Nipah Virus in Kerala: కేరళలో విజ్రంభిస్తున్న నిపా వైరస్, లాక్డౌన్ విధింపు
Nipah Virus in Kerala: కేరళలో నిపా వైరస్ విజ్రంభిస్తుంది. నిపా ఇన్ఫెక్షన్ కారణంగా ఇటీవల 24 ఏళ్ల యువకుడు మరణించాడు. దీంతో మలప్పురంలోని కంటైన్మెంట్ జోన్లలో కేరళ ప్రభుత్వం మంగళవారం లాక్డౌన్ లాంటి ఆంక్షలు విధించింది. మరణించిన రోగి కాంటాక్ట్ లిస్ట్లో ప్రస్తుతం 175 మంది ఉన్నారని అధికారులు తెలిపారు.
- By Praveen Aluthuru Published Date - 09:08 PM, Tue - 17 September 24

Nipah Virus in Kerala: నిపా ఇన్ఫెక్షన్ కారణంగా ఇటీవల 24 ఏళ్ల యువకుడు మరణించిన మలప్పురంలోని కంటైన్మెంట్ జోన్లలో కేరళ ప్రభుత్వం మంగళవారం లాక్డౌన్ లాంటి ఆంక్షలు విధించింది. మరణించిన రోగి కాంటాక్ట్ లిస్ట్లో ప్రస్తుతం 175 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. వారిలో 74 మంది ఆరోగ్య కార్యకర్తలు, 126 మంది ప్రాథమిక సంప్రదింపులు, 49 మంది ద్వితీయ సంప్రదింపు జాబితాలో ఉన్నారని తెలిపారు.
ప్రైమరీ కాంటాక్ట్ లిస్ట్లో 104 మంది హై రిస్క్ కేటగిరీ కింద ఉన్నారు. మంజేరి వైద్య కళాశాల ఆసుపత్రిలో పది మంది చికిత్స పొందుతున్నారని, 13 మంది వ్యక్తుల నమూనాలను పరీక్ష కోసం పంపినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ 66 బృందాలను ఏర్పాటు చేసింది. కాగా మృతుడి ఇంటికి మూడు కిలోమీటర్ల పరిధిలో ఫీవర్ సర్వే ప్రారంభమైంది.
మలప్పురం జిల్లాలోని రెండు పంచాయతీల్లోని ఐదు వార్డులను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు పెద్దఎత్తున గుమికూడవద్దని ఆదేశాలు జారీ చేశారు. కంటైన్మెంట్ జోన్లలోని దుకాణాలను రాత్రి 7 గంటలలోగా మూసివేయాలని జిల్లా అధికారులు కోరారు. కంటైన్మెంట్ జోన్లలో సినిమా హాళ్లు, పాఠశాలలు, కళాశాలలు, మదర్సాలు, అంగన్వాడీలు, ట్యూషన్ సెంటర్లు మూసి ఉంటాయి. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్లు ధరించాలని అధికారులు ప్రజలను కోరారు. జిల్లాలో వివాహాలు, అంత్యక్రియలు మరియు ఇతర కార్యక్రమాలలో పాల్గొనే వారి సంఖ్యను తగ్గించాలని నిబంధనలు పెట్టారు.
Also Read: Floods In Vijayawada : ఇంటికి రూ.25,000 – సీఎం చంద్రబాబు ప్రకటన