TTD: శ్రీ కృష్ణదేవరాయుల విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం అదృష్టం: టీటీడీ చైర్మన్
- By Balu J Published Date - 10:48 PM, Fri - 16 February 24
TTD: చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయల వారి జీవితం అందరికి ఆదర్శనీయమని తిరుమల తిరుపతి దేవస్థానముల పాలకమండలి చైర్మన్, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి లీలామహల్ సర్కిల్లో శుక్రవారం శ్రీ కృష్ణదేవరాయల విగ్రహ పునః ప్రతిష్ట ఆవిష్కరణ కార్యక్రమంలో భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ శ్రీ కృష్ణదేవరాయులు ప్రజా పరిపాలన అధ్బుతంగా సాగించారని, ఓకవైపు ప్రజల క్షేమం, మరోవైపు కళలు, సంస్కృతి, ఆచారాలు, భక్తి వీటినన్నింటిని మేళవించుకొని పరిపాలన చేసిన గొప్ప చక్రవర్తి అని భూమన పేర్కొన్నారు.
తన ఇరవై సంవత్సరాల పాలనలో మన తిరుమల వేంకటేశ్వర స్వామి వారిని ఏడు సార్లు దర్శించుకొని, వేల కోట్ల విలువ గల్గిన అభరణాలు స్వామికి సమర్పించి, స్వామి వారి కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప చక్రవర్తి కృష్ణదేవరాయులు అని భూమన అన్నారు. అలాంటి శ్రీ కృష్ణదేవరాయుల వారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం తమ అదృష్టంగా టీటీడీ చైర్మెన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు.
Related News
Tirumala: తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు.. ఎందుకు జరుపుతారో తెలుసా
Tirumala: తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తుల భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అయితే వసంత రుతువులో మలయప్ప స్వామికి వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. సాయంత్రం 6:30 ను�