Delhi: ఢిల్లీ ఆస్పత్రిలో కాల్పులు, రోగి మృతి
ఢిల్లీలోని జిటిబి ఆసుపత్రిలో రోగిని కాల్చి చంపారు. ఈ ఘటన సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగింది.రోగిని హత్య చేసిన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
- By Praveen Aluthuru Published Date - 06:48 PM, Sun - 14 July 24

Delhi: ఢిల్లీలోని ఆస్పత్రిలో కాల్పులు కలకలం రేపాయి. ఈ రోజు ఆదివారం పట్టపగలు, ముగ్గురు దుండగులు ఢిల్లీలోని జిటిబి ఆసుపత్రిలో రోగిని కాల్చి చంపారు. ఈ ఘటన సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగింది. రోగి కొన్ని వారాల పాటు వార్డు నంబర్-24లో చేరాడు. కాగా కాల్పుల ఘటన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు రియాసాదుద్దీన్ (32)గా గుర్తించారు. రియాసాదుద్దీన్ ఖజూరి నివాసి.
మృతుడు కడుపులో ఇన్ఫెక్షన్ సోకడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరినట్లు పోలీసులు తెలిపారు. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆసుపత్రి వార్డులోకి వచ్చి బుల్లెట్లతో కాల్పులు జరిపారని స్థానికులు తెలిపారు. విచారణ నిమిత్తం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
మృతుడి చెల్లెలు మాట్లాడుతూ.. నా అన్న ఐదో అంతస్తులో అడ్మిట్ అయ్యాడని చాందిని చెప్పింది. అప్పుడు తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. నాలుగో అంతస్థులోకి రాగానే పేషెంట్లు భయపడిపోవడం చూశాను. కాసేపటికే ఈ ఘటన జరిగినట్లు ఆమె తెలిపింది. అయితే ఆస్పత్రిలో పట్టపగలు ఓ రోగిని కాల్చి చంపిన ఘటనలో భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓ పెద్ద ప్రభుత్వాసుపత్రిలో ఇలాంటి ఘటన జరగడం చాలా భయానకం, దిగ్భ్రాంతికరం. ఆసుపత్రిలో చేరి రోగిని హత్య చేసిన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Also Read: Karimnagar Mayor Sunil Rao : బిజెపిలోకి బిఆర్ఎస్ కరీంనగర్ మేయర్..?