Lightning in UP: యూపీలో పిడుగుపాటుకు నలుగురు మృతి
ఉత్తరప్రదేశ్లో ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ క్రమంలో పిడుగు పడటంతో వేర్వేరు చోట్ల నలుగురు మరణించారు.
- Author : Praveen Aluthuru
Date : 03-03-2024 - 10:39 IST
Published By : Hashtagu Telugu Desk
Lightning in UP: ఉత్తరప్రదేశ్లో ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ క్రమంలో పిడుగు పడటంతో వేర్వేరు చోట్ల నలుగురు మరణించారు.
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పిడుగులు పడి ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల తీవ్ర సంతాపం తెలియజేశారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మృతుల కుటుంబాలకు తక్షణమే రూ.4 లక్షల ఆర్థిక సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. పిడుగులు, వడగళ్ల వాన, భారీ వర్షం, తుఫాను వంటి విపత్తుల కారణంగా జంతువులు నష్టపోయినప్పుడు, ఇళ్లకు నష్టం వాటిల్లిన సందర్భాల్లో బాధిత ప్రజలకు తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని సంబంధిత జిల్లా మేజిస్ట్రేట్లను సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఫరూఖాబాద్, కన్నౌజ్, ముజఫర్నగర్, జలౌన్, ఝాన్సీ, కాన్పూర్ దేహత్, షాజహాన్పూర్, లలిత్పూర్ మరియు సహరాన్పూర్లో ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 2:30 గంటల మధ్య వడగళ్ల వాన కురిసిందని రిలీఫ్ కమిషనర్ తెలిపారు.
Also Read: Shock to BRS: కేసీఆర్ కు భారీ షాక్.. రాజీనామాకు సిద్దమైన ఆరూరి రమేష్