HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >We Will Introduce One Class One Teacher Policy Minister Lokesh

Lokesh : ‘వన్‌ క్లాస్‌ వన్‌ టీచర్‌’ విధానం తెస్తాం : మంత్రి లోకేశ్‌

అనవసర ఆరోపణలతో సభను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. విద్యలోకి రాజకీయాలు, మతాన్ని తీసుకొచ్చి వివాదాస్పదం చేయవద్దు. రాష్ట్రంలో 7-8 వేల స్కూళ్లలో ‘వన్‌ క్లాస్‌ వన్‌ టీచర్‌’ విధానం తెస్తాం అని మంత్రి లోకేశ్‌ అన్నారు.

  • Author : Latha Suma Date : 19-03-2025 - 1:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
We will introduce 'One Class One Teacher' policy: Minister Lokesh
We will introduce 'One Class One Teacher' policy: Minister Lokesh

Lokesh : ఏపీ శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో వాడీవేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా కొత్త విద్యావిధానాన్ని కాషాయీకరణ చేశారంటూ వైసీపీ ఎమ్మెల్సీ రవీంద్రబాబు ఆరోపించారు. సిలబస్‌ను బీజేపీ కాషాయీకరణ చేసిందన్నారు. హిందూ మతం, హిందూ దేవుళ్లు అంటూ పలు అంశాలు పెట్టారన్నారు. రవీంద్రబాబు ఆరోపణలపై మంత్రి నారా లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాషాయీకరణ ప్రకారం సిలబస్‌ మార్పు చేశారనడం సరికాదని పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

Read Also:Drinking Cold Water : వేసవిలో కూల్ వాటర్ తాగుతున్నారా? అయితే వచ్చే సమస్యలు ఇవే !

హిందీ తప్పనిసరిగా నేర్చుకోవాలని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. మాతృభాషను ప్రోత్సహించండి.. కాపాడాలని కేంద్రం తెలిపింది. అని లోకేశ్‌ చెప్పారు. అనవసర ఆరోపణలతో సభను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. విద్యలోకి రాజకీయాలు, మతాన్ని తీసుకొచ్చి వివాదాస్పదం చేయవద్దు. రాష్ట్రంలో 7-8 వేల స్కూళ్లలో ‘వన్‌ క్లాస్‌ వన్‌ టీచర్‌’ విధానం తెస్తాం అని మంత్రి లోకేశ్‌ అన్నారు. ఇక, వైసీపీ సభ్యుడి మాటలు తప్పుగా ఉంటే వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని బొత్స సత్యనారాయణ కోరారు. దీన్ని మంత్రి లోకేశ్ స్వాగతించారు.

పాఠశాలల్లో సదుపాయాలపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలిచ్చారు. వైసీపీ తీరుతో ప్రభుత్వ పాఠశాలల్లో 12 లక్షల మంది విద్యార్థుల సంఖ్య తగ్గిందని మంత్రి నారా లోకేశ్‌ విమర్శించారు. సౌకర్యాలు లేక విద్యార్థులు ప్రైవేటు విద్యాసంస్థల్లో చేరారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యా శాఖలో సంస్కరణలు చేపట్టాం. టీచర్ల బదిలీల్లో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండకూడదు. టీచర్‌ ట్రాన్స్‌ఫర్‌ యాక్టును తీసుకొస్తున్నాం. ఉపాధ్యాయులు కేవలం పాఠాలు మాత్రమే చెప్పాలన్నది మా విధానం. వారిపై యాప్‌ల భారాన్ని తగ్గించి అన్ని వివరాలతో ఒకే యాప్‌ తీసుకొస్తున్నాం. మోడల్‌ స్కూళ్లు ఏర్పాటు చేసి విద్యాప్రమాణాలు పెంచుతున్నాం. పాఠశాలల్లో రేటింగ్స్‌ విధానం అమలు చేస్తాం. ‘మన బడి- మన భవిష్యత్తు’ కింద మౌలిక వసతులు కల్పిస్తాం’’ అని లోకేశ్‌ వివరించారు. గత ప్రభుత్వంలో ఐబీ రిపోర్టు కోసం రూ.5 కోట్లు ఖర్చు పెట్టారు. ఎక్కడ అమలు చేశారో చెప్పాలి. అప్పట్లో టోఫెల్‌కు రూ.60 కోట్లు ఖర్చు పెట్టారని లోకేశ్‌ తెలిపారు.

Read Also: Sunitha Williams : మీరు విజయవంతంగా తిరిగి రావడాన్ని గర్వంగా భావిస్తున్నాం: ప్రధాని

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap assembly
  • bjp
  • Minister Lokesh
  • MLC Ravindra Babu
  • One class
  • one teacher

Related News

Amaravati Capital

AP Assembly: అమరావతికి చట్టబద్ధత

Andhra Pradesh CM Chandrababu Naidu  రాజధాని అమరావతి చట్టబద్ధతపై ఏపీ అసెంబ్లీలో కీలక చర్చ జరుగుతోంది.  ఈ అంశానికి సంబంధించిన తీర్మానాన్ని  అసెంబ్లీలో ఏపీ సీఎం చంద్రబాబు  ప్రతిపాదన చేశారు .  అయితే,  ఇదే సమయంలో గత ముఖ్యమంత్రి జగన్‌పై అధికార పార్టీ నాయకులు విమర్శలు చేశారు.  జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర రాజధానిని మూడు ముక్కలాటగా మార్చేశారని మండిపడ్డారు. ఇక వచ్చే ఏప్రిల్ 2న ఈ బిల్లును ప

  • Speaker Ayyanna Patrudu

    AP Assembly: ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం : అయ్యన్నపాత్రుడు

  • Modi On Gst

    Modi : ప్రపంచంలోనే నెం 1 లీడర్ మోడీనే.. లేటెస్ట్ సర్వే చెపుతుంది ఇదే !!

Latest News

  • AP Health And Wellness: ఏపీ పాఠశాలల్లో హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ ప్రోగ్రాం

  • Dog : రూ.5 బిస్కెట్ తో 130 కి.మీ పాదయాత్ర చేసిన శునకం..ఇది కదా విశ్వాసం అంటే !!

  • IPL: ఐపీఎల్‌ ప్రసారాలపై బంగ్లాదేశ్ యూటర్న్

  • Pawan Kalyan : నిహారిక – వరుణ్ తేజ్ లకు పవన్ సపోర్ట్ ..ఓపెనింగ్ తోనే హైప్ తెచ్చుకున్న ‘బరి’

  • Revanth Reddy: రూ.700 కోట్లతో ఓంకారేశ్వర ఆలయం..శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి..

Trending News

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

    • Petrol ,Diesel Price Down : వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గింపు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd