HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >India Pakistan Fighting Indian Airlines Cancel Flights Asian Airlines Re Route And Cancel Flights

Operation Sindoor: 9 ఎయిర్‌పోర్ట్‌లు క్లోజ్.. వాయుసేన ఆధీనంలోకి శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్

పాకిస్తాన్(Operation Sindoor) వైపు నుంచి దాడి జరిగే ముప్పు ఉన్నందున మన దేశంలోని 9 ఎయిర్‌పోర్ట్‌లను మూసివేశారు.

  • By Pasha Published Date - 09:01 AM, Wed - 7 May 25
  • daily-hunt
India Pakistan War Indian Airlines Asian Airlines Flight Services Operation Sindoor

Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై  భారత సైన్యం మంగళవారం అర్ధరాత్రి దాడులు చేసింది. ఈ దాడులు జరిగాక పాకిస్తాన్ అగ్గిమీద గుగ్గిలం అయ్యింది.  భారత్‌పై ప్రతిదాడి చేస్తామని ప్రకటించింది. దీనిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి కూడా సమాచారాన్ని అందించింది. ఈ లెక్కన భారత్‌లోని జమ్మూకశ్మీరు లక్ష్యంగా పాకిస్తాన్ దాడులు చేసే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. అందుకే అక్కడ భారత్ పెద్దఎత్తున యాంటీ మిస్సైల్ సిస్టమ్స్, గగనతల రక్షణ వ్యవస్థలను మోహరించింది.

పాక్ కాల్పులు..  ముగ్గురు భారత పౌరుల మృతి

పాకిస్తాన్ ఆర్మీ జమ్మూకశ్మీరులోని సరిహద్దు గ్రామాలపై భీకర కాల్పులు జరుపుతోంది. ఈ కాల్పుల్లో జమ్మూకశ్మీరులోని సరిహద్దు గ్రామానికి చెందిన  ముగ్గురు భారత పౌరులు చనిపోయారు. అమాయక ప్రజల ప్రాణాలను పాక్‌ తీసిందని భారత సైన్యం ఆరోపించింది.  దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని వెల్లడించింది.

Also Read :India Attack : భారత్ ఎటాక్.. పీఓకేలో 90 మంది ఉగ్రవాదులు హతం?

భారత్‌లోని 9 ఎయిర్‌పోర్ట్‌లు మూసివేత 

పాకిస్తాన్(Operation Sindoor) వైపు నుంచి దాడి జరిగే ముప్పు ఉన్నందున మన దేశంలోని 9 ఎయిర్‌పోర్ట్‌లను మూసివేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల, లేహ్, జమ్మూ, శ్రీనగర్‌, అమృతసర్‌, భుజ్, జామ్ నగర్, చండీగఢ్, రాజ్‌కోట్ సహా కీలక విమానాశ్రయాల నుంచి విమానాల రాకపోకలను రద్దు చేశారు. దేశంలోని 9 నగరాలకు విమానాల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని విమానాలు రద్దు అని తెలిపింది. ఇక జమ్మూకశ్మీరులోని శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌ను మూసివేశారు. దాన్ని  భారత వాయుసేన తమ ఆధీనంలోకి తీసుకుంది. పాక్ వైపు నుంచి దాడి జరిగే అవకాశం ఉన్నందున జమ్మూ కశ్మీర్‌లోని విద్యాసంస్థలను మూసివేశారు. ఇక వివిధ ఆసియా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహించే విమానయాన సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. భారత్, పాకిస్తాన్ గగనతలం మీదుగా వెళ్లే  విమాన సర్వీసులను రద్దు చేశాయి. పలు విమాన సర్వీసులను ఆయా దేశాల విమాన సర్వీసులను దారి మళ్లించాయి. ఇతర దేశాల గగనతలం మీదుగా వాటిని నడపాలని నిర్ణయించాయి.

Also Read :Pakistanis Deaths: 5 విమానాలను కూల్చేశాం.. చనిపోయింది 11 మందే.. మేమూ దాడి చేస్తాం : పాక్

ఇవాళే భారత్‌లో పెద్దస్థాయిలో మాక్ డ్రిల్ 

మరోవైపు ఈరోజు భారత్‌లో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ జరగబోతోంది.  దేశంలోని 244 జిల్లాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.యుద్ధం వంటివి వస్తే ఎలా స్పందించాలి ? ఎలా రక్షించుకోవాలి ? అనే అంశాలపై ఈ డ్రిల్స్ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పిస్తారు. భారత్‌పై గగనతల దాడులు జరిగినప్పుడు ప్రజలు ఎలా స్పందించాలి ? అందుకు అవసరమైన వార్నింగ్ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి ? వాటిని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి ? అనే అంశాలపైనా  ఇవాళ జరిగే మాక్ డ్రిల్స్‌లో ప్రజలకు తెలియపరుస్తారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Asian Airlines
  • Flight Services
  • india
  • India-Pakistan War
  • Indian airlines
  • Operation Sindoor
  • pakistan

Related News

IND vs SL

IND vs SL: భారత్-శ్రీలంక మధ్య కేవలం నామమాత్రపు మ్యాచ్.. టీమిండియా జ‌ట్టు ఇదేనా?

ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ భారత్, పాకిస్తాన్‌ల మధ్య సెప్టెంబర్ 28న జరుగుతుంది. భారత్ ఇప్పటికే ఫైనల్‌లో తన స్థానాన్ని ఖరారు చేసుకోగా, పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్ టికెట్‌ను ఖరారు చేసుకుంది.

  • Pithapuram

    Pithapuram : భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠాల్లో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం

  • PM Modi

    PM Modi: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ..!

  • Pakistan Bombs Its Own Peop

    Attack : సొంత ప్రజలపైనే పాక్ బాంబుల దాడి

  • Rajnath Singh

    Rajnath Singh: పాక్ చర్యలపై ఆధారపడి సిందూర్ పార్ట్ 2 మళ్లీ మొదలవొచ్చు : రాజ్‌నాథ్

Latest News

  • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

  • OG Success : OG సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న పవన్

  • Jubilee Hills Bypoll: బిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్

  • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

  • Boxoffice : అల్లు అర్జున్ రికార్డు ను బ్రేక్ చేయలేకపోయినా పవన్

Trending News

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    • BCCI: ఇద్ద‌రి ఆటగాళ్ల‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. కారణ‌మిదే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd