Special Trains: దసరా సందర్భంగా 620 ప్రత్యేక రైళ్లు
దసరా పండుగ సీజన్ వచ్చేస్తోంది. స్కూళ్ళు, కాలేజీలకు సెలవులిచ్చేశారు. ఊరెళ్దామనుకుంటే రైళ్లు, బస్సులన్నింటిలోనూ రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది
- Author : Praveen Aluthuru
Date : 16-10-2023 - 2:17 IST
Published By : Hashtagu Telugu Desk
Special Trains: దసరా పండుగ సీజన్ వచ్చేస్తోంది. స్కూళ్ళు, కాలేజీలకు సెలవులిచ్చేశారు. ఊరెళ్దామనుకుంటే రైళ్లు, బస్సులన్నింటిలోనూ రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 620 ప్రత్యేక రైళ్లను వివిధ ప్రాంతాలకు నడపనున్నట్లు తెలిపింది.
దక్షిణ మధ్య రైల్వే దసరా కోసం దాదాపు 620 ప్రత్యేక రైళ్లను నడపనుంది. వీటిని వివిధ ప్రాంతాల నుండి రెండు తెలుగు రాష్ట్రాలు మరియు ఇతర పొరుగు రాష్ట్రాలకు నడపనున్నారు.సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ మరియు లింగంపల్లితో సహా జంట నగరాల్లోని ప్రధాన రైల్వే స్టేషన్ల నుండి రైళ్లు ప్రారంభ పాయింట్లుగా నడుస్తాయి. పండుగల సీజన్లో, విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ, తిరుపతి మరియు విశాఖపట్నంతో సహా వివిధ గమ్యస్థానాలకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఏపీ, తెలంగాణ మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారి కోసం కూడా ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. షిర్డీ, జైపూర్, రామేశ్వరం ఇలా రద్దీ ప్రాంతాలకు ద.మ రైల్వే రైళ్లను నడుపుతోంది.
రెండు రాష్ట్రాల మధ్య దాదాపు 200 ట్రిప్పులు షెడ్యూల్ చేశారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో రైల్వే శాఖ భద్రత విషయంలో కట్టుదిట్టంగా చర్యలకు సిద్ధమైంది. CCTV నిఘా వ్యవస్థ ద్వారా భద్రతా అంశాలు అమలులో ఉన్నాయి. మూడు స్థాయిల్లో పర్యవేక్షణ జరుగుతుంది. స్టేషన్, డివిజన్ మరియు జోన్ స్థాయి. రాత్రి సమయంలో RPF సిబ్బంది నేరాలు జరిగే ప్రాంతాలు మరియు ప్రధాన జంక్షన్లపై దృష్టి సారించి రైళ్లను ఎస్కార్ట్ చేస్తారు.
Also Read: Telangana Politics: బీఆర్ఎస్ లోకి జిట్టా బాలకృష్ణారెడ్డి