Tamil Nadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
తమిళనాడు (Tamil Nadu)లోని నమక్కల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఓ కంటైనర్ను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మహిళలు మృతి చెందారు.
- Author : Gopichand
Date : 28-02-2023 - 10:32 IST
Published By : Hashtagu Telugu Desk
తమిళనాడు (Tamil Nadu)లోని నమక్కల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఓ కంటైనర్ను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మహిళలు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. యాక్సిడెంట్ ధాటికి కారు నుజ్జు నుజ్జు అయింది. బాధితుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Also Read: Encounter: ఎన్కౌంటర్ లో ఉగ్రవాది హతం.. ఇద్దరు జవాన్లకు గాయాలు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్మతి వేలూరులో ఈ ప్రమాదం జరగ్గా, మృతులంతా అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను వెలికి తీయడానికి రెస్క్యూ అధికారులు వాహనాన్ని కట్ చేయాల్సి వచ్చింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నమక్కల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు.