HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Three Civilians Killed In Indian Strikes Pakistan Minister

Pakistanis Deaths: 5 విమానాలను కూల్చేశాం.. చనిపోయింది 11 మందే.. మేమూ దాడి చేస్తాం : పాక్

పాకిస్తాన్(Pakistanis Deaths) పరిధిలోని మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను, వాటి మౌలిక సదుపాయాలను భారత ఆర్మీ ధ్వంసం చేసింది.

  • By Pasha Published Date - 07:54 AM, Wed - 7 May 25
  • daily-hunt
Pakistanis Deaths India Strike On Pakistan Khawaja Muhammad Asif

Pakistanis Deaths: పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ విరుచుకుపడింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ‘ఆపరేషన్‌ సింధూర్‌’ పేరుతో మన సైన్యం మెరుపు ఎటాక్స్ చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే)లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. పాకిస్తాన్(Pakistanis Deaths) పరిధిలోని మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను, వాటి మౌలిక సదుపాయాలను భారత ఆర్మీ ధ్వంసం చేసింది. పూర్తి కచ్చితత్వంతో ఈ ఎటాక్స్ చేసింది. పహల్గాం దాడికి బాధ్యులను జవాబుదారీగా ఉంచేందుకు కట్టుబడి ఉన్నామని భారత్‌ వెల్లడించింది. దాడుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని భారత రక్షణశాఖ ప్రకటించింది. అయితే ఈ దాడులపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా మహ్మద్ ఆసిఫ్ స్పందించారు. తమ దేశంపై భారత్ దాడి చేసిన విషయాన్ని ఆయన ధ్రువీకరించారు. తమపై దాడికి భారత్ మిస్సైళ్లను వాడిందన్నారు. బుధవారం తెల్లవారుజామున పాక్ భూభాగంపై భారత్ దాడి జరిగిందని ఖ్వాజా మహ్మద్ ఆసిఫ్ చెప్పారు. ‘‘పాకిస్తాన్‌లో భారత్ దాడి చేసిన ప్రదేశాలన్నీ ప్రజలు నివసించే ఏరియాలే. ముగ్గురు చనిపోయారని మాకు సమాచారం అందింది. చనిపోయిన వారిలో ఒక శిశువు కూడా ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు.

Also Read :India – Pakistan War : భారత్‌ ధ్వంసం చేసిన ఉగ్ర స్థావరాలు ఇవే..

పాకిస్తాన్ ఆర్మీ కథనం మరోలా..

పాకిస్తాన్ ఆర్మీ సైనిక వర్గాల కథనం మరోలా ఉంది. ‘‘భారత్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు పాకిస్తాన్‌లో 11 మంది పౌరులు చనిపోయారు. 35 మందికి గాయాలయ్యాయి. ఇద్దరి ఆచూకీ కనిపించడం లేదు. భారత సైన్యం మిస్సైళ్లతో పాకిస్తాన్‌పై దాడి చేసింది’’ అని పాక్ ఆర్మీ వర్గాలు అంతర్జాతీయ మీడియాకు తెలిపాయి. ‘‘పాకిస్తాన్‌లోని సైనిక శిబిరాలకు ఎలాంటి నష్టమూ జరగలేదు. జనావాసాలపైనే భారత్ దాడి చేసింది. ఆరు ప్రదేశాల్లో 24 సార్లు భారత్ దాడి చేసింది. ఈ దాడుల్లో పాకిస్తాన్ సైన్యానికి కానీ, యుద్ధ విమానాలకు కానీ ఎలాంటి నష్టమూ జరగలేదు. మా సైనికులు సాహసోపేతంగా వ్యవహరించి భారత్‌కు చెందిన ఐదు యుద్ధ విమానాలను కూల్చేశారు. వాటిలో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు, 1 సుఖోయ్ ఎస్‌యూ-30, 1 మిగ్ -29 ఉన్నాయి’’  అని పాకిస్తాన్ సైనిక వర్గాలు చెప్పాయి.

Also Read :India – Pakistan War : పాక్ స్థావరాలపై భారత్ మెరుపు దాడులు – 30 మంది ఉగ్రవాదులు మృతి

ఐరాసకు పాక్ సమాచారం.. ప్రతిదాడి చేస్తామని వెల్లడి

భారత ఆర్మీ చేసిన దాడిపై వెంటనే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి పాకిస్తాన్ సమాచారాన్ని అందజేసింది. భారత్ చేసిన దాడికి, ప్రతిదాడి చేసే హక్కు తమకు ఉంటుందని తెలిపింది. ‘‘పాకిస్తాన్  సార్వభౌమత్వాన్ని భారత్ ధిక్కరిస్తోంది’’ అని పాక్ ఆరోపించింది. భారత్ మాత్రం.. ‘‘మేం కచ్చితమైన లక్ష్యాలపైనే దాడి చేశాం.. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాం. జనావాసాలపై కానీ, సైనిక స్థావరాలపై కానీ దాడులు చేయలేదు’’ అని స్పష్టం చేసింది. 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • India Strike
  • India vs Pakistan
  • Khawaja Muhammad Asif
  • Operation Sindoor
  • pakistan
  • Pakistan minister
  • Pakistanis Deaths

Related News

IND vs SL

IND vs SL: భారత్-శ్రీలంక మధ్య కేవలం నామమాత్రపు మ్యాచ్.. టీమిండియా జ‌ట్టు ఇదేనా?

ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ భారత్, పాకిస్తాన్‌ల మధ్య సెప్టెంబర్ 28న జరుగుతుంది. భారత్ ఇప్పటికే ఫైనల్‌లో తన స్థానాన్ని ఖరారు చేసుకోగా, పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్ టికెట్‌ను ఖరారు చేసుకుంది.

  • Suryakumar

    SKY: పహల్గాం వ్యాఖ్యలపై ఐసీసీ వార్నింగ్ లేదా జరిమానా ప్రమాదంలో సూర్యకుమార్

  • Pithapuram

    Pithapuram : భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠాల్లో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం

  • PM Modi

    PM Modi: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ..!

  • Pakistan Bombs Its Own Peop

    Attack : సొంత ప్రజలపైనే పాక్ బాంబుల దాడి

Latest News

  • Paytm : మీరు పేటిఎం వాడుతున్నారా..? అయితే బంగారు కాయిన్‌ గెల్చుకునే ఛాన్స్ !!

  • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

  • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

  • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

  • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd