Bangladeshi Girl Death: భారత సరిహద్దులో బంగ్లాదేశ్ బాలిక మృతి
ఢాకా ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం.. సంఘటన జరిగిన 45 గంటల తర్వాత మంగళవారం అర్థరాత్రి BSF బంగ్లాదేశ్ బాలిక మృతదేహాన్ని బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (BGB)కి అప్పగించింది. ఆమెను 13 ఏళ్ల స్వర్ణ దాస్గా గుర్తించారు.
- By Gopichand Published Date - 11:11 AM, Thu - 5 September 24

Bangladeshi Girl Death: బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టిన తర్వాత హిందువులతో సహా ఇతర మైనారిటీలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. తప్పించుకునేందుకు భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతకుముందు కూడా సరిహద్దులు దాటి భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారని ఇలాంటి వార్తలు వచ్చాయి. ఇప్పుడు త్రిపురలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద బంగ్లాదేశ్కు చెందిన 13 ఏళ్ల హిందూ బాలిక (Bangladeshi Girl Death) భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తోంది. సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించగా కాల్పుల్లో మరణించారు.
బాలిక మృతదేహాన్ని బీఎస్ఎఫ్ అప్పగించింది
ఢాకా ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం.. సంఘటన జరిగిన 45 గంటల తర్వాత మంగళవారం అర్థరాత్రి BSF బంగ్లాదేశ్ బాలిక మృతదేహాన్ని బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (BGB)కి అప్పగించింది. ఆమెను 13 ఏళ్ల స్వర్ణ దాస్గా గుర్తించారు. BSF జరిపిన కాల్పుల్లో ఆమె మరణించింది. మృతదేహాన్ని అప్పగించడాన్ని ధృవీకరిస్తూ.. అవసరమైన చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసిన తర్వాత మృతదేహాన్ని బాలిక కుటుంబానికి తిరిగి ఇచ్చామని కులౌరా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అధికారి బినయ్ భూషణ్ రాయ్ తెలిపారు. బీజీబీ సెక్టార్ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ మిజానూర్ రహ్మాన్ షిక్దార్ మాట్లాడుతూ.. ఆదివారం రాత్రి ఆమె కులౌరా ఉపజిల్లా నుంచి భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినప్పుడు బీఎస్ఎఫ్ సిబ్బంది కాల్పులు జరిపారని తెలిపారు.
Also Read: Financial Uncertainty : రాబోయే ఐదేళ్ల ఫైనాన్షియల్ ప్లానింగ్.. సర్వేలో హైదరాబాదీలు ఏం చెప్పారంటే..
బ్రోకర్లు కూడా పరారీ అయ్యారు
పరిస్థితిని ఎదుర్కోవడానికి BGB, BSF మధ్య ఫ్లాగ్ మీటింగ్ అని షిక్దర్ చెప్పారు. బాలికను వెస్ట్ జూరి యూనియన్లోని జూరి ఉపజిల్లా పరిధిలోని కల్నిగర్ గ్రామానికి చెందిన పోరేంద్ర దాస్ కుమార్తె 13 ఏళ్ల స్వర్ణ దాస్గా గుర్తించారు. త్రిపురలో ఉంటున్న తమ పెద్ద కొడుకును కలిసేందుకు స్వర్ణ, ఆమె తల్లి అక్రమంగా భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారని పోరేంద్ర చెప్పారు. వారికి ఇద్దరు స్థానిక బ్రోకర్ల సహాయం లభించింది. ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో వారు భారత సరిహద్దుకు చేరుకున్నప్పుడు BSF సిబ్బంది కాల్పులు ప్రారంభించారు. దీని కారణంగా స్వర్ణ తక్షణమే మరణించింది. కాల్పుల నుంచి స్వర్ణ తల్లి తృటిలో తప్పించుకుంది. ఈ విషాద ఘటనతో సరిహద్దు ప్రాంతంలో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.