HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >The Foundation For The Tears Of Amaravati Farmers Union Minister Pemmasani Chandrasekhar

AP Capital: అమరావతి రైతుల కన్నీళ్లకు పునాది.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

  • Author : Vamsi Chowdary Korata Date : 01-04-2026 - 2:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pemmasani Chandrasekhar
Pemmasani Chandrasekhar

Pemmasani Chandrasekhar ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుపై పార్లమెంటులో చర్చ వాడివేడిగా సాగింది. ఈ సందర్భంగా ఏపీకి చెందిన ఎన్డీయే ఎంపీలు, కేంద్ర మంత్రులు గత వైసీపీ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మూడు రాజధానుల పేరుతో జగన్ ఆడిన నాటకానికి ఈ బిల్లుతో తెరపడిందని వారు స్పష్టం చేశారు.

బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ మాట్లాడుతూ, “పులివెందుల ఎమ్మెల్యే జగన్.. మీ ఊసరవెల్లి రాజకీయాలు ఇకపై సాగవు” అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అమరావతిని ఏకగ్రీవంగా అంగీకరించిన తర్వాత, జగన్ తన రంగు మార్చి మూడు రాజధానుల బిల్లు తీసుకువచ్చారని విమర్శించారు. ఈ అశాస్త్రీయ ప్రతిపాదనను రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించారని గుర్తుచేశారు. ఈ చారిత్రాత్మక బిల్లుతో అమరావతికి శాశ్వత, చట్టపరమైన భద్రత లభించిందని, ఇకపై రాజధానిని అంగుళం కూడా ఎవరూ కదల్చలేరని స్పష్టం చేశారు. ఈ బిల్లుకు సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ అమరావతి రైతులు పడిన కష్టాలను వివరిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 29 వేల మంది రైతులను ‘పెయిడ్ ఆర్టిస్టులు’ అని అవమానించారని, మహిళలని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. 1631 రోజుల పాటు సాగిన ఉద్యమంలో రైతులపై మేకులున్న లాఠీలతో దాడి చేశారని, గర్భిణులను బూట్ల కాళ్లతో తన్నారని, వారి భోజనంలో ఇసుక పోసి హింసించారని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఆ తల్లుల కన్నీళ్లే ఈరోజు ఈ చట్టానికి పునాదిరాళ్లుగా మారాయని ఆయన వ్యాఖ్యానించారు.

మూడు రాజధానుల పేరుతో జగన్ ప్రభుత్వం ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి, రాష్ట్ర భవిష్యత్తును, ఐదేళ్ల అమూల్యమైన కాలాన్ని వృథా చేసిందని ఎంపీలు ఆరోపించారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలు ఆయా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలకు గ్రోత్ ఇంజన్లుగా ఉన్నాయని, ఏపీకి కూడా అలాంటి ఒకేఒక శక్తిమంతమైన రాజధాని అవసరమని వారు నొక్కిచెప్పారు. రాజధానిని నిర్ణయించే అధికారం కేవలం పార్లమెంటుకే ఉందని హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా వారు గుర్తుచేశారు. ఈ బిల్లుతో ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఉన్న అన్ని రకాల ఊహాగానాలకు తెర పడుతుందని, పెట్టుబడిదారులకు నమ్మకం కలిగి రాష్ట్ర అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందని వారు అభిప్రాయపడ్డారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • amaravati bill
  • Amaravati capital
  • Andhra Pradesh Reorganisation Act
  • Andhrapradesh
  • ap capital amaravati
  • cm ramesh
  • MP Pemmasani Chandrasekhar
  • parliament
  • YS Jagan Mohan Reddy

Related News

More Good News for DWCRA Women: Loans Up to ₹10 Lakhs

Dwcra Womens: డ్వాక్రా మహిళలకు మరో శుభవార్త.. రూ.10 లక్షల వరకు రుణం

రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీపికబురు చెప్పారు. డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వ్యక్తిగత రుణం అందిస్తామని అన్నారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా ఈ రుణాన్ని ఇస్తారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. డ్వాక్రా మహిళలు ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ఈ రుణాన్ని మంజూరు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

    Latest News

    • IPL 2026: ఆర్సీబీకి వరుసగా రెండోసారి ఐపీఎల్‌ టైటిల్‌

    • IPL 2026 : ఐపీఎల్ 2026 హీరో.. నూనుగు మీసాల కుర్రాడి రికార్డులు ఇవే

    • GT : గుజ‌రాత్ టైటాన్స్ టీమ్‌కు త‌ప్పిన పెనుప్ర‌మాదం

    • RCB : ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీ.. వ‌రుస‌గా రెండోసారి టైటిల్ గెలుచుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌

    • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్‌మ‌న్స్‌

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd