YS Jagan : వరద సాయం కింద రూ.1000 కోట్లు మంజూరు చేయండి!
భారీ వర్షాలు కారణంగా ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమైంది. ధన, ప్రాణ నష్టం సంభవించింది. రాకపోకలు స్తంబించిపోయాయి.
- By Balu J Published Date - 02:42 PM, Wed - 24 November 21
తక్షణ వరద సాయం కింద రూ.1000 కోట్లు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్లో వరద నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు. భారీ వర్షాల వల్ల రూ.6.54 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని, రాష్ట్రానికి ఐఎంటీసీ బృందాలను పంపాలని లేఖలో సీఎం కోరారు. నాలుగు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని సీఎం వైఎస్ జగన్ లేఖలో తెలిపారు. చాలా చోట్ల 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదుకాగా గ్రామీణ ప్రాంతాల్లోనూ నష్టం తీవ్రంగా ఉంది.
ఆంధ్రప్రదేశ్ ఇంకా వరదల బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ తమిళనాడు-శ్రీలంక తీరం వెంబడి బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో విస్తరించి ఉందని, ఫలితంగా అల్పపీడనం ఏర్పడుతుందని పేర్కొంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా శ్రీలంక – ఉత్తర తమిళనాడు వైపు ప్రయాణించే అవకాశం ఉంది.
అల్పపీడనం 26వ తేదీన తమిళనాడు, శ్రీలంకలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో 26, 27 తేదీల్లో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో, 27న వైఎస్ఆర్ కడప జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు నైరుతి బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం దీని ప్రభావంతో దక్షిణ తమిళనాడు వరకు విస్తరించి ఉండడంతో రాష్ట్రంలోని పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. రైతులు, పౌరులు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు కోరారు.
Tags
Related News
Chandrababu : ఐదేళ్లలో సీఎం జగన్ చేసిందేమీ లేదు..
అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన భారీ బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) (TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)పై ఘాటైన ప్రసంగం చేశారు.