ISRO: ఇస్రో ఖాతాలో మరో విజయం.. మూడు ఉపగ్రహాలను నింగిలో
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (Indian Space Research Organization) మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
- By Maheswara Rao Nadella Published Date - 12:10 PM, Fri - 10 February 23
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి ఈ ఉదయం 9.18 గంటలకు ప్రయోగించిన ఎస్ఎస్ఎల్వి-డి2 ప్రయోగం విజయవంతమైంది. నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్ మూడు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. దీంతో షార్లోని శాస్త్రవేత్తలు ఆనందంతో కేరింతలు కొట్టారు.
ఎస్ఎస్ఎల్వి-డి2 రాకెట్ 334 కిలోల బరువుండే మూడు రాకెట్లతో నింగిలోకి దూసుకెళ్లింది. ఇందులో రెండు దేశీయ ఉపగ్రహాలు కాగా, అమెరికాకు చెందిన ఓ ఉపగ్రహం ఉంది. వీటిని 450 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో ప్రవేశపెట్టింది. తొలి ఉపగ్రహమైన ఈవోఎస్-07ను 785 సెకన్లకు, రెండోదైన జానుస్-1ను 880 సెకన్లకు, చివరిదైన ఆజాదీశాట్ను 900 సెకన్లకు వరుసగా కక్ష్యలో ప్రవేశపెట్టింది.
వీటిలోని ఈవోఎస్-07 ఉపగ్రహాన్ని ఇస్రో (ISRO) రూపొందించింది. దీని బరువు 156.3 కేజీలు. అలాగే, ఆజాదీశాట్-2 ఉపగ్రహాన్ని చెన్నై స్పేస్కిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలికలు రూపొందించారు. దీని బరువు 8.7 కేజీలు. ఇక, జానుస్-1ను అమెరికాకు చెందిన అంటారిస్ సంస్థ అభివృద్ధి చేసింది. దీని బరువు 11.5 కేజీలు. కాగా, ప్రయోగ ప్రారంభానికి ముందు ఈ తెల్లవారుజామున 2.48 గంటలకు కౌంట్డౌన్ మొదలైంది. 6.30 గంటలపాటు కౌంట్ డౌన్ కొనసాగిన అనంతరం రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది.
Also Read: Safest Seat in Airplane: విమానంలో ఏ సీట్లో కూర్చుంటే భద్రత..?
Related News
Ebrahim Raisi Death: రైసీకి ఇండియా సంతాపం.. అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ జెండా
రాష్ట్రపతి రైసీ గౌరవార్థం భారత ప్రభుత్వం ఈరోజు మంగళవారం ఒకరోజు సంతాప దినాలు ప్రకటించింది. దీని కారణంగా ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ జెండాను సగం మాస్ట్లో ఎగురవేయనున్నారు.