HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp Mp Kesineni Nani Fires In Cm Jagan

TDP MP Kesineni : రైతులను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలమైంది – టీడీపీ ఎంపీ కేశినేని నాని

తుఫాను సందర్భంగా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని టీడీపీ ఎంపీ కేశినేని

  • Author : Prasad Date : 09-12-2023 - 9:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TDP
TDP

తుఫాను సందర్భంగా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. తుఫాను ప్ర‌భావంతో నష్టపోయిన రైతాంగం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వారిని ఆదుకోవడంలో విఫలమైన జగన్ మోహన్ రెడ్డికి ప్రభుత్వంలో కొనసాగే అర్హత లేదని మండిప‌డ్డారు. మిచౌంగ్ తుఫాను మన రాష్ట్ర రైతాంగ జీవితాలను అతలాకుతలం చేసిందని.. వరి, మిర్చి, పత్తి, మొక్కజొన్న, అరటి, బొప్పాయి, మామిడి సహా అన్ని పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. లక్షలాది ఎకరాల్లో పంట నాశనమయిందని.. విజయవాడ పార్లమెంట్ పరిధిలో మైలవరం, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాల్లో వేల ఎకరాలలో పంట దెబ్బతింద‌ని తెలిపారు. వరి రైతు ఎకరానికి రూ.40,000/- వరకు నష్టపోయార‌ని.. రైతులను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫల‌మైంద‌న్నారు. హుద్ హుద్, తిత్లి తుఫానుల సమయంలో జనజీవనం సాధారణ స్థితికి వచ్చేవరకు చంద్రబాబు నాయుడు ప్రజల మధ్య ఉండి రాత్రి బస్సులో బస చేసి వారికి ధైర్యం కల్పించారని ఎంపీ కేశినేని నాని గుర్తు చేశారు.

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి రాష్ట్రంలో రైతుల పరిస్థితిని జరిగిన నష్టాన్ని వివరించాన‌ని.. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని కాబట్టి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకొని రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని కోరితే ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ప్రజలను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలమైనందున తక్షణ సాయం కింద ఐదు వేల కోట్లు ఇవ్వాలని ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్ లో డిమాండ్ చేశారని తెలిపారు. అసలే కరువుతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ లో ఈ తుఫాను వల్ల భారీగా నష్టపోయిన వారిని ఆదుకోవాలని ఎంపీ రామ్మోహన్ నాయుడు సైతం కోరారని తెలిపారు. రైతులు, పేద ప్రజల పట్ల ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సానుకూలంగా ఉండి వారి తరుపున పోరాటం చేస్తుంద‌ని.. బాధితులను రైతులను ఆదుకోవడంలో వైసిపి ప్రభుత్వం విఫలమైనా తెలుగుదేశం పార్టీ తరఫున ఢిల్లీ నుంచి గల్లి వరకు పోరాటం చేసి వారిని ఆదుకుంటామ‌న్నారు.

ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని అది చేయడమే ప్రజా ప్రతినిధులుగా త‌మ బాధ్యత అని ఎంపీ కేశినేని నాని తెలిపారు. అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నేర్పించిన బాటలో ప్రజాప్రతినిధులుగా ముందుకు వెళ్తున్నాన‌ని తెలిపారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో మంచినీటి ఎద్దడి ఉండడంతో ప్రతి గ్రామానికి వాటర్ ట్యాంక్ ను ఇచ్చే బాధ్యతను తీసుకున్నాన‌ని తెలిపారు. చంద్రబాబు నాయుడుని అక్రమ కేసులో ఇరికించి అరెస్టు చేయడం వల్ల కొన్నాళ్లపాటు ట్యాంకర్ల పంపిణీన‌ని వాయిదా వేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఇప్పటికే 120 గ్రామాల వరకు వాటర్ ట్యాంకర్లు అందించామ‌ని.. ఫిబ్రవరి కి నీటి ఎద్దడి మొదలవుతుంది కాబట్టి మిగిలిన 160 గ్రామాలకు కూడా జనవరిలోగా టాంకర్లు అందిస్తామ‌న్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే అవకాశం విజయవాడ ప్రజలు, నారా చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీ త‌న‌కు ఇచ్చార‌ని తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • cm jagan
  • tdp
  • TDP MP kesineni nani
  • vijayawada

Related News

Woman Slapped By Rtc Bus Co

Vijayawada : ఆర్టీసీ బస్ కండక్టర్ చెంప చెళ్లుమనిపించిన మహిళ

విజయవాడలో టికెట్ల కేటాయింపు మరియు ఆధార్ కార్డుల విషయంలో తలెత్తిన చిన్నపాటి వాగ్వివాదం, ఒక మహిళా ప్రయాణికురాలు కండక్టర్‌పై దాడి చేసే వరకు వెళ్లడం కలకలం రేపింది

  • Ambati Rambabu

    Ambati Rambabu: అమరావతిపై అంబటి విషం..

  • Chandrababu Naidu

    Cm Chandrababu Naidu: చరిత్ర నిన్ను క్షమించదు జగన్: చంద్రబాబు

  • Vijayasai Reddy about amaravati

    Vijaya Sai Reddy: అమరావతిపై మరోసారి నోరు పారేసుకున్న విజయసాయిరెడ్డి

  • Vishnu Kumar Raju

    Political Satire: జగన్ పై విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు

Latest News

  • Tamil Nadu : చదివింది ఆరో తరగతి..ఆస్తి వెయ్యి కోట్లకు పైగానే !! AIADMK అభ్యర్థి చిట్టా !!

  • Manipur Unrest : మరోసారి మణిపుర్లో ఉద్రిక్తత

  • Prostate Cancer : హైదరాబాద్‌లో పెరుగుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు – జాగ్రత్త అంటున్న అపోలో వైద్యులు

  • TG CM Vs Kerala CM : తెలంగాణ సీఎం రేవంత్ కు విజయన్ కౌంటర్

  • David Warner Arrest : డేవిడ్ వార్నర్ అరెస్ట్..ఏంచేసాడో తెలుసా ?

Trending News

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd