Manmohan Singh : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తి
ప్రత్యేక స్మారకం కోసం స్థలం కేటాయించాలని ప్రధాని మోడీకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు.
- Author : Latha Suma
Date : 28-12-2024 - 12:46 IST
Published By : Hashtagu Telugu Desk
Manmohan Singh : భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు బోధ్ నిగమ్ ఘాట్లో పూర్తయ్యాయి. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. మూడు సైన్యాలు మాజీ ప్రధాని భౌతికకాయానికి వందనం చేశాయి. కాగా, మన్మోహన్ సింగ్ (92) గురువారం రాత్రి ఢిల్లీ ఎయిమ్స్లో తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఢిల్లీలోని నిగమ్ బోద్ ఘాట్లో ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి. అంతకుముందు శుక్రవారం ప్రధాని మోడీ, అధ్యక్షుడు ముర్ము సహా దేశంలోని నాయకులందరూ ఆయన నివాసంలో నివాళులర్పించారు.
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశ రాజకీయాలలో చాలా తక్కువగా మాట్లాడే వ్యక్తి. కానీ మాట్లాడేటప్పుడు మాత్రం చాలా గట్టిగా మాట్లాడతారు. ఇప్పుడు ఆ వ్యక్తిత్వం ఎప్పటికీ సైలెంట్ అయిపోయింది. భారతదేశం యొక్క 13వ ప్రధానమంత్రి మరియు గౌరవనీయమైన పదవిని అలంకరించిన మొదటి సిక్కు అయిన మన్మోహన్ సింగ్. మే 2004 నుండి మే 2014 వరకు కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (UPA) ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. మాజీ ప్రధాని దివంగత డాక్టర్ మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం కోసం స్థలం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేబినెట్ సమావేశం ముగిసిన వెంటనే, స్మారక చిహ్నం కోసం ప్రభుత్వం స్థలాన్ని కేటాయిస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు తెలియజేశారు.
ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ రోడ్డులోని మన్మోహన్ సింగ్ నివాసం నుంచి భౌతికకాయానికి శనివారం ఉదయం 8 గంటలకు కాంగ్రెస్ పార్టీకి తరలించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు సందర్శించి నివాళులర్పించారు. 8.30 నుంచి 9.30 గంటల వరకు అక్కడే ఉంచారు. అనంతరం అక్కడ నుంచి నిగమ్ బోధ్ ఘాట్ వరకు అంతిమయాత్ర జరిపారు. ఘాట్లో 11.15 నుంచి హోం శాఖ కార్యదర్శి మొదలు.. 11.42 గంటలకు ఆఖరును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చివరి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియలు జరిగాయి. ప్రత్యేక స్మారకం కోసం స్థలం కేటాయించాలని ప్రధాని మోడీకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు.
Read Also: New Year Events : నూతన సంవత్సర వేడుకలపై హైదరాబాద్ పోలీసులు అలర్ట్