HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Do You Know Why Sandalwood Is Loved By Simhachalam Appanna Swamy

Simhachalam Appanna Swamy: సింహాచలం అప్పన్న స్వామికి చందనం ఎందుకు ప్రీతికరమో తెలుసా?

"సింహాచలం" శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి కొలువై వున్న ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం. సింహాచలం అప్పన్న స్వామి మహిమల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 

  • Author : Maheswara Rao Nadella Date : 17-04-2023 - 6:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Do You Know Why Sandalwood Is Loved By Simhachalam Appanna Swami..
Do You Know Why Sandalwood Is Loved By Simhachalam Appanna Swami..

Simhachalam Appanna Swamy : “సింహాచలం” శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి కొలువై వున్న ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం.సింహాచలం అప్పన్న స్వామి మహిమల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

మన రాష్ట్రాలలో ఉన్న మిగతా నరసింహస్వామి ఆలయాలలో కన్నా ఈ సింహాచలంలో (Simhachalam) ఉన్న ఆలయం ఎంతో భిన్నంగా ఉంటుంది.అన్ని ఆలయాలలో మనకు స్వామి వారి విగ్రహ రూపంలో దర్శనమిస్తే సింహాచలంలో మాత్రం లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు.

అదే విధంగా ఈ ఆలయంలో ఉన్న లింగరూప లక్ష్మీనరసింహస్వామి ఎల్లప్పుడు చందనంతో నిండుగా పూయబడి ఉంటుంది. అసలు ఈ ఆలయంలో స్వామి వారు ఎందుకు లింగరూపంలో ఉన్నారు?? ఇక్కడ ఉన్న స్వామివారికి చందనం ఎందుకింత ప్రీతికరమో?? ఇక్కడ తెలుసుకుందాం..

మన పురాణాల ప్రకారం విష్ణు భక్తుడైన ‘ప్రహ్లాదుడు’ సింహాచలంలోని నవ నరసింహ స్వామిని ప్రతిష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. సింహాచలంలో “నరసింహస్వామి”ని ప్రతిష్టించినది ప్రహ్లాదుడు అని పురాణాలు చెబుతున్నప్పటికీ,ఆలయాన్ని నిర్మించినది మాత్రం ‘పురూరవుడ’నే రాజు నిర్మించినట్టు శాసనాలు చెబుతున్నాయి.

ఒకరోజు పురూరవుడు సింహాచలం (Simhachalam) ప్రాంతాన్ని సందర్శించిన సమయంలో అక్కడ నేలలో కప్పబడి పోయిన స్వామి వారి విగ్రహం బయటపడింది. ఆ సందర్భంగా ఆ రాజు స్వామి వారి కోసం సింహాచలంలో ఆలయం నిర్మించారని తెలుస్తోంది.

అదే సమయంలోనే ఆకాశవాణి ఆ రాజుకు ప్రతి రోజు స్వామివారికి చందనం పూత పూయాలని చెప్పగా, ఆకాశవాణి పలుకుల మేరకు అప్పటి నుంచి స్వామివారిని నిత్యం చందనంతో అలంకరిస్తారు. అలా అప్పట్లో మొదలైన ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

కేవలం ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే స్వామివారికి చందనం పూత ఉండదు. మిగిలిన రోజులన్నీ స్వామివారు చందనం పూతతోనే భక్తులకు దర్శనమిస్తారు.సింహాచలంలోని వరాహ నరసింహుడిని నిరంతరం చందనంతో కప్పి వుంచుతారు.విగ్రహం వేడిగా వుంటుందని అంటారు. ఆ వేడిని ఉపశమింపజేయడానికి నిరంతరం చందనం లేపనంగా పూస్తూ వుంటారని చెబుతారు.

ఏడాదిలో వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమే చందనాన్ని పూర్తిగా తొలగించి, కేవలం 12 గంటల సమయం మాత్రమే స్వామివారి నిజస్వరూపాన్ని చూసే అవకాశాన్ని భక్తులకు కలిగిస్తారు. దీనిని “చందనోత్సవం” లేదా ‘చందనయాత్ర’ అని పిలుస్తారు. సింహాచల క్షేత్రానికి (Simhachalam) సంబంధించి ఇది చాలా ముఖ్యమైన ఆధ్యాత్మిక ఉత్సవం.

చందనోత్సవానికి కొద్ది రోజుల ముందే ఈ ఉత్సవాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ దేవాలయంలోని పూజారులు స్వామివారికి కొత్త చందనపు లేపనం కోసం గంధపు చెక్కలను అరగదీయడం ప్రారంభిస్తారు. ఇలా అరగదీసిన చందనాన్నే 12 గంటల నిజరూప దర్శనం ముగిసిన తర్వాత స్వామివారికి లేపనంగా పూస్తారు. చందనోత్సవం రోజున స్వామివారి నిజరూప దర్శనం చేసేందుకు వేలాదిమంది భక్తులు ఆలయానికి వస్తారు.

ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామినే నమః

Also Read:  CRPF Exams: ఇక ఆ ఎగ్జామ్స్ తెలుగులోనూ.. కేంద్ర సర్కారు కీలక నిర్ణయం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap
  • devotional
  • god
  • Lord
  • Simhachalam
  • Simhachalam Appanna Swamy
  • Swamy

Related News

Bhogi Mantalu

భోగి మంటలు విషయంలో జాగ్రత్తలు అవసరం !

పూర్వం భోగి మంటలంటే పాత సామాన్లు, ఎండుటాకులు, చెక్క ముక్కలతో వేసేవారు. కానీ నేడు ఆధునిక జీవనశైలిలో భాగంగా టైర్లు, ప్లాస్టిక్ కవర్లు, పాత ఫ్లెక్సీలు వంటి ప్రమాదకరమైన వస్తువులను మంటల్లో వేయడం

  • 2026 Central Budget

    కేంద్ర బడ్జెట్ పైనే ఏపీ ఆశలన్నీ, మరి న్యాయం జరిగేనా?

  • Sajjala

    రాజధానిగా అమరావతే కరెక్ట్ – మాట మార్చిన సజ్జల రామకృష్ణ రెడ్డి

  • Restraint is needed on water disputes: CM Revanth Reddy

    జల వివాదాలపై సంయమనం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి

  • Apsrtc Samme

    వెనక్కు తగ్గిన ఏపీఎస్ ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు, సమ్మె విరమణ తో ఊపిరి పీల్చుకున్న ప్రజలు

Latest News

  • నేడు వామికా కోహ్లీ పుట్టినరోజు.. విరాట్-అనుష్కల కుమార్తె పేరు వెనుక ఉన్న అర్థం ఏమిటి?

  • రాత్రిపూట నిద్ర ప‌ట్ట‌డంలేదా.. అయితే కార‌ణాలీవే?!

  • రోహిత్, విరాట్ కోహ్లీ టీ20ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం మంచిదే: మాజీ క్రికెట‌ర్‌

  • ఆవనూనె స్వచ్ఛతను గుర్తించండిలా?!

  • 8వ వేతన సంఘం.. జనవరి 1 నుండి జీతాలు ఎందుకు పెరగలేదు?

Trending News

    • భారతదేశంలో అత్యంత అందమైన రైలు మార్గాలివే!!

    • బెంగాలీ మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఎరుపు- తెలుపు రంగుల చీర‌లు ఎందుకు క‌ట్టుకుంటారో తెలుసా?!

    • టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రాక్టీస్ సెషన్‌లో రిషబ్ పంత్‌కు గాయం!

    • తెలంగాణ ఎప్‌సెట్ అభ్యర్థులకు శుభవార్త!

    • అయోధ్యలో కలకలం.. రామ్ మందిర్ ప్రాంగణంలో నమాజ్‌?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd