Gayatri Vasudeva Yadav: రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎంవోగా మహిళ.. ఎవరీ గాయత్రీ వాసుదేవ యాదవ్?
గాయత్రి వాసుదేవ యాదవ్పై ఇషా వ్యక్తం చేసిన నమ్మకానికి కారణం ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకు గాయత్రి రికార్డు అద్భుతంగా ఉంది.
- By Gopichand Published Date - 12:20 PM, Thu - 6 February 25

Gayatri Vasudeva Yadav: రిలయన్స్ ఇండస్ట్రీస్ తన కొత్త గ్రూప్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ (CMO), ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్గా గాయత్రీ వాసుదేవ యాదవ్ను (Gayatri Vasudeva Yadav) నియమించింది. గాయత్రి నియామకాన్ని ప్రకటించిన ఇషా అంబానీ.. కంపెనీ వృద్ధిలో ఆమె కీలక పాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా రిలయన్స్ బోర్డులో డైరెక్టర్గా ఉన్నారు.
ఇషా ఏం చెప్పింది?
ఇషా అంబానీ మాట్లాడుతూ.. గాయత్రీ యాదవ్ కంపెనీ చైర్మన్, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్, ఆకాష్, అనంత్, తనతో కలిసి ఆమె కొత్త పాత్రలో పని చేస్తుంది. ఆమె నైపుణ్యాన్ని ఉపయోగించుకుని రిలయన్స్ నాయకత్వ స్థానాన్ని మరింత బలోపేతం చేయడానికి, కొత్త పరిశ్రమ ప్రమాణాలను నెలకొల్పడానికి బృందాలతో సహకరిస్తుంది. మా టీమ్లను ప్రేరేపించడానికి, విజయానికి కొత్త ప్రణాళికలను రూపొందించడంలో సహాయపడటానికి గాయత్రి సరికొత్త ఆలోచనలను తీసుకువస్తుందని నేను విశ్వసిస్తున్నాను అని అన్నారు.
Also Read: Marcus Stoinis: ఆసీస్కు భారీ షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆటగాడు!
గాయత్రి వాసుదేవ యాదవ్పై ఇషా వ్యక్తం చేసిన నమ్మకానికి కారణం ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకు గాయత్రి రికార్డు అద్భుతంగా ఉంది. ఎక్కడ పనిచేసినా తన విజయపతాకాన్ని ఎగురవేశారు. IIM కలకత్తాలో గ్రాడ్యుయేట్ అయిన యాదవ్, Procter & Gambleతో బ్రాండ్ మేనేజ్మెంట్లో తన వృత్తిని ప్రారంభించింది. ఆమె తర్వాత జనరల్ మిల్స్ ఇండియాలో చేరారు. చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్గా పిల్స్బరీ బ్రాండ్ను భారత మార్కెట్లో ప్రారంభించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. అలాగే ప్యాకేజ్డ్ ఫుడ్ రంగంలో ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేసింది.
స్టార్ ఇండియాలో భాగమైంది
ఆ తర్వాత యాదవ్ స్టార్ ఇండియాతో పనిచేసింది. ఇక్కడ ఆమె కన్స్యూమర్ స్ట్రాటజీ అండ్ ఇన్నోవేషన్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించింది. స్టార్ ఇండియా మార్కెటింగ్ వ్యూహాన్ని సెట్ చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. ఆమె స్టార్ స్పోర్ట్స్, హాట్స్టార్ కోసం అనేక మైలురాయి ప్రాజెక్ట్లను నిర్వహించింది. మహిళా సాధికారతపై దృష్టి సారించిన స్టార్ ప్లస్ ‘నయీ సోచ్’ ప్రచారానికి నాయకత్వం వహించింది. ఆమె అద్భుతమైన ట్రాక్ రికార్డ్ను దృష్టిలో ఉంచుకుని, ఇషా అంబానీ విశ్వాసం వ్యక్తం చేసింది. యాదవ్ నియామకాన్ని ప్రకటిస్తూనే ఇషా కూడా ఆమెని ప్రశంసించింది. గాయత్రీ అనుభవంతో రిలయన్స్ లాభపడుతుందన్నారు.