Keerthy Suresh: సామ్ పై ప్రశంసలు కురిపించిన మహానటి.. సమంత అన్స్టాపబుల్ అంటూ..!
స్టార్ హీరోయిన్ సమంత (Samantha)పై మరో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రశంసల వర్షం కురిపించింది.కీర్తి శనివారం రాత్రి Instagramలో Ask Me Anything (AMA) సెషన్ నిర్వహించింది.
- By Gopichand Published Date - 01:12 PM, Sun - 16 April 23
స్టార్ హీరోయిన్ సమంత (Samantha)పై మరో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రశంసల వర్షం కురిపించింది.కీర్తి శనివారం రాత్రి Instagramలో Ask Me Anything (AMA) సెషన్ నిర్వహించింది. “మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నేను ఇక్కడ ఉన్నాను” అని ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో రాసుకొచ్చింది. సామ్ గురించి చెప్పండి అని ఓ అభిమాని అడిగాడు. దానికి ఆమె రియాక్ట్ అవుతూ సమంత అన్స్టాపబుల్, ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే ధృడమైన మనస్తత్వం ఆమెది అంటూ కీర్తి సురేష్.. సామ్ ను ప్రశంసించింది.
అభిమాని అడిగిన ప్రశ్నకు కీర్తి సురేష్ బదులిస్తూ “నేను చూసిన అత్యంత దృఢ హృదయం కలిగిన వ్యక్తులలో సామ్ ఒకరు. సరళంగా చెప్పాలంటే ఆమె అన్స్టాపబుల్! (వైట్ హార్ట్ ఎమోజి) @samantharuthprabhuoffl” అని చెప్పింది. దీనిని సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేస్తూ “ధన్యవాదాలు డార్లింగ్ @keerthysureshofficial (రెడ్ హార్ట్ ఎమోజి)” అని సమంత రాసింది. ఇలా ఇరువురు హీరోయిన్లు ఒకరి గురించి ఒకరు చెప్పుకోవటంతో సినీ లవర్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Radhika Apte: తన హాట్ అందాల షోతో హీటెక్కిస్తున్న రాధికా ఆప్టే..
కీర్తి పోస్ట్పై సమంత స్పందించడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల కీర్తి తన చిత్రం దసరా విజయాన్ని పురస్కరించుకుని ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ను పంచుకుంది. ఆమె పోస్ట్కు “వెన్నెల సంబరాలు!” అని క్యాప్షన్ ఇచ్చింది. దసరా, ధూమ్ ధామ్ బ్లాక్బస్టర్స్ అనే హ్యాష్ట్యాగ్లను కూడా యాడ్ చేసింది. ఈ పోస్ట్పై సమంత తనదైన శైలిలో రియాక్ట్ అయింది. సమంత, కీర్తి సురేష్ మహానటి (2018) మూవీలో కలిసి నటించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, భానుప్రియ, తదితరులు నటించారు. అంతేకాకుండా తమిళ మూవీ యాక్షన్ మూవీ సీమరాజా (2018)లో కనిపించారు. ఈ చిత్రంలో కీర్తి అతిధి పాత్రలో కనిపించింది. సమంత తాజాగా పురాతన భారతదేశపు గొప్ప కవి, నాటక రచయిత కాళిదాసు రచించిన ప్రముఖ భారతీయ క్లాసిక్ నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా రూపొందించిన శాకుంతలం మూవీలో యాక్ట్ చేసింది. ఈ చిత్రం ఏప్రిల్ 14న థియేటర్లలో విడుదల అయింది.
కీర్తి సురేష్ తాజాగా నానితో కలిసి నటించిన చిత్రం దసరా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె తెలంగాణ అమ్మాయిగా నటించింది. వెన్నెల పాత్రలో ఆమె చేసిన నటనకు అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. ఆ\మూవీలో పెళ్లి బారత్ లో కీర్తి చేసిన డాన్స్ సోషల్ మీడియాలో ఇప్పటికి ట్రెండ్ అవుతోంది.
Related News
Ram Puri Jagannaath : డబుల్ ఇస్మార్ట్ కచ్చితంగా కొట్టాల్సిందే..!
Ram Puri Jagannaath డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఆల్రెడీ ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ హిట్