Operation Sindoor : ఉద్రిక్తతలు పెంచే ఉద్దేశం భారత్కు లేదు.. పాక్ ప్రయత్నిస్తే గట్టిగా ప్రతిస్పందిస్తాం: అజిత్ దోవల్
పాకిస్థాన్ పరిస్థితులను మరింత ఉద్రిక్తత తాలూకుగా మలచే ప్రయత్నం చేస్తే, భారత్ నుంచి మరింత గట్టి ప్రతిస్పందన ఉండబోతుందని స్పష్టం చేశారు. అయితే భారత్ ఉద్దేశం శాంతి స్థాపనకే అని, ఉద్రిక్తతల పట్ల దేశానికి ఆసక్తి లేదని ఆయన వివరించారు.
- Author : Latha Suma
Date : 07-05-2025 - 5:38 IST
Published By : Hashtagu Telugu Desk
Operation Sindoor : పాకిస్థాన్ ప్రేరిత ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు భారత్ తీవ్ర చర్యలు చేపట్టింది. ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై లక్ష్యసాధిత దాడులు జరిపింది. ఈ చర్యల నేపథ్యంలో, భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ ఇతర దేశాలతో చురుకైన సంప్రదింపులు జరుపుతున్నారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతు కూడగట్టే క్రమంలో దోవల్ ఇప్పటికే ఎనిమిది దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపారు.
Read Also: Operation Sindoor : 25 నిమిషాల్లోనే పాక్ ను ఉ** పోయించారు..మరి 24 గంటలు టైం ఇస్తే..!!
ఈ సందర్భంగా ఆయన చైనా విదేశాంగ మంత్రితో మాట్లాడారు. పాకిస్థాన్ పరిస్థితులను మరింత ఉద్రిక్తత తాలూకుగా మలచే ప్రయత్నం చేస్తే, భారత్ నుంచి మరింత గట్టి ప్రతిస్పందన ఉండబోతుందని స్పష్టం చేశారు. అయితే భారత్ ఉద్దేశం శాంతి స్థాపనకే అని, ఉద్రిక్తతల పట్ల దేశానికి ఆసక్తి లేదని ఆయన వివరించారు. అమెరికా, బ్రిటన్, జపాన్, రష్యా, ఫ్రాన్స్, సౌదీ అరేబియా తదితర దేశాలకు ‘ఆపరేషన్ సిందూర్’ వెనుక ఉన్న కారణాలను వివరించారు. పహల్గాం దాడి అనంతరం ఉగ్రవాదుల శిబిరాలపై తక్షణమే స్పందించడం తప్పనిసరైన చర్యగా పేర్కొన్నారు.
‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా భారత సైన్యం పాక్లోని నాలుగు, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఐదు ఉగ్ర స్థావరాలపై క్షిపణుల దాడులు జరిపింది. అంతర్జాతీయ సరిహద్దుకు 30 కి.మీ. దూరంలో ఉన్న గుల్పూర్ (లష్కరే తోయిబా) శిబిరం కూడా ఈ దాడుల్లో ప్రధాన లక్ష్యంగా మారింది. రాజౌరి , ఫూంచ్ ప్రాంతాల్లో యాక్టివ్గా ఉన్న ఉగ్రవాదులే గతంలో పూంచ్ దాడులకు పాల్పడినట్టు భారత భద్రతా సంస్థలు గుర్తించాయి. ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం, దాదాపు 80 మంది ఉగ్రవాదులు ఈ దాడుల్లో మృతి చెందినట్లు తెలుస్తోంది. బవహల్పూర్లోని జైషే మహ్మద్ క్యాంప్, మురిద్కేలోని లష్కరే తోయిబా శిబిరాల్లో అత్యధిక నష్టాలు జరిగినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. భవిష్యత్తులో ఉగ్రవాదంపై పోరాటంలో భారత మిత్ర దేశాలతో సమన్వయం కొనసాగుతుందని అజిత్ దోవల్ పేర్కొన్నారు.
Read Also: Peddireddy Ramachandra Reddy: వైసీపీకి హ్యాండిచ్చిన పెద్దిరెడ్డి! అప్పుడు ఆలా? ఇప్పుడు ఇలా?