TMC : ఈ ఎన్నికల ఫలితాలే లోక్సభ ఎన్నికలకు బూస్ట్ – టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ
వెస్ట్ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో తమపార్టీకి ఓటు వేసిన ప్రజలకు ఆ పార్టీ సీనియర్ నేత అభిషేక్ బెనర్జీ కృతజ్ఞతలు
- By Prasad Published Date - 08:46 AM, Wed - 12 July 23
వెస్ట్ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో తమపార్టీకి ఓటు వేసిన ప్రజలకు ఆ పార్టీ సీనియర్ నేత అభిషేక్ బెనర్జీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల ఫలితాలే తమకు వచ్చే లోక్సభ ఎన్నికలకు బూస్టింగ్ అన్నారు. బిజెపికి చెందిన ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారిని ఉద్దేశించి అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ, మమతకు ఓటు లేదు అనే ప్రచారం నుంచి ఇప్పుడు మమతకు ఓటు వేయండి”గా మారిందని అన్నారు. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో సువేంధు అధికారి ‘మమతకు ఓటు వేయవద్దు’ నినాదాన్ని లేవనెత్తారని ఆయన ప్రస్తావించారు.కానీ ప్రజలు టీఎంసీకి ఓటు వేసి గెలిపించారని తెలిపారు. అయితే ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. జూలై 8న బ్యాలెట్ పేపర్ల ద్వారా పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. గ్రామపంచాయతీ స్థాయిలో టీఎంసీ ఇప్పటి వరకు 18,606 స్థానాల్లో విజయం సాధించి 8768 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రతిపక్ష బీజేపీ 4449 స్థానాల్లో విజయం సాధించి 2566 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సీపీఐ(ఎం) 1,424 స్థానాల్లో గెలిచి 972స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, దాని మిత్రపక్షం కాంగ్రెస్ 1,073 స్థానాల్లో గెలిచి 738 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
Tags
Related News
BRS: ఎన్నికల వేళ బీఆర్ఎస్కు ఎదురుదెబ్బ.. కాంగ్రెస్ లో చేరిన గుత్తా అమిత్ రెడ్డి
Gutha Amith Reddy: తెలంగాణలో లోక్సభ ఎన్నికల(Lok Sabha Elections) వేళ బీఆర్ఎస్(BRS) పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ సీనియర్ నేత, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy) కుమారుడు గుత్త అమిత్రెడ్డి(Gutha Amith Reddy) కాంగ్రెస్(Congress)లో చేరారు. ఏఐసీసీ ఇంఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ సమక్షంలో అమిత్ హస్తం కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ