C-295 MW Aircraft : భారత వాయుసేనకు మరో కొత్త విమానం.. ఇదీ ప్రత్యేకత
C-295 MW Aircraft : భారత వాయుసేన కోసం మరో సరికొత్త విమానం అందుబాటులోకి వచ్చింది.
- By Pasha Published Date - 02:57 PM, Mon - 25 September 23
C-295 MW Aircraft : భారత వాయుసేన కోసం మరో సరికొత్త విమానం అందుబాటులోకి వచ్చింది. సైనికపరమైన రవాణా అవసరాల కోసం వినియోగించే సీ-295 ఎండబ్ల్యూ విమానం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేతికి వచ్చింది. ఇది మధ్యశ్రేణి సరుకు రవాణా విమానం. మన ఆర్మీకి ఈ మోడల్ విమానం అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి. ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ లో ఉన్న హిండన్ ఎయిర్బేస్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈ విమానాన్ని రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ భారత వైమానిక దళానికి అప్పగించారు. సీ-295 విమానాలను ఎయిర్ బస్ కంపెనీ స్పెయిన్ లో తయారు చేస్తోంది.
Also read : TDP : అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నారా భువనేశ్వరి, బ్రాహ్మణి
ఈ విమానం సెప్టెంబర్ 20న స్పెయిన్ నుంచి నేరుగా గుజరాత్లోని వడోదరలో ల్యాండ్ అయింది.అక్కడి నుంచి గజియాబాద్ లో ఉన్న హిండన్ ఎయిర్బేస్ కు భారత వాయుసేన తరలించింది. రానున్న రోజుల్లో విడతల వారీగా భారత్ కు మరో 15 ‘సీ-295 ఎండబ్ల్యూ’ విమానాలు అందుతాయి. అనంతరం ఈ మోడల్ కు చెందిన 40 విమానాల తయారీ ప్రక్రియ పూర్తిగా మన దేశంలోనే జరుగుతుంది. ఈమేరకు ఎయిర్ బస్ కంపెనీతో భారత రక్షణశాఖ ఒప్పందం (C-295 MW Aircraft) కుదుర్చుకుంది. ఇక ఈరోజు ఉత్తర ప్రదేశ్ లోని గజియాబాద్లో ఉన్న హిండన్ ఎయిర్బేస్లో భారత్ డ్రోన్ శక్తి-2023 కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా డ్రోన్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
Related News
Rajnath Singh: సియాచిన్ లో రాజ్ నాథ్ సింగ్ పర్యటన.. సైనిక సంసిద్ధతపై రివ్యూ
Rajnath Singh: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి అయిన సియాచిన్ ను సోమవారం రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విజిట్ చేశారు. కీలకమైన సియాచిన్ లో భారత సైన్యం 40వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న వారం రోజుల తర్వాత రాజ్ నాథ్ సింగ్ సియాచిన్ లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండేతో కలిసి రక్షణ మంత్రి ఈ ప్రాంతంలోని మొత్తం భద్రతా పరిస్థితిని సమీక్షించారు. సియా�