Vizag Railway Zone: నెరవేరబోతోన్న రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ..
Vizag Railway Zone: దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. విశాఖ కేంద్రంగా జోన్ కార్యాలయం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. విశాఖలోని ముడసర్లోవ దగ్గర రైల్వేఖాకు కేటాయించిన భూముల్లో జోనల్ హెడ్ క్వార్టర్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది.
- By Kavya Krishna Published Date - 01:20 PM, Tue - 7 January 25

Vizag Railway Zone: రైల్వే శాఖకు సంబంధించి రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. విశాఖ కేంద్రంగా జోన్ కార్యాలయం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. విశాఖలోని ముడసర్లోవ దగ్గర రైల్వేఖాకు కేటాయించిన భూముల్లో జోనల్ హెడ్ క్వార్టర్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. రైల్వేశాఖకు 52 ఎకరాల స్థలం కేటాయించబడినట్లు తెలిపింది, అందులో 10 ఎకరాల్లో కొత్త భవనాలు నిర్మించేందుకు 149 కోట్లతో టెండర్లు ప్రారంభించబడ్డాయి.
దక్షిణ కోస్తా రైల్వేజోన్ ప్రక్రియ వైసీపీ ప్రభుత్వ హయంలోనే ప్రారంభమైనప్పటికీ, భూముల కేటాయింపులో జాప్యం జరిగినట్లు రైల్వే వర్గాలు చెప్తున్నాయి. ముడసర్లోవ ప్రాంతంలో భూములు రిజర్వాయర్ క్యాచ్మెంట్ ఏరియాకు దగ్గరగా ఉండటం, సాగు చేసే రైతుల నుంచి అభ్యతరాలు రావడం కారణంగా కేటాయింపులు ఆలస్యమయ్యాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూములపై అడ్డంకులను తొలగించేందుకు చర్యలు చేపట్టింది. చినగదిలి మండలం ముడసర్లోవలో 52.22 ఎకరాలు రైల్వేశాఖకు కేటాయించారు. ఆగస్టులో ఆ భూమి రైల్వేకు అప్పగిస్తూ, రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్ నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన మేరకు, ఈ రైల్వేజోన్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమైన మైలురాయిగా నిలిచిపోతుందని పేర్కొంది.
Yashasvi Jaiswal: వన్డేల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ ప్లేయర్.. ఎలా రాణిస్తాడో?
రైల్వే జోన్ భూముల కేటాయింపు విషయంలో అధికార, విపక్షాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఏడాది జనవరిలో క్లియరెన్స్ ఇచ్చిందని, ఇప్పుడు విమర్శలు చేయడం సరైనదేమీ కాదని అభిప్రాయపడింది. మరొక వైపు, తూర్పు కోస్తా రైల్వే జోన్ విషయంలో వాల్తేర్ డివిజన్ అంశంపై అనేక సందేహాలు ఉన్నాయి.
విశాఖ కేంద్రంగా వాల్తేర్ డివిజన్తో కూడిన రైల్వేజోన్ ఏర్పాటుకు ప్రజలంతా పెద్ద మద్దతు తెలుపుతున్నారు. విభజన చట్టం 13వ షెడ్యూల్లో ఉన్న హామీ మేరకు 2019లో కేంద్ర ప్రభుత్వం దక్షిణ కోస్తా రైల్వేజోన్ ప్రకటన చేసింది. ప్రస్తుతం ఉన్న గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో కలిపి ఈ జోన్ ఏర్పడనుంది. అయితే, వాల్తేర్ డివిజన్ను విభజించి విజయవాడ డివిజన్లో విలీనం చేయాలని, మిగిలిన భాగాన్ని తూర్పు కోస్తా రైల్వేజోన్ పరిధిలోని రాయగడ కేంద్రంతో కొత్త డివిజన్ ఏర్పాటును నిర్ణయించారు.
ఈ ప్రక్రియలో రాయగడ డివిజన్ ఏర్పాటయ్యింది, కానీ వాల్తేర్ డివిజన్ గురించి స్పష్టత లేదు. రైల్వే యూనియన్ లు జోన్ , డివిజన్ క్రమంగా కొనసాగించడం ద్వారా మాత్రమే అసలు ప్రయోజనాలు సాధ్యమవుతాయని అభిప్రాయపడుతున్నాయి. సమగ్రంగా, రైల్వేజోన్ కల అనుకున్న విధంగా శంకుస్థాపనకు చేరుకోవడం, ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా జరగడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది.
HMPV Virus : ఫ్లాష్.. ఫ్లాష్.. మరో రెండు హెచ్ఎంపీవీ కేసులు.. ఎక్కడంటే..!