Bengaluru Cafe Blast: బెంగళూరు కేఫ్ బ్లాస్ట్ నిందితుడిని గుర్తించిన పోలీసులు
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో మార్చి 1న జరిగిన పేలుడు ఘటనకు సంబంధించిన కీలక విషయాలను పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారణంగా దర్యాప్తును జరిపిన అధికారులు ఎట్టకేలకు కేసును ఛేదించారు.
- By Praveen Aluthuru Published Date - 01:08 PM, Mon - 4 March 24
Bengaluru Cafe Blast: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో మార్చి 1న జరిగిన పేలుడు ఘటనకు సంబంధించిన కీలక విషయాలను పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారణంగా దర్యాప్తును జరిపిన అధికారులు ఎట్టకేలకు కేసును ఛేదించారు. పేలుడుతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న నిందితుడు కేఫ్ సమీపంలో బస్సు దిగడం కెమెరాలో రికార్డ్ అయింది. టోపీ, ముసుగు మరియు కళ్ల అద్దాలతో అతని ముఖాన్ని కవర్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ సీసి ఫుటేజీ ద్వారా నిందితుడిని గుర్తించారు.
బెంగళూరు పోలీసులు సీసీటీవీ ఫుటేజీని ఉపయోగించి రామేశ్వరం కేఫ్ ఏరియా చుట్టూ అనుమానితుల కదలికలను నిశితంగా పరిశీలించారు. కేఫ్ నుండి డిజిటల్ వీడియో రికార్డర్ ను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి ఆధారాల కోసం సమీపంలోని ఇతర షాపుల నుండి ఫుటేజీని సేకరించారు. నిందితుడి వయస్సు 28 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని అంచనాని దృవీకరించారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. కాగా నేరస్థుడిని త్వరితగతిన పట్టుకునేందుకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు కర్నాటక హోం మంత్రి జి పరమేశ్వర. కాగా.. రాబోయే లోక్సభ ఎన్నికలకు ముందు ముందస్తు దాడులతో సహా వివిధ కోణాలను దర్యాప్తు సంస్థలు విశ్లేషిస్తున్నాయి.
Also Read: Gopichand: అందుకే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది.. గోపీచంద్ కామెంట్స్!
Tags
Related News
Viral video: ఓటు వేసేందుకు వచ్చిన మహిళ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది, ఏం జరిగిందంటే!
Viral video: లోక్ సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు యాభై ఏళ్ల మహిళ శుక్రవారం ఉదయం బెంగళూరు జేపీ నగర్ 8వ ఫేజ్ లోని జంబో సవారి దిన్నెలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లింది. ఓటు కోసం పోలింగ్ బూత్ వద్ద క్యూలో నిల్చుంది. ఓటర్ల క్యూ దగ్గర ఉంచిన నీళ్లు తీసుకునేందుకు ఆ మహిళ ప్రయత్నించింది. అకస్మాత్తుగా ఆమెకు మైకం రావడంతో ఒక్కసారిగా పడిపోయింది. కాని డాక్టర్ అలర్ట్ అయి వెంటనే గుర్�