HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Amit Shah On Operation Sindoor

Amit Shah: పాకిస్తాన్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన హోం మంత్రి అమిత్ షా!

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్ర‌స్తుతం రెండు రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్నారు. పర్యటన మొదటి రోజున ఆయన గుజరాత్ రాజధాని గాంధీనగర్‌కు చేరుకున్నారు. అక్కడ ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

  • By Gopichand Published Date - 08:14 PM, Sat - 17 May 25
  • daily-hunt
Amit Shah
Amit Shah

Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ప్ర‌స్తుతం రెండు రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్నారు. పర్యటన మొదటి రోజున ఆయన గుజరాత్ రాజధాని గాంధీనగర్‌కు చేరుకున్నారు. అక్కడ ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. ఆయన ఆపరేషన్ సిందూర్ గురించి పలు కీలక విషయాలు పేర్కొన్నారు. అలాగే పాకిస్తాన్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అమిత్ షా మాట్లాడుతూ.. మన సైన్యం పాకిస్తాన్‌లో 100 కిలోమీటర్ల లోపలికి వెళ్లి ఉగ్రవాదుల 9 స్థావ‌రాల‌ను ధ్వంసం చేసిందని, ఈ క్రమంలో 100 మంది ఉగ్రవాదులను హతమార్చిందని చెప్పారు. పాకిస్తాన్ కాశ్మీర్ నుంచి కచ్ వరకు పలుమార్లు దాడులకు ప్రయత్నించింది. కానీ మన సైన్యం ప్రతి దాడిని విఫలం చేసిందని, పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌ను కూడా ధ్వంసం చేసిందని ఆయన తెలిపారు.

#WATCH | Gandhinagar, Gujarat | Union Home Minister Amit Shah says, "This has happened for the first time after independence that our military attacked 100 km inside Pakistan and destroyed terrorist camps. Those who used to threaten us that they have atom bombs, they thought we… pic.twitter.com/wHRrBkX49d

— ANI (@ANI) May 17, 2025

ప్రధానమంత్రి మోదీ ప్రతి దాడికి సమాధానం ఇచ్చారు

హోం మంత్రి మరింత మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ అనే పేరును ప్రధానమంత్రి మోదీనే ఇచ్చారని చెప్పారు. సైన్యం కారణంగా ఈ రోజు మన తల గర్వంగా ఉందని, అలాగే మేము అణు బెదిరింపులకు భయపడేవారు కాదని పేర్కొన్నారు. 2014 కంటే ముందు ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చి మన ప్రజలను చంపి వెళ్లిపోయేవారని, కానీ ఎలాంటి సమాధానం ఇచ్చేవాళ్లు కాదని అప్ప‌టి కాంగ్రెస్ పాల‌న‌ను ఉద్దేశించి షా అన్నారు. ప్రధానమంత్రి మోదీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఉగ్రవాదులు మూడు పెద్ద దాడులు చేశారని, కానీ ప్రధానమంత్రి మోదీ ప్రతి దాడికి సమాధానం ఇచ్చారని, ఈ రోజు ప్రపంచం మొత్తం ఆశ్చర్యంతో చూస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read: Jyoti Malhotra: భార‌త్‌లో ఉంటూ పాకిస్తాన్‌కు గూఢ‌చ‌ర్యం చేసిన మ‌హిళా యూట్యూబ‌ర్‌!

1100 కోట్ల రూపాయల అభివృద్ధి పనుల ప్రారంభం

షా మాట్లాడుతూ.. ఉరీలో దాడి జరిగినప్పుడు మేము సర్జికల్ స్ట్రైక్‌తో సమాధానం ఇచ్చామని, పుల్వామాలో దాడి జరిగినప్పుడు ఎయిర్ స్ట్రైక్ చేశామని చెప్పారు. అయినప్పటికీ పాకిస్తాన్ సరిదిద్దుకోలేదని అది పహల్గామ్‌లో దాడి చేసిందని, ఈసారి మేము దాని ఉగ్రవాద ప్రధాన కేంద్రాన్నే నాశనం చేశామని ఆయన తెలిపారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే.. హోం మంత్రి షా శనివారం 1100 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. అలాగే, మూడు గృహ నిర్మాణ పథకాల డ్రా తీశారు. ఆ తర్వాత వావోల్ సమీపంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా ప్రారంభించారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amit shah
  • ind vs pak
  • national news
  • Operation Sindoor
  • pakistan
  • pm modi

Related News

India Cricket Team

PM Modi: రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్న టీమిండియా మ‌హిళ‌ల జ‌ట్టు!

భారత మహిళల క్రికెట్ జట్టు బుధవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్) చేయనున్నట్లు సమాచారం. గత సంవత్సరం 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత పురుషుల జట్టుకు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆతిథ్యం ఇచ్చారు.

  • Suryakumar Yadav

    Suryakumar Yadav: సూర్య‌కుమార్‌, హారిస్ రౌఫ్‌కు షాకిచ్చిన ఐసీసీ!

  • Bilaspur Train Accident

    Bilaspur Train Accident: బిలాస్‌పూర్ స్టేషన్ సమీపంలో రెండు రెళ్లు ఢీ!

  • India Squad

    India Squad: పాక్‌తో మ‌రోసారి త‌ల‌ప‌డ‌నున్న భార‌త్.. ఎప్పుడంటే?

  • Road Accident

    Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి!

Latest News

  • Karthika Pournami : భద్రాచలం గోదావరి వద్ద కార్తీక శోభ

  • Vote Chori : హరియాణాలో 25 లక్షల ఓట్ల చోరీ – రాహుల్

  • KCR : కేసీఆర్ ను అరెస్టు చేస్తామని మేమెప్పుడూ చెప్పలేదు – కిషన్ రెడ్డి

  • Rangareddy: దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా రంగారెడ్డి

  • Kartika Purnima : కార్తీక మాసం – ఉసిరి దీపం ఎందుకు పెడతారు?

Trending News

    • U-19 One-Day Challenger Trophy: టీమిండియాలోకి మాజీ కోచ్ కొడుకు.. ఎవ‌రో తెలుసా?

    • Kartik Purnima: రేపే కార్తీక పౌర్ణ‌మి.. ఏ రాశి వారు ఎలాంటి వ‌స్తువులు దానం చేయాలో తెలుసా?

    • India Post Payments Bank: ఇక‌పై ఇంటి నుండే ఆ సర్టిఫికేట్ పొందవచ్చు!

    • Rs 2,000 Notes: మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా రూ. 2 వేల నోట్లు!?

    • Net Worth: భార‌త్‌, సౌతాఫ్రికా జ‌ట్ల కెప్టెన్ల సంపాద‌న ఎంతో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd