Electric Scooters: జోరు పెంచిన ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు
- By Gopichand Published Date - 07:42 AM, Tue - 28 May 24

Electric Scooters: దేశంలో కార్లు, బైక్లతో పాటు ఎలక్ట్రిక్ సూటర్లను సైతం ఇష్టపడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ మధ్య కాలంలో ఈ స్కూటర్లపై జనం మక్కువ చూపుతున్నారు. అందుకు చాలా కారణాలున్నాయి. ధర తక్కువగా ఉండటం, పెట్రోల్, డీజిల్తో అవసరం లేకపోవడం లాంటివి ఈ స్కూటర్ల అమ్మకాలకు సహాయపడుతున్నాయి.
భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల (Electric Scooters) అమ్మకాలు నిరంతరం పెరుగుతున్నాయి. గత నెలలో ఓలా, టీవీఎస్, బజాజ్ నుండి ఎలక్ట్రిక్ స్కూటర్లు అత్యధికంగా అమ్ముడయ్యాయి. ఓలా ఎలక్ట్రిక్ గత నెలలో 33,963 వాహనాలను విక్రయించగా గతేడాది కంపెనీ 22,068 యూనిట్లను విక్రయించింది. అంటే ఈసారి కంపెనీ 11,895 స్కూటర్లను ఎక్కువగా విక్రయించింది. TVS మోటార్స్ గత నెలలో 7,675 యూనిట్ల iQUBE స్కూటర్లను విక్రయించగా, గత సంవత్సరం 8758 యూనిట్లను విక్రయించగలిగిన TVS మోటార్స్ రెండవ స్థానంలో ఉంది. బజాజ్ ఆటో గురించి మాట్లాడుకుంటే.. కంపెనీ గత నెలలో తన ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ 7529 యూనిట్లను విక్రయించగా, గత సంవత్సరం కంపెనీ కేవలం 4,093 యూనిట్లను మాత్రమే విక్రయించింది. అంటే ఈసారి బజాజ్ అమ్మకాలు కూడా పెరిగాయి.
Also Read: Womens Health 2024 : నేడే ‘ఉమెన్ హెల్త్ డే’.. గొప్ప లక్ష్యం కోసం ముందడుగు
ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ బలంగా ఉంది
ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు నిరంతరం తగ్గుతున్నాయి. గత నెలలో కంపెనీ 4,062 యూనిట్లను విక్రయించింది. ఇది నాల్గవ స్థానంలో నిలిచింది. గతేడాది కంపెనీ 7,802 యూనిట్లను విక్రయించగా, ఈసారి కంపెనీ విక్రయాల్లో 48% క్షీణత నమోదైంది. అంటే ఈసారి కంపెనీ అమ్మకాలు 48% క్షీణించాయి. ఇటీవల కంపెనీ కొత్త ఫ్యామిలీ స్కూటర్ను విడుదల చేసింది. అయితే అది కూడా కంపెనీ అమ్మకాలను బలోపేతం చేయడంలో విజయవంతం కాలేదు.
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ అమ్మకాలు ఈసారి చాలా బాగున్నాయి. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ కేవలం 551 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. కంపెనీ తన అమ్మకాలను పెంచుకోవడంలో క్రమంగా విజయవంతం అవుతోంది. దీని వెనుక ఉన్న పెద్ద కారణం ఏమిటంటే.. కంపెనీ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సరసమైన మోడళ్లను మాత్రమే రూపొందిస్తోంది.
We’re now on WhatsApp : Click to Join