Piracy : పైరసీ వల్ల టాలీవుడ్ రూ.3,700 కోట్ల నష్టం – సీపీ ఆనంద్
Piracy : కిరణ్ ముఠా అనే ప్రధాన నిందితుడు ఆధ్వర్యంలో పనిచేసిన పైరసీ గ్యాంగ్ టాలీవుడ్కు సుమారు రూ. 3,700 కోట్ల భారీ నష్టం కలిగించినట్లు పోలీసులు తెలిపారు.
- By Sudheer Published Date - 02:15 PM, Mon - 29 September 25

టాలీవుడ్ పరిశ్రమపై పైరసీ (Piracy ) ముఠాల దాడి రోజు రోజుకూ పెరుగుతోంది. తాజాగా హైదరాబాద్ సీపీ ఆనంద్ (CP Anand) వెల్లడించిన వివరాలు సినీ వర్గాలను షాక్కు గురి చేశాయి. కిరణ్ ముఠా అనే ప్రధాన నిందితుడు ఆధ్వర్యంలో పనిచేసిన పైరసీ గ్యాంగ్ టాలీవుడ్కు సుమారు రూ. 3,700 కోట్ల భారీ నష్టం కలిగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా ప్రత్యేకమైన యాప్ సహాయంతో 40కి పైగా సినిమాలను నేరుగా థియేటర్లలోనే రికార్డ్ చేసి, పైరసీ వెబ్సైట్లు, ఛానెల్స్ ద్వారా వ్యాప్తి చేసినట్లు విచారణలో తేలింది.
VC Sajanar : ఆర్టీసీ కి బై బై చెపుతూ సజ్జనార్ ఇచ్చిన సందేశం ఇదే!
ఇప్పటి వరకు పైరసీని కేవలం కెమెరా రికార్డింగ్ వరకు మాత్రమే అనుకునే పరిస్థితి ఉండగా, ఈ ముఠా దాన్ని మరింత ప్రమాదకర స్థాయికి తీసుకెళ్లింది. సినిమాలను నేరుగా డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ నుంచే హ్యాక్ చేసి కాపీ చేయడం ద్వారా, అత్యున్నత సాంకేతిక నేరాలకు పాల్పడింది. పైరసీ కంటెంట్ను టెలిగ్రామ్ ఛానెల్స్, టొరెంట్స్ వంటి వేదికలపై అప్లోడ్ చేసి, వాటి ద్వారా బెట్టింగ్, గేమింగ్ యాప్ల ప్రకటనలు పెట్టి అధిక ఆదాయం పొందడం ఈ గ్యాంగ్ వ్యూహంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మోడల్ వల్ల సినిమా థియేటర్లు, నిర్మాతలు మాత్రమే కాకుండా, మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీకి ఉద్యోగాల కోత, పెట్టుబడుల తగ్గింపు వంటి పరిణామాలు కలుగుతున్నాయి.
ఈ ఘటనతో టాలీవుడ్లో పైరసీ సమస్య ఎంత లోతుగా వేర్లు వేసిందో మరోసారి బయటపడింది. ఫిల్మ్ ఇండస్ట్రీ కృషి, పెట్టుబడులను ఒక్క క్షణంలో తారుమారు చేసే ఈ నేరాన్ని అరికట్టడానికి కఠిన చట్టాలు, ప్రత్యేక సాంకేతిక పద్ధతులు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. పైరసీ కంటెంట్ను డౌన్లోడ్ చేసే వారు, పంచే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. సినీ రంగం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం, పోలీస్ శాఖ, సాంకేతిక సంస్థలు కలిసి పని చేస్తూ ఈ డిజిటల్ నేరాలపై అడ్డుకట్ట వేయడం అత్యవసరమని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.