HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Survey Game In Narsapuram Politics

Narsapuram:పొలిటికల్ ‘ఆత్మ’ సర్వే ఆట

నరసాపురం ఉప ఎన్నికల ఫలితాలపై సర్వేల గేమ్ మొదలు అయింది. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఫలితాలను అంచనా వేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి ఎవరో ఇంకా తెలియకుండానే పార్టీల వారీగా ఓటు శాతాన్ని లెక్కిస్తున్నారు.

  • By CS Rao Published Date - 04:44 PM, Wed - 19 January 22
  • daily-hunt
Rahu
Rahu

నరసాపురం ఉప ఎన్నికల ఫలితాలపై సర్వేల గేమ్ మొదలు అయింది. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఫలితాలను అంచనా వేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి ఎవరో ఇంకా తెలియకుండానే పార్టీల వారీగా ఓటు శాతాన్ని లెక్కిస్తున్నారు. ఆత్మసాక్షి సర్వే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం సింగిల్ గా టీడీపీ గెలుస్తుంది. జనసేనతో కలసి వెళ్తే లక్షల్లో మెజార్టీ కనిపిస్తుంది. స్వతంత్ర అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు పోటీ చేసినా 50వేల మెజార్టీతో గెలుస్తాడాని ఆ సర్వే సారాంశం. జగన్ ప్రభుత్వం మీద ఎస్సీ లు కూడా 3 శాతం ప్రతికూలంగా ఉన్నారని ఆత్మసాక్షి భావిస్తుంది.ఆత్మసాక్షి సర్వే వారు నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో సర్వే చేయగా,ఇండివిడ్యుల్ గా చూసినట్లయితే తెలుగుదేశం 36.8 శాతం, వైయస్సార్ పార్టీ 36.3 శాతం ఓట్లను అంచనా వేస్తున్నారు. ఇక జనసేన 23.9 శాతం, బిజెపి 0.68 శాతం, కమ్యూనిస్టులకు 1.72 శాతం, ఇతరులకు 0.65 శాతం రావొచ్చని తేల్చారు.రైతులు, ఆక్వా రైతులు, నిరుద్యోగులు, సర్పంచులు, రోజువారి కూలీలు, పెన్షనర్లు మరియు గవర్నమెంట్ ఉద్యోగస్తులు, 18 నుంచి 35 సంవత్సరాల లోపు యువతీ యువకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు.ఎస్సీ కమ్యూనిటీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నా వారిలో కూడా 3% వ్యతిరేకంగా వెళ్ళిపోయినారు.అన్ని కమ్యూనిటీ లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమీకరణాలు మారుతున్నాయని అంచనా వేసింది.ఉన్న ఏడు నియోజకవర్గాల లోనూ, ఎలక్ట్రిసిటీ చార్జెస్, హౌస్ టాక్స్, గ్యాస్, డీజిల్, పెట్రోల్ , నిత్యవసర వస్తువులు మరియు శాండ్ పాలసీగురించి విపరీతమైన వ్యతిరేకత కనబడుతోంది.ప్రతి ఊరిలోనూ అభివృద్ధి రోడ్లు డ్రైన్లు శానిటేషన్ పనులు ఏవి జరగకపోవడం గురించి తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు.

అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, మూడు రాజధానులు కు వ్యతిరేకంగా అమరావతి కి అనుకూలంగా 68.5 శాతం మంది, మూడు రాజధానులు అనుకూలంగా 22.5 శాతం మంది, తటస్థంగా 9.5 శాతం మంది ఉన్నారు. అన్ని పార్టీలు ఒంటరిగా పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ 3 నుంచి 5 వేల మెజారిటీతో గెలుస్తుంది. తెలుగుదేశం మరియు జనసేన కలిస్తే లక్షా 20 వేల నుంచి లక్ష 30 వేల వరకు మెజారిటీ రావచ్చు.తెలుగుదేశం జనసేన మరియు బిజెపి కలిస్తే 75 వేల నుంచి 50 వేల వరకు మెజారిటీ వస్తుంది అంటే మెజారిటీ తగ్గుతుంది.రఘురామకృష్ణంరాజు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే 60 నుంచి 65 వేల మెజారిటీ వస్తుంది.ఈ సర్వే ను వైసీపీ వర్గాలు చేయించారని సోషల్ మీడియా టాక్. బీజేపీ, జనసేన , టీడీపీ కలిసి పోటీలోకి వెళ్తే తక్కువ ఓట్లు వస్తాయని తేల్చింది. అంతే కాదు , టీడీపీ అభ్యర్థిగా త్రిబుల్ ఆర్ పోటీ చేస్తే కేవలం 5 వేల మెజార్టీ తో బయట పడతాడట. అదే ఇండిపెండెంట్ గా చేస్తే 50వేల మెజార్టీ అంట. ఇలాంటి మైండ్ గేమ్ సర్వే ఎవరిదో..అందుకు సోషల్ మీడియా లో విడుదల చేశారో ..ఈజీగా అర్థం అవుతోంది. ఇలాంటి సర్వేలతో బెట్టింగ్ రాయుళ్లను సమాయత్తం చేయడం మినహా నిజాలు తక్కువగా ఉన్నాయని భోధపడుతుంది. ఇక రాబోయే రోజుల్లో ఇలాంటి సర్వేలు ఎవరికి తోచినవి వాళ్ళు బయటకు విసరడం ఖాయం. ఓటర్లు వాటి వలలో చిక్కు కోవడం మానుకోవాలి. ఇంకా త్రిబుల్ ఆర్ రాజీనామా చేయకుండానే ఇలా హల్చల్ జరుగుతోంది. నిజంగా ఉప పోరు షురూ అయితే నరసాపురం రాజకీయం రంజు..రంజుగా ఉండటం ఖాయం.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh politics
  • bjp
  • jagan mohan reddy
  • Jana Sena
  • narsapuram
  • Raghu Rama Raju
  • Telugu Desam
  • ysrcp

Related News

Bihar Speaker

Bihar Speaker: బీహార్‌లో స్పీకర్ పదవిపై రాజకీయ పోరు.. బీజేపీ, జేడీయూలలో ఎవరికి దక్కేను?

నియమాల ప్రకారం స్పీకర్ పదవికి చాలా ముఖ్యమైన అధికారాలు ఉన్నాయి. 1985 నాటి పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం.. స్పీకర్ ఏ ఎమ్మెల్యేనైనా అనర్హుడిగా ప్రకటించవచ్చు.

    Latest News

    • Cyclone Ditwah : శ్రీలంక కు దిత్వా తుపాను ఎఫెక్ట్.. భారత్ సాయం!

    • Cyclone Ditwah to bring Heavy Rains to AP : ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – హోంమంత్రి అనిత

    • Mutual Fund : ఈక్విటీల్లో కొత్త స్కీమ్స్ లాంచ్..లిస్ట్‌లో చేరిన టాటా ఫండ్..సబ్‌స్క్రిప్షన్ డేట్ ఫిక్స్!

    • Amaravati Construction : 2028 మార్చికి అమరావతి నిర్మాణం పూర్తి తేల్చేసిన చంద్రబాబు

    • Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత అరెస్ట్..స్టేషన్‌కు తరలించిన పోలీసులు..!

    Trending News

      • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

      • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

      • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

      • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

      • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd