HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Pm Addresses Viksit Bharat Viksit Chhattisgarh Program

PM Modi : కాంగ్రెస్ అజెండాలో దేశాభివృద్ధి ఎప్పుడూ లేదుః ప్రధాని మోదీ

  • By Latha Suma Published Date - 04:19 PM, Sat - 24 February 24
  • daily-hunt
Pm Addresses 'viksit Bharat Viksit Chhattisgarh' Program
Pm Addresses 'viksit Bharat Viksit Chhattisgarh' Program

 

 

PM Modi On Congress : కాంగ్రెస్ పార్టీ పరివార్‌వాదం (బంధుప్రీతి), అవినీతి, బుజ్జగింపులకు మించి ఆలోచించదని ఎద్దేవా చేశారు ప్రధాని నరేంద్ర మోదీ(pm modi). దేశాభివృద్ధి వారి ఎజెండాలో ఎప్పుడూ లేదని ఆరోపించారు. స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిందని, కానీ ఆ పార్టీ దృష్టి కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపైనే ఉందని విమర్శించారు. దేశ భవిష్యత్తును నిర్మించడం మరచిపోయిందని తెలిపారు. వికసిత్ భారత్ వికసిత్ ఛత్తీస్‌గఢ్(Vikasit Bharat Vikasit Chhattisgarh)కార్యక్రమంలో భాగంగా ప్రసంగించిన మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

రాయ్​పుర్​లో రూ.34,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపన చేశారు. వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించినప్పుడు, అభివృద్ధిలో ఛత్తీస్‌గఢ్ కొత్త శిఖరాలకు చేరుకుంటుందని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ దశ, దిశ కూడా అప్పటి లానే ఉన్నాయని మోదీ దుయ్యబట్టారు. పరివార్‌వాదం, అవినీతి, బుజ్జగింపులకు అతీతంగా కాంగ్రెస్ ఆలోచించదని అన్నారు. తమ కుమారులు, కుమార్తెల భవిష్యత్తును రూపొందించడంలో మాత్రమే ఆ పార్టీ నేతలు బిజీగా ఉన్నారని ఆరోపించారు.

ప్రజల గురించి ఎన్నటికీ కాంగ్రెస్​ ఆలోచించలేదని ఆరోపిందారు . కానీ మోదీకి ప్రజలే కుటుంబమని, వారి కలలే ముఖ్యమని చెప్పారు. పేదలు, యువత, మహిళల సాధికారతతోనే అభివృద్ధి చెందిన ఛత్తీస్‌గఢ్‌ను నిర్మించవచ్చని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని గత కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల నిర్మాణాన్ని నిలిపివేసిందని, బీజేపీ ప్రభుత్వం దానిని వేగవంతం చేసిందని తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

మరోవైపు, సహకార రంగం ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులైన వంటనూనెలు, ఎరువుల దిగుబడుల తగ్గింపు విషయమై సహకార రంగం దేశానికి సహాయం చేయాలని మోదీ కోరారు. ఢిల్లీలోని దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు- PACSల పరిధిలో 11 గోదాములను ప్రారంభించిన సందర్భంగా మోదీ మాట్లాడారు.

“మన రైతుల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద నిల్వల పథకం/బండారన్‌ పథకం ప్రారంభించాం. దీని ద్వారా దేశం నలుమూలల వేలాది గిడ్డంగులు, వేలాది గోదాముల నిర్మాణం జరగనుంది. అలాగే 18వేల పీఏసీఎస్‌ల కంప్యూటరీకరణ కూడా పూర్తయింది. ఈ పనులన్నీ దేశంలో వ్యవసాయ మౌలిక సదుపాయాల విస్తరణకు, వ్యవసాయాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేయనున్నాయి.”

read also :Hyderabad: మహిళపై లైంగిక వేధింపుల ఆరోపణలపై కాంగ్రెస్‌ నేత

దేశవ్యాప్తంగా 11రాష్ట్రాల పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు- PACSల పరిధిలో 11 గోదాములను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అంతేకుండా దేశవ్యాప్తంగా 500 PACS పరిధిలో గోదాముల నిర్మాణం, వ్యవసాయ రంగంలో ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు శంకుస్థాపన కూడా చేశారు. దేశవ్యాప్తంగా 18 వేల PACSల్లో కంప్యూటరీకరణ ప్రాజెక్ట్‌కు కూడా ప్రధాని మోదీ ప్రారంభోత్సవం చేశారు.

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • congress
  • pm modi
  • Viksit Bharat Viksit Chhattisgarh program

Related News

Rare Earths Scheme

Rare Earths Scheme: చైనా ఆంక్షల మధ్య భారత్ కీలక నిర్ణయం.. రూ. 7,280 కోట్లతో!

భారతదేశంలో ఈ అయస్కాంతాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. 2025తో పోలిస్తే 2030 నాటికి ఇది రెట్టింపు అవుతుందని అంచనా. ప్రస్తుతం భారతదేశ అవసరాలు ఎక్కువగా దిగుమతుల ద్వారా తీర్చబడుతున్నాయి.

  • Virat Kohli

    Virat Kohli: ప్రధాని మోదీ విరాట్ కోహ్లీకి కాల్ చేయాలి: పాక్ మాజీ క్రికెటర్

  • Ram Temple

    Ram Temple: ఇది మీకు తెలుసా? అయోధ్య రామమందిరంలో 45 కిలోల బంగారం వినియోగం!

  • Bihar Speaker

    Bihar Speaker: బీహార్‌లో స్పీకర్ పదవిపై రాజకీయ పోరు.. బీజేపీ, జేడీయూలలో ఎవరికి దక్కేను?

  • Bihar Election Congress

    Bihar Election Results Effect : ఏడుగురు నేతలపై కాంగ్రెస్ వేటు

Latest News

  • Dwaraka Tirumala : ద్వారకాతిరుమలలో అంతరాలయ దర్శనానికి టికెట్

  • Orientia Tsutsugamushi : ఏపీ ప్రజలను వణికిస్తున్న ప్రమాదకర పురుగు..ఇది కుడితే అంతే సంగతి !!

  • IND vs SA : మీరు ఉన్నప్పుడే కదా వైట్‌వాష్ ..అశ్విన్‌కు సునీల్ గవాస్కర్ అదిరిపోయే కౌంటర్!

  • Telangana Global summit 2025 : 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా సీఎం మాస్టర్ ప్లాన్

  • Grama Sarpanch Nomination : తొలిరోజు నామినేషన్లు ఎన్నో తెలుసా?

Trending News

    • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

    • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

    • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

    • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

    • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd