Food Grain Production: రికార్డు స్థాయిలో గోధుమలు, బియ్యం ఉత్పత్తి.. కానీ పప్పుధాన్యాలు దిగుమతి..!
దేశంలో గోధుమ పంట (Wheat Crop) సాగు జరుగుతోంది. రైతులు గోధుమలతో మార్కెట్కు చేరుకుంటున్నారు. దేశవ్యాప్తంగా గోధుమల సేకరణ వివరాలను కేంద్ర ప్రభుత్వం సేకరిస్తోంది. గత కొన్నేళ్లుగా గోధుమలు, వరి, ఇతర కూరగాయల పంటల (Food Grain Production) లెక్కలు తెరపైకి వచ్చాయి.
- Author : Gopichand
Date : 25-04-2023 - 12:45 IST
Published By : Hashtagu Telugu Desk
దేశంలో గోధుమ పంట (Wheat Crop) సాగు జరుగుతోంది. రైతులు గోధుమలతో మార్కెట్కు చేరుకుంటున్నారు. దేశవ్యాప్తంగా గోధుమల సేకరణ వివరాలను కేంద్ర ప్రభుత్వం సేకరిస్తోంది. గత కొన్నేళ్లుగా గోధుమలు, వరి, ఇతర కూరగాయల పంటల (Food Grain Production) లెక్కలు తెరపైకి వచ్చాయి. గత 8 ఏళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. దేశంలో గోధుమలు, బియ్యం ఉత్పత్తిలో రికార్డు స్థాయిలో పెరుగుదల నమోదైంది. దీంతోపాటు ఇతర పంటల ఉత్పత్తిపైనా దృష్టి సారిస్తున్నారు. మీడియా నివేదికల ప్రకారం.. ప్రోగ్రామ్ అమలు మంత్రిత్వ శాఖ గణాంకాలు తెరపైకి వచ్చాయి.
గణాంకాల ప్రకారం.. భారతదేశంలో బియ్యం, గోధుమల ఉత్పత్తి చాలా వేగంగా పెరిగింది. 2014-15లో బియ్యం, గోధుమల ఉత్పత్తిలో 4.2 శాతం పెరుగుదల నమోదైంది. 2021-22లో 5.8 పెరుగుదల ఉంది. దేశంలో పండ్లు, కూరగాయల ఉత్పత్తి కూడా పెరిగింది. వాటి ఉత్పత్తి 1.5 శాతం పెరిగింది. దేశంలోని మొత్తం ఆహారోత్పత్తిలో పండ్లు, కూరగాయల వాటా 28.1 శాతానికి పెరిగింది. ఇది స్వతహా రికార్డుగా భావిస్తున్నారు.
Also Read: Remedies for nosebleeds : వేసవిలో ముక్కు నుంచి రక్తస్రావం అవుతోందా?ఈ చిట్కాలతో చెక్ పెట్టొచ్చు.
బియ్యం ఎగుమతి పరంగా భారతదేశం ప్రధాన ఎగుమతి దేశంగా కనిపిస్తుంది. కానీ పప్పుధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తి పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉంది. దేశీయ వినియోగానికి అనుగుణంగా భారత ప్రభుత్వం విదేశాల నుండి పప్పులు, నూనె గింజలను దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దేశంలో ఏటా పప్పుధాన్యాలు, నూనె గింజల కొరత ఏర్పడుతోంది. సరఫరా జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. పప్పులు సరఫరా కాకపోవడం వల్ల వాటి ధరలపైనా ప్రభావం కనిపిస్తోంది. అర్హర్ దాల్ ధరలో నిరంతర పెరుగుదల నమోదవుతోంది. ఢిల్లీలో అర్హర్ పప్పు నెల క్రితం కిలో రూ.120 ఉండగా, ప్రస్తుతం కిలో రూ.126కి పెరిగింది. జైపూర్లో కిలో పప్పు ధర రూ.119 ఉండగా, ఇప్పుడు కిలో రూ.130కి పెరిగింది.