలితాలు వచ్చాయి. కానీ, కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ రాష్ట్రాన్ని, దేశాన్ని శాసించే రోజులు వస్తాయి," అని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్‌.

  • Author : Kavya Krishna Date : 04-01-2025 - 5:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KTR revanth
KTR revanth

KTR : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్). అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణాలు విశ్లేషిస్తూ, “అతి విశ్వాసం , కొన్ని చిన్న తప్పిదాల వల్ల మా పార్టీకి ఈ ఫలితాలు వచ్చాయి. కానీ, కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ రాష్ట్రాన్ని, దేశాన్ని శాసించే రోజులు వస్తాయి,” అని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్‌.

కేటీఆర్ మాట్లాడుతూ, “ఎన్నికలు ముగిసి ఏడాది అయినా కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ మీద జపం చేస్తూనే ఉంది. రాష్ట్రం దివాలా తీసిందని మాట్లాడటం ముఖ్యమంత్రికి పరిపాలనపై అనుభవం లేకపోవడం, చాతన లేకపోవడం స్పష్టంగా చూపిస్తుంది,” అని విమర్శించారు. అలాగే, “ముఖ్యమంత్రికి, మంత్రులకు సత్సంబంధాలు లేవు. అంతర్గత విభేదాలు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును దెబ్బతీస్తున్నాయి,” అని ఆరోపించారు.

ఆర్థిక పరిస్థితులపై విమర్శలు
కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తోందని, నిజానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రూ. 4 లక్షల కోట్లు అప్పులు చేశాకే రాష్ట్రానికి అభివృద్ధి సాధ్యమైందని వివరించారు. “కానీ, కేవలం ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 1.3 లక్షల కోట్లు అప్పులు చేసింది. దీనిపై ప్రశ్నలు ఎదుర్కోవాల్సిన అవసరం కాంగ్రెస్ నాయకత్వానికి ఉంది,” అని అన్నారు. ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ ATMగా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వం పిచ్చోడి చేతిలో రాయి అయ్యిందని తీవ్రంగా విమర్శించారు.

తనపై ఆరు తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపే ప్రయత్నం చేసిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. “కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై మేము నిలదీయాల్సిన అవసరం ఉంది. హామీలు అమలు చేయకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ముందే చెప్పాను. కానీ, ఆ హామీల అమలు దిశగా కనీసం మొదటిపడిక కూడా పడలేదు,” అని ఆయన అన్నారు. రైతుల సంక్షేమం అంశం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి వైఫల్యాన్ని చవిచూస్తోందని, “రైతు బంధు పథకాన్ని దెబ్బతీయడానికి కుట్రలు జరుగుతున్నాయి. రైతుల్ని దొంగలుగా చిత్రీకరించే విధంగా పనిచేస్తున్నారు. మేం 12 విడతల్లో రూ. 80,000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏమి చేసింది?” అని ప్రశ్నించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై వివాదం
కాళేశ్వరం ప్రాజెక్టు పగుళ్లపై విమర్శలు చేయడం కాంగ్రెస్ కుట్రలో భాగమేనని కేటీఆర్ ఆరోపించారు. “మేడిగడ్డకి నీరు అందకపోవడం కాదు, రేవంత్ రెడ్డి మేధస్సుకే పగుళ్లు పడ్డాయి. కాళేశ్వరంను బాగు చేయడానికి కాంగ్రెస్ ఆసక్తి చూపడం లేదు, ఎందుకంటే దానివల్ల కోటిన్నర ఎకరాలకు నీరు అందించాల్సి ఉంటుంది. ఇది రైతులకు మేలు చేస్తుందని వాళ్లకు తెలియదా?” అని కేటీఆర్ ప్రశ్నించారు.

హామీల అమలుపై ప్రశ్నలు
“ఆరు గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ కూడా అమలులో లేదు. రెండు లక్షల రుణమాఫీ పూర్తిగా అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు కనీసం అరశాతం కూడా చేయలేదు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల రెగ్యులర్‌ పరచడం గురించి ప్రభుత్వం మౌనం వహిస్తోంది. కళ్యాణలక్ష్మీ పథకం కింద నలుగురు లక్షల పెళ్లిళ్లు జరిగినా నిధులు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైంది,” అని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆఖరి మాట
కేటీఆర్ మాట్లాడుతూ, “సాతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తెలంగాణ అభివృద్ధి సాధ్యపడదు. ప్రజలు ఇలాంటి నాయకత్వాన్ని ప్రశ్నించాలి. బీఆర్ఎస్ పునఃనిర్మాణం, సభ్యత్వ నమోదు కార్యక్రమాలతో మళ్లీ ప్రజలకు దగ్గరవుతుంది. కాంగ్రెస్ హామీలను నిలదీసే దిశగా మా పోరాటం కొనసాగుతుంది,” అని స్పష్టం చేశారు.

Emerald: ఆకుపచ్చ రత్నం ఎప్పుడు ధరించాలి.. ఎవరు ధరించాలో మీకు తెలుసా?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • Congress Government
  • Debt Waiver
  • Farmers' Welfare
  • kaleshwaram project
  • ktr
  • Political Criticism
  • rythu bandhu
  • telangana development
  • telangana politics

Related News

Sit Inquiry Kcr

నంది నగర్ నివాసంలోనే కేసీఆర్ విచారణ!

విచారణా వ్యూహంలో భాగంగా ఇప్పటికే సిట్ అధికారులు కీలక నేతల నుంచి వాంగ్మూలాలను సేకరించారు. గత కొన్ని రోజులుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వేదికగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు ఇతర ముఖ్య నాయకులను అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు

  • Telangana Farmers

    తెలంగాణ రైతులకు శుభవార్త..

  • Harish Rao Pm

    రైతులకు కన్నీరు.. బీరు ఫ్యాక్టరీలకు నీరు ! – కాంగ్రెస్ సర్కార్ పై హరీష్ రావు ధ్వజం

  • Santosh Rao Kavitha

    సంతోష్ రావుపై మరో సారి కవిత షాకింగ్ కామెంట్స్

  • Phone Tapping Santhosh

    ఫోన్ ట్యాపింగ్ కేసు : ఎవరు సాక్షి ? ఎవరు దోషి? సిట్ ఎవర్ని అరెస్ట్ చేయబోతుంది ?

Latest News

  • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

  • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

  • భార‌త్‌- పాక్ మ్యాచ్‌పై శ్రీలంక ప్రత్యేక దృష్టి!

  • ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

  • అంజనాదేవి పుట్టిన రోజు సందర్బంగా పవన్ దత్తత

Trending News

    • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

    • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

    • రిటైర్మెంట్‌పై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్య‌లు!

    • జాతీయ రహదారులపై నిర్మలా సీతారామన్ సంచలనం

    • యూపీఐ ద్వారా డబ్బు కట్ అయి, పేమెంట్ ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd