Murder : ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి..ఇంట్లో పాతిపెట్టిన భార్య..4ఏళ్ల తర్వాత బయటపడ్డ రహస్యం..!!
- By hashtagu Published Date - 08:53 PM, Mon - 14 November 22
ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి భర్తను అతికిరాతకంగా హతమార్చింది భార్య. గొడ్డలితో ముక్కలుముక్కలుగా నరికి ఇంట్లోనే పాతిపెట్టింది. ఈ ఘటన నాలుగేళ్ల క్రితం జరిగింది. ఈ కేసును ఛేదించిన ఘజియాబాద్ పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు. మృతుడి ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారిని విచారించగా అసలు నిజం బయటపడింది. ఇంట్లో పాతిపెట్టిన శవాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…సిహాని గేట్ ప్రాంతంలో నివాసముంటున్న భూరే సింగ్ తన సోదరుడు చంద్రవీర్ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాలుగేళ్ల నుంచి కనిపించకుండా పోయిన తన సోదరుడిని గురించి తెలపాలంటూ పోలీసులను వేడుకున్నాడు. దీంతో ఘజియాబాద్ పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. ఈ కేసును క్రైం బ్రాంచ్ పోలీసులకు అప్పగించడంతో వారు ఛేదించారు.
తప్పిపోయిన చంద్రవీర్ భార్యపై అనుమానంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో అసలు విషయం బయటపడింది. తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు అంగీకరించింది. చంద్రవీర్ భార్య సవిత 2017లో తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు తెలిపింది. వీరి ప్రేమ వ్యవహారం భర్తతోపాటు కుటుంబ సభ్యులకు తెలిసింది. చాలా సార్లు వారిని అభ్యంతరకర స్థితిలో చూశాడు. ఈ విషయంపై భార్యభర్తల మధ్య తరచుగా కొడవ జరుగుతుండేంది. సవితను విపరీతంగా కొట్టేవాడు చంద్రవీర్. దీంతో ఎలాగైన తన భర్తను అడ్డుతొలగించుకోవాలని ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది. పథకం ప్రకారం చంద్రవీర్ ను గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశారు. ఇంట్లోనే గోతి తీసి పాతిపెట్టారు. ఆ స్థలాన్ని సిమెంట్ పూడ్చేశారు. గ్రామంలో ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్త పడింది సవిత. అయితే తన సోదరుడు కనిపించడం లేదని చంద్రవీర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. మ్రుతుడి భార్యను, ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Related News
Lok Sabha Elections: 102 స్థానాలకు పోలింగ్ ప్రారంభం.. పలు సంస్థలకు సెలవులు
శుక్రవారం (ఏప్రిల్ 19, 2024) లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) మొదటి దశ 102 స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ 102 సీట్లు 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవి.