HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >India Once Again Helps 80 Ndrf Personnel To Myanmar

Earthquake: భారత్‌ మరోసారి సాయం.. మయన్మార్‌కు 80 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది!

మరికొన్ని గంటల్లో 80 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది అక్కడికి బయలుదేరనున్నారు’’ అని సీనియర్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. కాగా.. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 4.2 తీవ్రతతో మయన్మార్‌లోని భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు.

  • Author : Latha Suma Date : 29-03-2025 - 2:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
India once again helps.. 80 NDRF personnel to Myanmar!
India once again helps.. 80 NDRF personnel to Myanmar!

Earthquake : మ‌య‌న్మార్‌, థాయ్‌లాండ్‌ల‌ను శుక్ర‌వారం నాడు రెండు భారీ భూకంపాలు కుదిపేసిన విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌కృతి విప‌త్తు కార‌ణంగా మృతుల సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది. అంతేకాక.. అక్కడి ప్రజల జీవనవిధానం అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటివరకు మయన్మార్‌లో 1000 మందికి పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రకృతి విపత్తుతో అల్లాడిపోతున్న ఆ దేశానికి సాయం చేసేందుకు మరోసారి భారత్‌ ముందుకొచ్చింది. 80 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని అక్కడికి పంపనుంది. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు వెల్లడించారు. మరికొన్ని గంటల్లో 80 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది అక్కడికి బయలుదేరనున్నారు’’ అని సీనియర్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. కాగా.. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 4.2 తీవ్రతతో మయన్మార్‌లోని భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు.

Read Also: Ticket Cancellation : కొత్త క్యాన్సిలేషన్ విధానాన్ని తీసుకొచ్చిన ఇండియన్ రైల్వే

మయన్మార్‌కు సాయం అందించేందుకు భారత్‌ సిద్ధమైంది. ఈవిషయంపై సమావేశమై చర్చించారు. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఈక్రమంలోనే బాధిత దేశానికి భారత్‌ ఆపన్నహస్తం అందిస్తోంది. ఇప్పటికే ఆపరేషన్‌ బ్రహ్మ కింద మయన్మార్‌కు 15 టన్నుల సహాయక సామగ్రిని పంపించింది. టెంట్లు, దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు, జనరేటర్లు ఆహార ప్యాకెట్లను అందించింది. భూకంపం కారణంగా వెయ్యి మందికి పైగా చనిపోయారు. మరో 2 వేల మందికి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. ఓ భారీ భవంతి కూలిన ఘటనలో దాదాపు 100 మంది నిర్మాణ కార్మికులు గల్లంతయ్యారు. ఈ విపత్తు కారణంగా మృతుల సంఖ్య 10వేలు దాటే అవకాశం ఉందని అమెరికా ఏజెన్సీ హెచ్చరించింది.

ఈనేపథ్యంలోనే మరోసారి మయన్మార్‌ను ఆదుకునేందుకు సిద్ధమైన భారత్‌.. 80 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని అక్కడి సహాయక చర్యల్లో భాగం చేయనుంది.అమెరికా, ఇండోనేషియా, చైనా కూడా అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించాయి. ప్రభావిత దేశాలకు సహాయక సామగ్రి పంపుతున్నామని ఐక్యరాజ్యసమితి జనరల్‌ సెక్రటరీ ఆంటోనియో-గుటెరస్‌ వెల్లడించారు. మరోవైపు మయన్మార్‌లోని పరిస్థితిపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ ‘ఎక్స్‌’ వేదికగా ఆందోళన వ్యక్తంచేశారు. మృతులకు సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నా. ఈ క్లిష్ట సమయంలో మయన్మార్‌కు భారత్‌ అండగా ఉంటుంది. మానవతా సాయం, సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని తరలించాం. బాధిత దేశానికి మేము అండగా ఉంటాం అని హామీ ఇచ్చారు. మయన్మార్‌ సీనియర్‌ జనరల్‌ మిన్‌ అంగ్‌ హ్లైంగ్‌తో ఈ విషయంపై మాట్లాడాను. అక్కడి పరిస్థితిని భారత్‌ ప్రభుత్వం తెలుసుకుంది. ఈ ఘటనపై విచారం వ్యక్తంచేస్తున్నాం అని ప్రధాని మోడీ అన్నారు.

Read Also:  Vallabhaneni Vamsi : ఒక రోజు పోలీస్‌ కస్టడీకి వల్లభనేని వంశీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 80 NDRF personnel
  • earthquake
  • india
  • myanmar
  • NDRF Team
  • thailand

Related News

Vijay Mallya

Vijay Mallya: ‘ఇండియా కు రానంటే రాను’ – బాంబే హైకోర్టుకు తెలిపిన విజయ్ మాల్యా!

తాను భారత్‌కు తిరిగి వచ్చే ప్రసక్తే లేదని ఆయన బాంబే హైకోర్టుకు స్పష్టం చేశారు. తనను 'పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు' (Fugitive Economic Offender) గా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ మాల్యా దాఖలు చేసిన పిటిషన్లను విచారించే క్రమంలో

  • Sundar Pichai

    ఏఐ సమ్మిట్‌లో కీలక ప్రసంగం.గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌

  • Indian Money

    Money Transaction : దేశంలో భారీగా చేతులు మారుతున్న డబ్బు

  • UPI One World

    విదేశీ అతిథుల కోసం ‘UPI One World’ సేవలు ప్రారంభం!

  • Got India's commitment to stop buying Russian oil

    రష్యా చమురు కొనుగోలు నిలిపేస్తామని భారత్‌ హామీ..అమెరికా కామెంట్లు

Latest News

  • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

  • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

  • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

  • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

Trending News

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd