HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Accident At Slbc Tunnel Cm Orders For Relief Measures

SLBC Tunnel : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద ప్రమాదం..సహాయక చర్యలకు సీఎం ఆదేశం

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి టన్నెల్‌లో పైకప్పు కూలి కార్మికులు గాయడిన ఘటన పై స్పందించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, నీటిపారుదల శాఖ అధికారులను సీఎం ఆదేశించారు.

  • Author : Latha Suma Date : 22-02-2025 - 2:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Accident at SLBC tunnel.. CM orders for relief measures
Accident at SLBC tunnel.. CM orders for relief measures

SLBC Tunnel : సుదీర్ఘ విరామం తర్వాత పునఃప్రారంభమైన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం ఎడవైపు సొరంగం 14వ కిలోమీటర్‌ వద్ద ప్రమాదం జరిగింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా దోమలపెంట సమీపంలో పనులు జరుగుతుండగా టన్నెల్‌ పైకప్పు 3 మీటర్ల మేర పడిపోయింది. దీంతో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని రక్షించిన తోటి కార్మికులు హుటాహుటిన జెన్‌కో హాస్పిటల్‌కు తరలించారు. పోలీసుల సాహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Read Also: Kamal Haasan : కేంద్రంపై కమల్ ఫైర్

టన్నెల్‌ వద్ద మొదటి షిఫ్ట్‌లో సుమారు 50 మంది కార్మికులు సొరంగంలోకి వెళ్లారు. ఉదయం 8.30 గంటల సమయంలో కార్మికులు పని చేస్తుండగా.. ఆకస్మాతుగా పైకప్పు కూలి మట్టిపెల్లలు విరిగి పడ్డాయి. దీంతో కార్మికులు భయాందోళనకు గురయ్యారు. వారిలో 42 మంది బయటకి రాగా.. ఎనిమిది మంది కార్మికులు లోపల చిక్కుకున్నట్లు సమాచారం. ఘటనాస్థలి వద్ద నీటిపారుదల శాఖ అధికారులు, పోలీసులు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి టన్నెల్‌లో పైకప్పు కూలి కార్మికులు గాయడిన ఘటన పై స్పందించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, నీటిపారుదల శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. విషయం తెలుసుకున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెంటనే ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా ఘటనాస్థలికి బయల్దేరారు. ఉత్తమ్‌ వెంట నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్‌, అధికారులు ఉన్నారు.

కాగా, శ్రీశైలం ప్రాజెక్టు వెనుక జలాల నుంచి టన్నెల్‌ ద్వారా వెనుకబడిన నల్గొండ జిల్లాకు సాగు, తాగు నీరందించేందుకు ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం దోమలపెంట సమీపంలో సొరంగ మార్గం నిర్మిస్తున్నారు. 2005లో అప్పటి ప్రభుత్వం ప్రాజెక్టు పనులను ప్రారంభించింది. 60 నెలల్లో పనులు పూర్తి చేయాలని నిర్ధేశించారు. శ్రీశైలం నుంచి నల్లగొండ జిల్లాకు 30 టీఎంసీల కృష్ణా జలాలను తరలించాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. అయితే టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌తో సొరంగం తవ్వకం చేపట్టగా సాంకేతిక సమస్యలు, వరద సమస్యలతో పనులు ఆగుతూ సాగుతున్నాయి.

మరోవైపు శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ ప్రమాదంపై నాగర్ కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ స్పందించారు. ప్రమాద సమయంలో 50 మంది కార్మికులు ఉన్నారని, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఆయన అక్కడికెళ్లి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. కాసేపట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అక్కడి చేరుకోనున్నారు.

టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికుల వివరాలు..

.గుర్‌జీత్‌ సింగ్‌(పంజాబ్‌)
.సన్నీత్‌సింగ్‌(జమ్ముకశ్మీర్‌)
.శ్రీనివాసులు (యూపీ)
.మనోజ్‌ రూబెన(యూపీ)
.సందీప్‌, సంతోష్‌ (ఝార్ఖండ్‌)
.ట్కా హీరన్‌ (ఝార్ఖండ్‌)

Read Also: Indian Fisherme : పాక్‌ జైలు నుండి 22 మంది భారతీయ జాలర్లు విడుదల

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • labourers injured
  • Minister Uttam Kumar Reddy
  • Nagarkurnool district
  • SLBC Tunnel
  • Tunnel roof

Related News

Good news for farmers from the Revanth government.

CM Revanth Reddy: రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్

తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత లాభసాటిగా మార్చడంతో పాటు, పంటల సాగు విధానంలో సమతుల్యతను సాధించేందుకు ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ఒకవైపు వరి సాగు అసాధారణంగా పెరిగిపోతుండగా.. మరోవైపు పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, చిరుధాన్యాల సాగు గణనీయంగా పడిపోతోంది. ఈ వ్యత్యాసాన్ని తగ్గించి, ఇతర ధాన్యాల దిగుమతి విషయంలో తెలంగాణను స్వయం సమృద్ధి దిశగా నడిపించే

  • Good news for farmers from the Revanth government.

    Rythu Bharosa: తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. ‘రైతు భరోసా’ నిధులు విడుదల

  • Huge good news from the Revanth government for Telangana employees.

    CM Revanth Reddy: తెలంగాణ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ భారీ గుడ్ న్యూస్

  • Good news for farmers... Rythu Bharosa funds to be released today.

    Rythu Bharosa: అన్నదాతలకు గుడ్ న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల

  • Huge good news from the Revanth government for Telangana employees.

    Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మధిరలో రైతు ఆశీర్వాద సభ రద్దు..

Latest News

  • Lakshmi: లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే ఇంటి ప్రధాన ద్వారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసా?

  • Hair Tips: ప్రతిరోజు దీన్ని తలకు పట్టించుకుంటే చాలు.. జుట్టు గడ్డిలా గుబురుగా పెరగడం ఖాయం!

  • Shah Rukh Khan: అమెరికాలో షారుఖ్ ఖాన్ నైట్ రైడర్స్ సొంత క్రికెట్ స్టేడియం ఏర్పాటు

  • NEET యూజీ 2026 రీ-ఎగ్జామ్ రిజల్ట్స్ డేట్.. NTA నుంచి బిగ్గెస్ట్ అప్‌డేట్

  • Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవిత అరెస్ట్

Trending News

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd