BJP Strategy: మహిళ ఓటర్లే లక్ష్యంగా మోడీ భారీ స్కెచ్
బీజేపీ 370 సీట్లతో ఎన్డీయే 400 సీట్లు దాటుతుందన్న ప్రధాని నరేంద్ర మోదీ నినాదాన్ని నిజం చేసేందుకు ఏ అవకాశాన్ని వదులుకోవట్లేదు. ఇప్పటికే బీజేపీ అన్ని స్థాయిల్లో గ్రౌండ్ వర్క్ ప్రారంభించింది. ఈ క్రమంలో బిజెపి మహిళా సాధికారత వ్యూహంపై దృష్టి పెట్టింది.
- By Praveen Aluthuru Published Date - 08:37 PM, Thu - 29 February 24
BJP Strategy: బీజేపీ 370 సీట్లతో ఎన్డీయే 400 సీట్లు దాటుతుందన్న ప్రధాని నరేంద్ర మోదీ నినాదాన్ని నిజం చేసేందుకు ఏ అవకాశాన్ని వదులుకోవట్లేదు. ఇప్పటికే బీజేపీ అన్ని స్థాయిల్లో గ్రౌండ్ వర్క్ ప్రారంభించింది. ఈ క్రమంలో బిజెపి మహిళా సాధికారత వ్యూహంపై దృష్టి పెట్టింది.
దేశవ్యాప్తంగా మహిళ ఓటర్లను ఆకర్షించే ఈ ప్రయత్నంలో భాగంగా మార్చి 4 మరియు 6 మధ్య దేశవ్యాప్తంగా మహిళల మారథాన్, మహిళల స్కూటర్ మరియు బైక్ ర్యాలీని నిర్వహించనున్నారు. మారథాన్, స్కూటర్ ర్యాలీలో సామాన్య మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు నేరుగా బీజేపీ బ్యానర్తో నిర్వహించకుండా స్వచ్ఛంద సంస్థల సహకారంతో నిర్వహించనున్నారు. మార్చి 6న బెంగాల్లో లక్ష మంది మహిళలతో జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ప్రధాని ర్యాలీకి ముందు దేశవ్యాప్తంగా మహిళలను చైతన్యం చేసేందుకు మహిళా మోర్చా శక్తి వందన్ ర్యాలీ పేరుతో భాజపా దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించనుంది.
ఈ ర్యాలీలు, మారథాన్లు నేరుగా బీజేపీ బ్యానర్ కింద కాకుండా స్వచ్ఛంద సంస్థల సహాయంతో, మహిళలను అనుసంధానం చేయడానికి మహిళా క్రీడాకారులు, విద్యార్థులతో సహా సమాజంలోని ప్రతి వర్గానికి చెందిన మహిళలు ఈ కార్యక్రమాలలో భాగం అవుతారు. మార్చి 4న దేశంలోని ప్రతి జిల్లాలో మహిళల మారథాన్, మార్చి 5న అసెంబ్లీల వారీగా మహిళల స్కూటర్, బైక్ ర్యాలీ చేపట్టనున్నారు.
Also Read: Fake Survey : ఏపీలో ఊపందుకున్న ఫేక్ సర్వేలు..
Related News
Etela Rajender : మరో జన్మ ఎత్తినా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు
కాంగ్రెస్ హామీలు అమలు జరగాలంటే రూ.2 లక్షల కోట్లు కోవాలని కానీ రాష్ట్రంలో అదనంగా రూ.5 వేల కోట్లు కూడా ఖర్చుపెట్టలేని పరిస్థితి ఉందన్నారు