HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Ecs Key Decision Now Preparing For A Comprehensive Revision Of Voter Lists Across The Country

Election Commission : ఈసీ కీలక నిర్ణయం.. ఇక దేశవ్యాప్తంగా ఓటరు జాబితాల సమగ్ర సవరణకు సన్నద్ధం!

బిహార్‌లో జరుగుతున్న విధంగా వచ్చే నెల నుంచి ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే విధంగా సమగ్ర సవరణ చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈసీ ఇప్పటికే రాష్ట్రాల ఎన్నికల యంత్రాంగాలను అప్రమత్తం చేసింది. బిహార్‌లో పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో, సుప్రీం కోర్టు ఈ నెల 10న వాటిని విచారించి, ఈ ప్రక్రియను చేపట్టే రాజ్యాంగబద్ధమైన అధికారం ఈసీకి ఉందని చెప్పింది.

  • By Latha Suma Published Date - 10:42 AM, Mon - 14 July 25
  • daily-hunt
EC's key decision.. Now the voters' list will be revised across the country..!!
EC's key decision.. Now the voters' list will be revised across the country..!!

Election Commission : బిహార్‌లో ఓటరు జాబితాలపై ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) చేపట్టే అధికారం భారత ఎన్నికల సంఘానికి ఉందని సుప్రీం కోర్టు ఇటీవల స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోందని సమాచారం. బిహార్‌లో జరుగుతున్న విధంగా వచ్చే నెల నుంచి ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే విధంగా సమగ్ర సవరణ చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈసీ ఇప్పటికే రాష్ట్రాల ఎన్నికల యంత్రాంగాలను అప్రమత్తం చేసింది. బిహార్‌లో పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో, సుప్రీం కోర్టు ఈ నెల 10న వాటిని విచారించి, ఈ ప్రక్రియను చేపట్టే రాజ్యాంగబద్ధమైన అధికారం ఈసీకి ఉందని చెప్పింది. అయితే, త్వరలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో, ఇది అనువైన సమయం కాదని అభిప్రాయపడింది. అయినప్పటికీ, ఈ ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.

Read Also: Ujjaini Mahankali Bonalu : వైభవంగా రంగం కార్యక్రమం..ఈ ఏడాది అమ్మవారు ఏం చెప్పారంటే..?

ఈ సవరణ కసరత్తు ద్వారా, దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలను సమీక్షించి, వివాదాస్పద లేదా చెల్లని ఎంట్రీలను తొలగించాలన్నదే లక్ష్యం. ముఖ్యంగా విదేశీ అక్రమ వలసదారులు  బంగ్లాదేశ్, మయన్మార్ వంటి దేశాల నుండి వచ్చిన వారు ఓటర్ల జాబితాలో ఉండకూడదని ఈసీ అభిప్రాయపడుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఈ వలసదారులపై కఠిన చర్యలు తీసుకున్న దృష్ట్యా, ఈ ప్రక్రియకు ప్రాధాన్యం పెరిగింది. దేశంలోని చాలా రాష్ట్రాలు 2002 నుంచి 2004 మధ్య కాలంలో ఓటరు జాబితాలపై సమగ్ర సవరణ చేపట్టాయి. అయితే ఆ తర్వాత కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఎలాంటి సవరణ జరగలేదు. ఉదాహరణకు, ఢిల్లీలో చివరిసారి 2008లో ఈ ప్రక్రియ నిర్వహించగా, ఆ జాబితా ప్రస్తుతం సీఈవో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఉత్తరాఖండ్‌లో 2006లో సవరణ జరగగా, ఆ రాష్ట్ర వెబ్‌సైట్‌లో ఆ జాబితా ఉంచారు. ఈ నేపథ్యంలో, తాజా సమగ్ర సవరణ దేశవ్యాప్తంగా ఓటరు సమాచారాన్ని శుద్ధి చేయడంలో సహాయపడనుంది.

ఈ ప్రక్రియలో ఓటర్ల గుర్తింపును నిర్ధారించేందుకు ఆధార్‌, రేషన్‌కార్డు, ఓటరు ఐడీ వంటి పత్రాలను పరిశీలించాలని ఈసీ సూచించబడింది. ఇవి తప్పనిసరిగా కాకపోయినా, ఓటర్ల గుర్తింపును ధృవీకరించడంలో ఉపయుక్తమవుతాయని భావిస్తున్నారు. బిహార్‌లో ఈ అంశంపై దాఖలైన పది పిటిషన్లపై తదుపరి విచారణ ఈ నెల 28న సుప్రీం కోర్టులో జరుగనుంది. ఆ విచారణ అనంతరం దేశవ్యాప్తంగా సమగ్ర సవరణ చేపట్టాలా లేదా అన్నదిపై ఈసీ తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. దేశ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనది. అసత్యమైన ఎంట్రీలు, అక్రమంగా ఓటు హక్కు వినియోగం వంటి పరిస్థితుల నివారణకు ఓటరు జాబితాల సవరణ అత్యంత కీలకం. ఎన్నికల సంఘం చేపట్టబోయే ఈ దేశవ్యాప్త సమగ్ర సవరణతో, ఓటింగ్ ప్రక్రియ మరింత పారదర్శకంగా, న్యాయంగా మారే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also: Shubhanshu Shukla : కాసేపట్లో భూమిపైకి శుభాంశు శుక్లా


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bangladesh
  • bihar
  • Election commission
  • Foreign illegal immigrants
  • myanmar
  • Special Intensive Revision
  • voter list

Related News

Local elections in AP 3 months in advance.. State Election Commission in preparations!

AP : ఏపీలో 3 నెలల ముందే స్థానిక ఎన్నికలు..సన్నాహకాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం!

చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారం, ఐదేళ్ల పదవీకాలం ముగిసే ముందు మూడునెలలకే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ తెలిపారు. ఈ మేరకు ఆమె బుధవారం పంచాయతీరాజ్, పురపాలక శాఖల కమిషనర్లకు లేఖలు పంపారు.

  • A Bihar-like situation should not happen here: Stalin appeals to party cadres

    Vote Theft : బీహార్ తరహా పరిస్థితి ఇక్కడ రాకుండా చూడాలి : పార్టీ శ్రేణులకు స్టాలిన్ పిలుపు

Latest News

  • Production of Eggs : గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నం.1

  • Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

  • GST 2.0 : GST 2.0తో ప్రభుత్వానికి ఎంత నష్టమంటే?

  • Kavitha Vs Harish : నాపై చేసిన ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా..కవిత కు ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చిన హరీశ్

  • Afghanistan Earthquake : ప్రాణాలు పోతుంటే విపరీత ఆచారం అవసరమా?

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd