Rains : తమిళనాడులో భారీ వర్షాలు..చెన్నై సహా 27జిల్లాల్లో స్కూళ్లకు సెలవు..!!
- By hashtagu Published Date - 07:03 AM, Sat - 12 November 22
తమిళనాడును భారీ వర్షాలు వదలడం లేదు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నేడు 23 జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. నవంబర్ 13 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో చెన్నై సహా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలకు సెలవు ప్రకటించారు.
Under the influence of a Well Marked Low Pressure Area over southwest Bay of Bengal off Tamil Nadu Puducherry coasts Tamilnadu Rainfall Data (in mm) is reported from 0830-1730 hrs IST of 11.11.2022:
— India Meteorological Department (@Indiametdept) November 11, 2022
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో గురువారం రాత్రి నుంచి మొదలైన వర్షం తగ్గడం లేదు. ముఖ్యంగా ఆవడి, పూనమల్లి మధ్యమార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ శుక్రవారం పరిస్థితిని సమీక్షించారు. వర్షాలు, వరదలు వంటి విపత్తుల వల్ల ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం, అధికారులు అన్ని విధాల అండగా ఉంటారని ట్వీట్ చేశారు. ఈ కష్టకాలంలో ప్రజలకు అండగా ఉంటున్న అధికారులకు అభినందనలు తెలిపారు.
Due to continuous rains and the forecast, holiday declared for schools and colleges in Tiruvallur district for tomorrow.#Tiruvallur
— Collector, Tiruvallur (@TiruvallurCollr) November 11, 2022
Tags
Related News
Smoke Biscuit Banned: స్మోక్ బిస్కెట్లపై నిషేధం…
చెన్నైలో రెడీ-టు-ఈట్ స్మోక్ పిటా, స్మోక్ బిస్కెట్లు మరియు లిక్విడ్ నైట్రోజన్ ఉపయోగించి వండిన ఆహారాన్ని నిషేధిస్తూ రాష్ట్ర ఆహార భద్రత విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది. తాజాగా కర్నాటక రాష్ట్రానికి చెందిన ఓ బాలుడు పొగ బిస్కెట్లు తిని స్పృహ తప్పి పడిపోయాడు,