HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Ttd Will Release The Quota Of Arjita Seva Tickets Online

Arjita Seva: టిటిడి ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల చేయ‌నుంది

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి మార్చి, ఏప్రిల్, మే నెలల కోటాను

  • Author : Vamsi Chowdary Korata Date : 22-02-2023 - 6:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TTD Exchange Rs 2000 Notes
Ttd Will Release The Quota Of Arjita Seva Tickets Online

కలియుగ వైకుంఠనాథుడు‌ కొలువైయున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి క్షణకాలం పాటు జరిగే దర్శన భాగ్యం కోసం కోట్లాది మంది భక్తులు పరితపించి పోతుంటారు. దేశ విదేశాల నుంచి‌ ఎన్నో వ్యయ ప్రాయాసలకు ఓర్చి తిరుమల పుణ్యక్షేత్రంకు చేరుకుని శ్రీనివాసుడి దివ్య మంగళ స్వరూపంను దర్శించి పునీతులు అవుతుంటారు. అయితే భక్తుల సౌకర్యం టీటీడీ వివిధ రూపాల్లో భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పిస్తూ వస్తుంది. ప్రతి నెల ఆన్లైన్ ద్వారా దర్శన టికెట్ల కోటాను విడుదల చేసి భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యంకు దగ్గర చేస్తుంది టిటిడి. ఈ క్రమంలోనే తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా (Arjita Seva) టికెట్లకు సంబంధించి మార్చి, ఏప్రిల్, మే నెలల కోటాను ఫిబ్రవరి 22న సాయంత్రం 4  గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. వీటిలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు టోకెన్ల కోటాను విడుదల చేయనుంది. అదేవిధంగా, మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన మిగతా ఆర్జిత‌సేవా (Arjita Seva) టికెట్లకు ఆన్‌లైన్ ల‌క్కీడిప్ న‌మోదు ప్ర‌క్రియ ఫిబ్రవరి 22న ఉదయం 10 గంట‌ల‌ నుండి ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటల వరకు ఉంటుంది. లక్కీడిప్ లో టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ విషయాన్ని భక్తులు గమనించి శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల‌ను బుక్ చేసుకోవాలని టిటిడి విజ్ఞప్తి చేస్తుంది.

తిరుమల కొండపై భక్తుల రద్దీ సాధారణ స్థితికి చేరుకుంది. ప్రతి సోమవారం నిర్వహించే చతుర్దశ కలశ విశేష పూజను టిటిడి రద్దు చేసింది. విగ్రహాల పరిరక్షణలో‌ భాగంగా ఆగమ సలహాదారుల సూచనల మేరకు టిటిడి నిర్ణయం తీసుకుంది. ఆదివారం రోజున 79,555 మంది స్వామి వారి దర్శించుకున్నారు. 21,504 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించగా, 4.44 కోట్ల రూపాయలు భక్తులు హుండీ స్వామి వారికి ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 01 కంపార్ట్మెంట్ లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వదర్శనంకు 06 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు మూడు గంటల సమయం పడుతుంది.

శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఇందులో‌ భాగంగా సోమవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం  తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు. ప్రాతఃకాల ఆరాధనలో‌ భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం,హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో  కలిపిన నువ్వుల పిండిమి స్వామి వారిని నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేసారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.

Also Read:  Ayurveda Tips: ఎసిడిటీ, కడుపు ఉబ్బరం ప్రాబ్లమ్స్ కు 3 ఆయుర్వేద చికిత్సలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • andhra pradesh
  • Arjta Seva
  • devotional
  • online
  • Quota
  • tickets
  • tirumala
  • Tirupati
  • ttd

Related News

Sanatana Dharma

దేశ వ్యాప్తంగా సనాతన ధర్మ ప్రచారానికి టీటీడీ కీలక నిర్ణయం

దేశ వ్యాప్తంగా సనాతన ధర్మం నెలకొల్పాలని తిరుమల దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. అస్సాం రాజధాని గౌహతిలో శ్రీవారి దివ్యక్షేత్రం నిర్మాణానికి తొలి అడుగు వేసింది. ఇందుకు గాను అక్కడి ముఖ్యమంత్రి తో , సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. దివ్యక్షేత్రం నిర్మాణానికి అస్సాం ప్రభుత్వం 25 ఎకరాల భూమిని కేటాయించాలని

  • Ttd

    ఈ విశ్వంలో అసలైన సౌందర్యం…నిజమైన వైభవం అంటే అది వేంకటేశ్వరస్వామి వారిదే ..

  • Want to see the Lord up close?.. But do it this way

    తిరుమల శ్రీవారిని దగ్గర నుంచి చూడాలని ఉందా?.. అయితే ఈ విధంగా చేయండి

  • Thiruppavai

    ధనుర్మాసం లో గోదాదేవి ఆలపించిన 30 తిరుప్పావై పాశురాలు ఇవే!

  • CM Chandrababu Naidu visits Delhi seeking central support for state development

    రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం కోరుతూ ఢిల్లీకి సీఎం చంద్రబాబు

Latest News

  • బ్రేకింగ్‌.. భార‌త్‌పై పాక్ ఘ‌న‌విజ‌యం!

  • 2026లో జరగబోయే 10 ప్రధాన క్రీడా టోర్నమెంట్లు ఇవే!

  • మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా

  • యూరియా యాప్ తో రైతుల కష్టాలు తీరినట్లేనా ?

  • హైడ్రా కమిషనర్ గన్ మెన్ ఆత్మహత్యాయత్నం

Trending News

    • క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?

    • 2026 బడ్జెట్.. ఫిబ్రవరి 1 ఆదివారం.. అయినా బడ్జెట్ అప్పుడేనా?

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd