Delhi Lok Sabha Elections 2024: ఆప్ కి ఓటు వేయనున్న రాహుల్ గాంధీ
ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేస్తారని, రెండు మిత్రపక్షాల మధ్య బలమైన బంధానికి గుర్తుగా జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఆప్ అభ్యర్థికి నేను ఓటేస్తానని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
- Author : Vamsi Chowdary Korata
Date : 19-05-2024 - 11:41 IST
Published By : Hashtagu Telugu Desk
Delhi Lok Sabha Elections 2024: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేస్తారని, రెండు మిత్రపక్షాల మధ్య బలమైన బంధానికి గుర్తుగా జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఆప్ అభ్యర్థికి నేను ఓటేస్తానని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
కేజ్రీవాల్ కాంగ్రెస్ బటన్ను నొక్కుతారు మరియు నేను ఆప్ బటన్ను నొక్కుతాను రాహుల్ అన్నారు. దేశ రాజధానిలోని ఏడు లోక్సభ స్థానాల్లో తమ కూటమి విజయం సాధించేందుకు కాంగ్రెస్, ఆప్ కార్యకర్తలు కలిసి పని చేయాలని ఆయన కోరారు.ఈ క్రమంలో భారతదేశ సమస్యలపై చర్చకు ప్రధాని మోదీకి సవాలు విసిరారు.”ప్రధాని మోడీతో ఎప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను, కానీ అతను రాలేడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను రాహుల్ పేర్కొన్నారు. ప్రధాని తన ముందుకు వస్తే క్రోనీ క్యాపిటలిజం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వ్యవసాయ సమస్యలపై ప్రశ్నలు వేస్తానని అన్నారు.
మోదీ కేవలం 22-25 మంది కోసం మాత్రమే పనిచేశారు. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు మరియు ఇతర పన్నులు చిన్న వ్యాపారాలపై ప్రభావం చూపాయి. అదానీ మరియు అంబానీల వేల కోట్ల రూపాయలను మాఫీ చేశారు. రైల్వేలు మరియు ఇతర పిఎస్యులను ప్రైవేటీకరించడం అని రాహుల్ గాంధీ అన్నారు. తాజాగా రద్దు చేయబడిన ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని ప్రవేశపెట్టడం గురించి ఆయన ప్రధానమంత్రిని ప్రశ్నించారు మరియు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) వంటి కేంద్ర సంస్థల సహాయంతో “డబ్బు దోపిడీ” చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
జీఎస్టీని సరళతరం చేస్తామని, తద్వారా చిన్న, మధ్యతరహా వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని, తద్వారా ఉపాధి కల్పన సాధ్యమవుతుందన్నారు. కాగా ఆరో దశ లోక్సభ ఎన్నికలలో దేశ రాజధానిలో మే 25న పోలింగ్ జరగనుంది మరియు జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.
Also Read: Migraine: మీరు మైగ్రేన్తో బాధపడుతున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే..!