HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Bjps Saugat E Modi Eid Kits To Benefit 32 Lakh Muslims

Saugat e Modi : ముస్లింలకు మోడీ రంజాన్ తోఫా.. ‘సౌగత్-ఎ-మోడీ’ కిట్లు

బీజేపీ మైనారిటీ మోర్చాకు చెందిన ప్రతీ ఆఫీస్ బేరర్ మసీదు కమిటీల సహాయంతో ప్రతీ మసీదులో 100 మంది నిరుపేదలకు "సౌగత్-ఎ-మోడీ"(Saugat e Modi) కిట్లను అందజేస్తారని వెల్లడించారు.

  • Author : Pasha Date : 26-03-2025 - 8:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bjp Saugat E Modi Eid Kit Muslims Ramzan Pm Modi

Saugat e Modi : పవిత్ర రంజాన్ మాసం వేళ దేశంలోని ముస్లింలకు చేరువయ్యే ప్రయత్నంలో బీజేపీ ఉంది. ఇందుకోసం  “సౌగత్-ఎ-మోడీ” పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ముస్లింలకు ఈద్ కిట్లను బీజేపీ కార్యకర్తలు పంపిణీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆర్థికంగా వెనుకబడిన 32 లక్షల ముస్లిం కుటుంబాలకు గిఫ్ట్ ప్యాక్‌లను ఇవ్వాలని కమలదళం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం బీజేపీకి చెందిన 32వేల మంది కార్యకర్తలను రంగంలోకి దింపింది. సౌగత్ అంటే బహుమతి అని అర్థం. “సౌగత్-ఎ-మోడీ” పేరుతో బీజేపీ తయారు చేయించిన ఈద్ కిట్లను, స్థానిక మసీదుల సహకారంతో నిర్వహించే కార్యక్రమాలు వేదికగా ముస్లింలకు పంపిణీ చేస్తారు. ఇప్పటికే ఈ తరహాలో ముంబైలో, ఢిల్లీలో ఈద్ కిట్లను అందజేశారు.

Also Read :Rajiv Yuva Vikasam: రూ.50వేల యూనిట్‌పై 100 శాతం రాయితీ.. దరఖాస్తు ప్రక్రియ, అర్హతలివీ

ముంబై, ఢిల్లీలలో షురూ

ముంబైలోని నవీ ముంబై ఏరియాలో 200 మందికి సౌగత్ ఎ మోడీ కిట్లు అందాయి. ఢిల్లీలోని బస్తీ హజ్రత్ నిజాముద్దీన్‌లో ఉన్న గాలిబ్ అకాడమీ వేదికగా ఈ కిట్లను పంపిణీ చేశారు. “సౌగత్-ఎ-మోడీ” ఈద్ కిట్లలో ఆహార పదార్థాలు, దుస్తులు, సేమియా, ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్, చక్కెర ఉన్నాయి. ఇందులో మహిళలకు సల్వార్-సూట్ ఫాబ్రిక్, పురుషులకు కుర్తా-పైజామా ఫాబ్రిక్ ఉన్నాయి. ఒక కిట్ ధర దాదాపు రూ. 600 ఉంటుందని బీజేపీ వర్గాలు తెలిపాయి.

పంపిణీ ప్రక్రియ ఇదీ.. 

బీజేపీ మైనారిటీ మోర్చాకు చెందిన ప్రతీ ఆఫీస్ బేరర్ మసీదు కమిటీల సహాయంతో ప్రతీ మసీదులో 100 మంది నిరుపేదలకు “సౌగత్-ఎ-మోడీ”(Saugat e Modi) కిట్లను అందజేస్తారని వెల్లడించారు. సమాజంలోని ముస్లిం వర్గంలో బీజేపీని విస్తరించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బీజేపీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఆల్ ఇండియా ఇమామ్ అసోసియేషన్‌కు చెందిన మౌలానా సాజిద్ రషీది ప్రశంసించారు. ‘‘ఇది బీజేపీ పట్ల ముస్లింల అవగాహనను మార్చడానికి, బుజ్జగింపు రాజకీయాలకు దూరంగా ఉండటానికి సహాయపడుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు.

టార్గెట్ బిహార్ ఎలక్షన్స్ 

బిహార్‌‌లో ముస్లిం జనాభా ఎక్కువ. ఇప్పటికే ఆ రాష్ట్రంలోని పలు ముస్లిం సంఘాలు  బీజేపీకి సన్నిహితుడైన సీఎం నితీశ్ కుమార్ ఇఫ్తార్ విందులను బహిష్కరించారు. ఈ ఏడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి.  ఈ తరుణంలో ముస్లింలను ప్రసన్నం చేసుకునేందుకే “సౌగత్-ఎ-మోడీ” కిట్ల పంపిణీని బీజేపీ మొదలుపెట్టిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.  ‘‘బిహార్‌లో 17 శాతం మంది ముస్లింలు ఉన్నారు. కొన్ని జిల్లాలో వారి ప్రభావం చాలా ఎక్కువ. ముస్లింల ఓట్ల కోసమే బీజేపీ సౌగత్‌ కిట్లను తీసుకొచ్చింది. బిహార్‌కు నిజంగా సౌగత్‌ (బహుమతి) ఇవ్వాలనుకుంటే తొలుత వలసలు నివారించండి. ఉద్యోగాలను కల్పించండి’’ అని కాంగ్రెస్‌ ఎంపీ రాజీవ్‌ రంజన్‌ విమర్శించారు. ‘‘ఇది బీజేపీ కపటబుద్ధికి నిదర్శనం. వారు చేసేదంతా మంచి, ఇతరులు చేసేదంతా చెడు అన్న రీతిలో వ్యవహరిస్తోంది’’ అని పేర్కొంటూ శివసేన (థాక్రే) యువనేత ఆదిత్య థాక్రే  సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.

Also Read :BYD Car Plant : హైదరాబాద్‌‌కు మెగా ప్రాజెక్ట్.. భారీ పెట్టుబడితో బీవైడీ కార్ల ప్లాంట్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • Eid Kit
  • muslims
  • pm modi
  • ramzan
  • Saugat e Modi

Related News

Ap 10th Exam

ఏపీలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పరీక్షలు

AP SSC Exams  ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. ఇంగ్లీషు పరీక్ష తేదీని మారుస్తూ పాఠశాల విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ మార్పును గమనించాలని అధికారులు సూచించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 20న జరగాల్సిన ఇంగ్లీషు పరీక్షను మార్చి 21వ తేదీన నిర్వహించనున్నారు. ఉగాది, రంజాన్ ప

  • Lok Sabha

    లోక్‌సభలో గందరగోళం.. ప్రధాని మోదీ ప్రసంగం లేకుండానే ధన్యవాద తీర్మానానికి ఆమోదం!

  • Pawan Kalyan Narrowly Escap

    పవన్ కళ్యాణ్ చెపితే తెలంగాణ ప్రజలు ఓట్లు వేస్తారా ? – TPCC చీఫ్ మహేష్

  • Priyanka Gandhi

    రాహుల్ గాంధీ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన ప్రియాంక గాంధీ!

Latest News

  • వారంలో భారీగా తగ్గిన పసిడి ధరలు

  • మున్సిపాలిటీల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు – భట్టి

  • ‘మధిర అంటే నాకు ప్రాణం’ – భట్టి విక్రమార్క

  • క్వాంటం కంప్యూటింగ్ అంటే ఏంటీ? నిరుద్యోగులకు లాభం ఏంటి?

  • భారీగా తగ్గనున్న హార్లే డేవిడ్సన్ బైక్ ధరలు!

Trending News

    • విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌!

    • అంతరిక్షంలో చైనా ఆధిపత్యం పెరుగుతుందా?

    • టీమిండియాకు చెమ‌టలు ప‌ట్టించిన యూఎస్ఏ!

    • టీ20 వరల్డ్ కప్‌.. తొలి మ్యాచ్‌కు ఈ ఆట‌గాళ్లు ఎందుకు దూర‌మ‌య్యారు?

    • ప్రపోజ్ డే కోసం రొమాంటిక్ టిప్స్ ఇవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd