HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Three Civilians Killed In Indian Strikes Pakistan Minister

Pakistanis Deaths: 5 విమానాలను కూల్చేశాం.. చనిపోయింది 11 మందే.. మేమూ దాడి చేస్తాం : పాక్

పాకిస్తాన్(Pakistanis Deaths) పరిధిలోని మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను, వాటి మౌలిక సదుపాయాలను భారత ఆర్మీ ధ్వంసం చేసింది.

  • By Pasha Published Date - 07:54 AM, Wed - 7 May 25
  • daily-hunt
Pakistanis Deaths India Strike On Pakistan Khawaja Muhammad Asif

Pakistanis Deaths: పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ విరుచుకుపడింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ‘ఆపరేషన్‌ సింధూర్‌’ పేరుతో మన సైన్యం మెరుపు ఎటాక్స్ చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే)లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. పాకిస్తాన్(Pakistanis Deaths) పరిధిలోని మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను, వాటి మౌలిక సదుపాయాలను భారత ఆర్మీ ధ్వంసం చేసింది. పూర్తి కచ్చితత్వంతో ఈ ఎటాక్స్ చేసింది. పహల్గాం దాడికి బాధ్యులను జవాబుదారీగా ఉంచేందుకు కట్టుబడి ఉన్నామని భారత్‌ వెల్లడించింది. దాడుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని భారత రక్షణశాఖ ప్రకటించింది. అయితే ఈ దాడులపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా మహ్మద్ ఆసిఫ్ స్పందించారు. తమ దేశంపై భారత్ దాడి చేసిన విషయాన్ని ఆయన ధ్రువీకరించారు. తమపై దాడికి భారత్ మిస్సైళ్లను వాడిందన్నారు. బుధవారం తెల్లవారుజామున పాక్ భూభాగంపై భారత్ దాడి జరిగిందని ఖ్వాజా మహ్మద్ ఆసిఫ్ చెప్పారు. ‘‘పాకిస్తాన్‌లో భారత్ దాడి చేసిన ప్రదేశాలన్నీ ప్రజలు నివసించే ఏరియాలే. ముగ్గురు చనిపోయారని మాకు సమాచారం అందింది. చనిపోయిన వారిలో ఒక శిశువు కూడా ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు.

Also Read :India – Pakistan War : భారత్‌ ధ్వంసం చేసిన ఉగ్ర స్థావరాలు ఇవే..

పాకిస్తాన్ ఆర్మీ కథనం మరోలా..

పాకిస్తాన్ ఆర్మీ సైనిక వర్గాల కథనం మరోలా ఉంది. ‘‘భారత్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు పాకిస్తాన్‌లో 11 మంది పౌరులు చనిపోయారు. 35 మందికి గాయాలయ్యాయి. ఇద్దరి ఆచూకీ కనిపించడం లేదు. భారత సైన్యం మిస్సైళ్లతో పాకిస్తాన్‌పై దాడి చేసింది’’ అని పాక్ ఆర్మీ వర్గాలు అంతర్జాతీయ మీడియాకు తెలిపాయి. ‘‘పాకిస్తాన్‌లోని సైనిక శిబిరాలకు ఎలాంటి నష్టమూ జరగలేదు. జనావాసాలపైనే భారత్ దాడి చేసింది. ఆరు ప్రదేశాల్లో 24 సార్లు భారత్ దాడి చేసింది. ఈ దాడుల్లో పాకిస్తాన్ సైన్యానికి కానీ, యుద్ధ విమానాలకు కానీ ఎలాంటి నష్టమూ జరగలేదు. మా సైనికులు సాహసోపేతంగా వ్యవహరించి భారత్‌కు చెందిన ఐదు యుద్ధ విమానాలను కూల్చేశారు. వాటిలో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు, 1 సుఖోయ్ ఎస్‌యూ-30, 1 మిగ్ -29 ఉన్నాయి’’  అని పాకిస్తాన్ సైనిక వర్గాలు చెప్పాయి.

Also Read :India – Pakistan War : పాక్ స్థావరాలపై భారత్ మెరుపు దాడులు – 30 మంది ఉగ్రవాదులు మృతి

ఐరాసకు పాక్ సమాచారం.. ప్రతిదాడి చేస్తామని వెల్లడి

భారత ఆర్మీ చేసిన దాడిపై వెంటనే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి పాకిస్తాన్ సమాచారాన్ని అందజేసింది. భారత్ చేసిన దాడికి, ప్రతిదాడి చేసే హక్కు తమకు ఉంటుందని తెలిపింది. ‘‘పాకిస్తాన్  సార్వభౌమత్వాన్ని భారత్ ధిక్కరిస్తోంది’’ అని పాక్ ఆరోపించింది. భారత్ మాత్రం.. ‘‘మేం కచ్చితమైన లక్ష్యాలపైనే దాడి చేశాం.. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాం. జనావాసాలపై కానీ, సైనిక స్థావరాలపై కానీ దాడులు చేయలేదు’’ అని స్పష్టం చేసింది. 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • India Strike
  • India vs Pakistan
  • Khawaja Muhammad Asif
  • Operation Sindoor
  • pakistan
  • Pakistan minister
  • Pakistanis Deaths

Related News

India

India: జూనియర్ హాకీ ప్రపంచ కప్‌.. భారత్ అద్భుత విజయం!

మొదటి క్వార్టర్‌లో భారత్- చిలీ ఆటగాళ్లు ఒకరిపై ఒకరు ఒత్తిడి తెచ్చినా ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి.

  • Imran Khan

    Imran Khan: ఇమ్రాన్ ఖాన్ నిజంగానే చ‌నిపోయారా? సీఎంకే షాక్ ఇచ్చిన పాక్‌!

  • Commonwealth Games

    Commonwealth Games: అహ్మదాబాద్‌లో చరిత్రాత్మక ఘట్టం.. 2030 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య నగరం ఖరారు!

  • Imran Khan

    Imran Khan: ఇమ్రాన్ ఖాన్ చ‌నిపోయారా? 3 వారాలుగా కుటుంబానికి నో ఎంట్రీ!

  • Nepal Currency

    Nepal Currency: ఇకపై చైనాలో నేపాల్ కరెన్సీ ముద్రణ.. భారతదేశం ఎందుకు వైదొలిగింది?

Latest News

  • Aadhaar: ఆధార్ కార్డుపై ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం!

  • Messi: హైద‌రాబాద్‌కు లియోనెల్ మెస్సీ.. ఎప్పుడంటే?!

  • Cyclone Ditwah : శ్రీలంక కు దిత్వా తుపాను ఎఫెక్ట్.. భారత్ సాయం!

  • Cyclone Ditwah to bring Heavy Rains to AP : ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – హోంమంత్రి అనిత

  • Mutual Fund : ఈక్విటీల్లో కొత్త స్కీమ్స్ లాంచ్..లిస్ట్‌లో చేరిన టాటా ఫండ్..సబ్‌స్క్రిప్షన్ డేట్ ఫిక్స్!

Trending News

    • Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత అరెస్ట్..స్టేషన్‌కు తరలించిన పోలీసులు..!

    • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

    • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

    • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

    • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd