HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tadepalli Kotaku Supreme Tension Hearing On Sunithas Petition On Monday

Tadepalli: తాడేపల్లి కోటకు సుప్రీమ్ టెన్షన్, సునీత పిటిషన్ పై సోమవారం విచారణ

సుప్రీం కోర్ట్ భయం వైఎస్ కుటుంబాన్ని వెంటాడుతోంది. తెల్లవారితే కోర్టు ఏమి చెబుతుందోనన్న ఆందోళన తాడేపల్లి కోటలో కనిపిస్తుంది.

  • Author : CS Rao Date : 23-04-2023 - 11:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Viveka murder
Tadepalli Kotaku Supreme Tension, Hearing On Sunitha's Petition On Monday

సుప్రీం కోర్ట్ భయం వైఎస్ కుటుంబాన్ని వెంటాడుతోంది. తెల్లవారితే కోర్టు ఏమి చెబుతుందోనన్న ఆందోళన తాడేపల్లి (Tadepalli) కోటలో కనిపిస్తుంది. మాజీ మంత్రి వివేకా కుమార్తె వేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో సోమవారం విచారణకు రాబోతుంది. తెలంగాణ హై కోర్టులో ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి వేసిన పిటిషన్ ను సవాల్ చేస్తూ సునీత సుప్రీం కు వెళ్లిన విషయం విదితమే. దానిపై గతవారం విచారణ జరిగిన సందర్భంగా వాదనలకు అవినాష్ లాయర్లు టైం అడిగారు. దీంతో సోమవారంకు కేసు వాయిదా పడింది.

ప్రతి వాదులకు ఆ మేరకు నోటీసులు కూడా జారీ చేసింది. ఇప్పుడు ఆ పిటిషన్ మీద అవినాష్ రెడ్డి తరపున న్యాయవాదులు సోమవారం వాదనలు వినిపిస్తారు. అప్పుడు సుప్రీం ఇచ్చే తీర్పు అవినాష్ రెడ్డి అరెస్ట్ ను తేలనుంది. వాస్తవంగా ముందస్తు బెయిలు పైహై కోర్ట్ గత వారం తీర్పు ఇస్తూ 25 వ తేదీ వరకు అరెస్ట్ వద్దని చెప్పింది. దానిపై సుప్రీం స్టే ఇస్తూ 25 వరకు అరెస్ట్ చేయొద్దని సీబీఐ కి సూచించింది.

గత నాలుగు రోజులుగా ప్రతి రోజు అవినాష్ ను సీబీఐ విచారిస్తుంది. ఆ క్రమంలో ఆదివారం సీబీఐ సిట్ లోని ఒక టీమ్ కడపకు వెళ్ళింది. హత్య జరిగిన ప్లేస్ ను పరిశీలించింది. అక్కడ నుంచి అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లి తనిఖీలు చేసింది. ఆయన పిఏ, కంప్యూటర్ ఆపరేటర్ లను విచారించింది. అవినాష్ పాత్రపై నిర్దారణకు రావడానికి సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసింది. హత్య జరిగిన రోజు సమీపంలోని గ్రామానికి ప్రచారం కోసం వెళ్ళాను అని చెప్పిన అవినాష్ మాటలను నిర్దారించు కోవడానికి ఆ గ్రామానికి సీబీఐ టీం వెళ్ళింది.

వివేకా , అవినాష్ రెడ్డి ఇంటికి ఉన్న దూరం నుంచి ఆ రోజు జరిగిన సంఘటనపై మినిట్ తో మినిట్ సీన్ కన్స్ట్రక్షన్ చేశారు సీబీఐ అధికారులు. ఆదివారం ఉదయం నుంచి పులివెందుల లొనే సీబీఐ అధికారులు ఉన్నారు. కంప్యూటర్ ఆపరేటర్ ఇయంతుల్లాను ఒంటరిగా బయటకు తీసుకెళ్లిన సీబీఐ అధికారులు సుదీర్ఘంగా అతన్ని విచారణ చేశారు. హత్య జరిగిన రోజు ఎవరు ఫోటోలు తీశారు? ఎవరెవరికి పంపారు? అప్పుడు పంపారు? ఇలాంటి అంశాలను అతని నుంచి రాబట్టారు.

వరుసగా భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను విచారణ చేసిన సీబీఐ సోమవారం ప్రోగ్రెస్ రిపోర్ట్ ను సుప్రీం కోర్ట్ కు అందించనుంది. ఒక టీం ఢిల్లీ వెళ్లగా మరో టీం అవినాష్ రెడ్డి వ్యవహారాన్ని తేల్చడానికి కసరత్తు చేస్తోంది. విచారణ కోసం సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన గడువు దగ్గర పడుతున్న కొద్దే సీబీఐ పెంచిన వేగం తాడేపల్లి (Tadepalli) కోటను కదిలిస్తుంది. సోమవారం ఇచ్చే సుప్రీమ్ కోర్ట్ ఇచ్చే డైరెక్షన్ సర్వత్రా టెన్షన్ పుట్టిస్తుంది.

Also Read:  CBI: ఆదివారం 6 గంటలు విచారణ, కీలక సమాచారం రాబట్టిన సీబీఐ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • andhra pradesh
  • ap
  • Avinash
  • case
  • cbi
  • Hearing
  • jagan
  • petition
  • Sunitha
  • Supreme Court
  • tadepalli
  • tension
  • Viveka
  • Vivekananda Reddy
  • ycp
  • ysrcp

Related News

Bhogi Mantalu

భోగి మంటలు విషయంలో జాగ్రత్తలు అవసరం !

పూర్వం భోగి మంటలంటే పాత సామాన్లు, ఎండుటాకులు, చెక్క ముక్కలతో వేసేవారు. కానీ నేడు ఆధునిక జీవనశైలిలో భాగంగా టైర్లు, ప్లాస్టిక్ కవర్లు, పాత ఫ్లెక్సీలు వంటి ప్రమాదకరమైన వస్తువులను మంటల్లో వేయడం

  • Minister Vasamsetti Subhash

    భక్తుల మనోభావాలతో చెలగాటమాడితే సహించేది లేదు: మంత్రి వాసంశెట్టి సుభాష్

  • 2026 Central Budget

    కేంద్ర బడ్జెట్ పైనే ఏపీ ఆశలన్నీ, మరి న్యాయం జరిగేనా?

  • Sajjala

    రాజధానిగా అమరావతే కరెక్ట్ – మాట మార్చిన సజ్జల రామకృష్ణ రెడ్డి

  • Restraint is needed on water disputes: CM Revanth Reddy

    జల వివాదాలపై సంయమనం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి

Latest News

  • జాతర కంటే ముందే మేడారంలో భక్తుల రద్దీ

  • న్యూజిలాండ్‌తో తొలి వ‌న్డే.. టీమిండియా జ‌ట్టు ఇదే!

  • రేప్ కేసులో అరెస్టైన ఎమ్మెల్యే

  • అంతర్జాతీయ ఉద్రిక్తతలు నేపథ్యంలో భారత రక్షణ బడ్జెట్ పెరుగుతుందా?

  • సంక్రాంతి కోడి పందేలను అడ్డుకోవాలంటూ హైకోర్టు ఆదేశాలు, ఇది సాధ్యమేనా?

Trending News

    • బెంగాలీ మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఎరుపు- తెలుపు రంగుల చీర‌లు ఎందుకు క‌ట్టుకుంటారో తెలుసా?!

    • టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రాక్టీస్ సెషన్‌లో రిషబ్ పంత్‌కు గాయం!

    • తెలంగాణ ఎప్‌సెట్ అభ్యర్థులకు శుభవార్త!

    • అయోధ్యలో కలకలం.. రామ్ మందిర్ ప్రాంగణంలో నమాజ్‌?!

    • ఎస్బీఐ రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్.. 35 లక్షల వరకు పర్సనల్ లోన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd