HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >The People Of Pulivendula Have Gained Independence Mla Balakrishna

Balakrishna : పులివెందుల ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చింది: ఎమ్మెల్యే బాలకృష్ణ

గతంలో పులివెందులలో ఎన్నికలు అసలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేవి కావని, ఓటు వేయడమే కాదు, నామినేషన్ వేయడానికే అభ్యర్థులు భయపడే పరిస్థితి ఉండేదని బాలయ్య గుర్తు చేశారు. అయితే ఈసారి మాత్రం ప్రజలు ఎటువంటి భయం లేకుండా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు.

  • Author : Latha Suma Date : 14-08-2025 - 4:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
The people of Pulivendula have gained independence: MLA Balakrishna
The people of Pulivendula have gained independence: MLA Balakrishna

Balakrishna: పులివెందులలో ప్రజలకు అసలైన స్వాతంత్ర్యం ఇప్పుడే దక్కిందని, గతంలో ప్రజాస్వామ్యం పేరు మాత్రమే మిగిలిపోయిందని టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో పులివెందులలో ఎన్నికలు అసలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేవి కావని, ఓటు వేయడమే కాదు, నామినేషన్ వేయడానికే అభ్యర్థులు భయపడే పరిస్థితి ఉండేదని బాలయ్య గుర్తు చేశారు. అయితే ఈసారి మాత్రం ప్రజలు ఎటువంటి భయం లేకుండా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు.

ఇది పులివెందులలో ప్రజల బలమైన సంకల్పానికి నిదర్శనం. ప్రజలు ఇప్పుడు గళాన్ని వినిపించే అవకాశం పొందారు. స్వేచ్ఛగా అభ్యర్థులు నామినేషన్ వేయగలగడం, స్వేచ్ఛగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఇదే అని చెప్పాలి అని బాలకృష్ణ అన్నారు. తీవ్రంగా ప్రజలపై భయం మోపిన కాలం ఇప్పుడు వెనకపడిందని, పులివెందుల తన పూర్వవైభవాన్ని తిరిగి పొందుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు నిజమైన మార్పును కోరుకుంటున్నారని, తమ భవిష్యత్‌ కోసం తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నారని చెప్పారు.

పార్టీ కార్యకర్తల కృషి, ప్రజల నమ్మకమే ఈ విజయానికి కారణమని అభిప్రాయపడ్డ బాలయ్య ఇది ఓ సాధారణ ఉప ఎన్నిక కాదని, ఇది ప్రజల సంకల్పానికి ప్రతీక అన్నారు. పులివెందులలో కలిసికట్టుగా పనిచేసిన పార్టీ నేతలు, కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నిక ఫలితాలు తెలుగుదేశం పార్టీకి మంచి ఊతాన్నివ్వడమే కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లోనూ కొత్త మార్గదర్శకాన్ని సూచిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. పులివెందులలో జరిగిన ఈ పరిణామం రాష్ట్రవ్యాప్తంగా మార్పుకు బీజం వేస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీపాకు ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి ఘన విజయం సాధించారు. ఆమె 6,035 ఓట్ల మెజార్టీతో గెలిచారు. వైసీపీ అభ్యర్థి హేమంత్‌రెడ్డి డిపాజిట్‌ కోల్పోయారు. వైసీపీకి 683 ఓట్లు లభించాయి. స్వతంత్ర అభ్యర్థులు, కాంగ్రెస్‌కు 100 లోపు ఓట్లు లభించాయి. ఈ స్థానానికి టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి 11 మంది పోటీపడ్డారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో 74 శాతం ఓటింగ్‌ నమోదైంది. ఇకపోతే..ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి విజయం సాధించారు. ఈ ఉప ఎన్నికలో ముద్దుకృష్ణారెడ్డికి 12,780 ఓట్లు రాగా, .. వైసీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి 6,513 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి 6,267 ఓట్లతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

Read Also: Arjun Tendulkar: సానియా చందోక్‌తో అర్జున్ టెండూల్క‌ర్ నిశ్చితార్థం.. ఎవ‌రీమె?!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh politics
  • balakrishna
  • democracy
  • Pulivendula
  • tdp
  • TDParty
  • ZPTC election

Related News

Btechravi

జగన్‌కు షాక్.. టీడీపీలోకి వైసీపీ కీలక నేత

Pulivendula politics : పులివెందులలో వైఎస్సార్‌సీపీకి షాక్ తగిలింది. వైఎస్ జగన్‌కు సన్నిహితులైన దంతులూరి కృష్ణ అనుచరుడు, మరికొన్ని కుటుంబాలు టీడీపీలో చేరారు. ఈ సభలో జగన్‌ను ‘కన్నడ బిడ్డ’ అంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పులివెందుల అభివృద్ధిపై మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, శ్రీనివాసరెడ్డిలు జగన్‌ను విమర్శించారు. స్థానిక ఎన్న

  • Akhanda 2 Wwd

    Akhanda 2 : అఖండ-2 వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్లు

  • Akhanda 2 Talk

    Akhanda 2 Collections : బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల తాండవం చూపించిన బాలయ్య

  • Akhanda 2 Review

    Akhanda 2 Review : బాలయ్య అఖండ 2 మూవీ రివ్యూ!

  • Akhanda 2 Talk

    Akhanda 2 Talk: ‘అఖండ-2’ – బాలయ్య విలయతాండవం

Latest News

  • డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

  • గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

  • సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

  • నిధి అగర్వాల్ చేదు అనుభవం, మాల్ ఆర్గనైజర్లపై కేసు నమోదు

  • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd