HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Sharmila Blames Bjp Tdp Ysrcp For Polavaram Project Failures

Polavaram Project Failures: పోల‌వ‌రంపై ఎవ‌రి వర్షన్ క‌రెక్ట్‌.. ష‌ర్మిల చెప్పిన‌ట్లు త‌ప్పు ఈ పార్టీల‌దేనా..?

  • Author : Gopichand Date : 30-06-2024 - 12:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Polavaram Project Failures
Polavaram Project Failures

Polavaram Project Failures: ఏపీలో ప్ర‌స్తుతం పోల‌వ‌రం ప్రాజెక్ట్ (Polavaram Project Failures) ఓ హాట్ టాపిక్‌. పోల‌వ‌రం ప్రాజెక్ట్ చుట్టూనే ఏపీ రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. ప్ర‌స్తుతం ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలో ఉంది. సీఎంగా టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ బాధ్య‌తులు చేప‌ట్టారు. అయితే చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వెంట‌నే చేప‌ట్టిన మొద‌టి ప‌ర్య‌ట‌న పోల‌వ‌రం ప్రాజెక్ట్ సంద‌ర్శ‌న‌. ఇక‌పై ప్రతి సోమ‌వారం పోల‌వ‌రం వెళ్తాన‌ని మీడియా ముఖంగా చెప్పారు. అయితే గ‌త వైసీపీ ప్ర‌భుత్వం వ‌ల‌న పోల‌వరం ప్రాజెక్ట్‌కు తీవ్ర న‌ష్టం క‌లిగింద‌ని చంద్ర‌బాబు త‌రుపున వాద‌న‌.

మ‌రోవైపు మాజీ మంత్రి, వైసీపీ నాయ‌కుడు అంబ‌టి రాంబాబు పోల‌వ‌రం ప్రాజెక్ట్ పూర్తి కాక‌పోవ‌డానికి కార‌ణం చంద్ర‌బాబే అని ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ స్టేట్మెంట్ ఇచ్చేశారు. అంతేకాకుండా త‌న‌కు పోల‌వరం ప్రాజెక్ట్ అర్థం కాలేద‌ని త‌న‌కే అర్థం కాకుంటే ఎవ‌రీ అర్థం కాద‌ని హాస్యస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. 2029 వ‌ర‌కు కూడా చంద్ర‌బాబు పోల‌వ‌రం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయ‌లేర‌ని చాలెంజ్ చేశారు. తాజాగా పోల‌వ‌రం ప్రాజెక్ట్‌పై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల త‌న‌దైన శైలిలో స్పందించారు. పోల‌వ‌రం ప్రాజెక్ట్‌పై త‌న ఆవేద‌న‌ను ట్వీట్‌లో తెలిపారు.

కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లు…పోలవరం విధ్వంసానికి అసలు కారకులు బీజేపీ,టీడీపి,వైసీపీ పార్టీలే. ప్రాజెక్ట్ కట్టి 28లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం దివంగత ముఖ్యమంత్రి YSR ఆశయమయితే…పంతాలు పట్టింపులకు పోయి జీవనాడి పై ఇన్నాళ్లు జరిగింది రాజకీయ దాడి తప్పా మరోటి కాదు. విభజన…

— YS Sharmila (@realyssharmila) June 29, 2024

Also Read: Army Chief – Navy Chief : ఆర్మీ, నేవీ చీఫ్​లుగా క్లాస్‌మేట్స్.. కొత్త చరిత్ర లిఖించిన ఫ్రెండ్స్

ష‌ర్మిల ట్వీట్‌లో ఏం రాశారంటే.. కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లు.. పోలవరం విధ్వంసానికి అసలు కారకులు బీజేపీ,టీడీపి,వైసీపీ పార్టీలే. ప్రాజెక్ట్ కట్టి 28లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం దివంగత ముఖ్యమంత్రి YSR ఆశయమయితే…పంతాలు పట్టింపులకు పోయి జీవనాడి పై ఇన్నాళ్లు జరిగింది రాజకీయ దాడి తప్పా మరోటి కాదు. విభజన సమయంలో పోలవరానికి కాంగ్రెస్ జాతీయ హోదా ఇస్తే… మోడీ సర్కార్ ఆ భాధ్యత 10 ఏళ్లు విస్మరించి నిధులు ఇవ్వకుండా సవతి తల్లి ప్రేమ చూపింది. కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్ట్ ను తానే కడతానని చెప్పి పొలవారం,సోమవారం అంటూ హడావిడి తప్పా బాబు మొదటి 5 ఏళ్లలో చేసింది శూన్యం.

రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ అంచనా వ్యయం పెంచాడే తప్పా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.10 వేల కోట్లతో కాంగ్రెస్ హయాంలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టుకు నిర్లక్ష్యం ఖరీదు అక్షరాల 76 వేల కోట్లు. ప్రాజెక్ట్ కట్టాలంటే మరో 5 ఏళ్లు పడుతుందని చెప్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు.. మోదీ పిలక మీ చేతుల్లోనే ఉంది. కేంద్రాన్ని శాసించే అధికారం మీ దగ్గరుంది కాబట్టి.. పూర్తి స్థాయి నిధులు తెచ్చి,రాష్ట్రంపై ఆర్థిక భారం పడకుండా, పోలవరం పూర్తి చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అని ఓ ట్వీట్ వేశారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ ఏపీ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

We’re now on WhatsApp : Click to Join


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • chandrababu
  • congress
  • polavaram project
  • Telugudesam
  • ys jagan
  • ys sharmila
  • ysrcp

Related News

Congress ranks call for movement in wake of National Herald case

నేషనల్ హెరాల్డ్ కేసు నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల ఉద్యమ పిలుపు

ఈ కేసును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుగా ఉపయోగించిందని కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. ఏఐసీసీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను లక్ష్యంగా చేసుకుని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ద్వారా వేధింపులకు పాల్పడ్డారని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.

  • Changes in Congress's action on National Employment Guarantee.

    జాతీయ ఉపాధి హామీపై కాంగ్రెస్ కార్యాచరణలో మార్పులు..

  • YS Jagan to meet Governor today with one crore signatures

    కోటి సంతకాలతో నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్

  • Telangana Speaker G Prasad Kumar

    తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

  • KTR

    కేటీఆర్ వెనుకబడిన ఆలోచనలతోనే బీఆర్‌ఎస్ పతనం.. కాంగ్రెస్ ఫైర్

Latest News

  • చలికాలంలో ఈ ఫుడ్స్ తింటే అంతే.. ఫుడ్ ఎక్సపర్ట్స్ వార్నింగ్

  • ఈ ఏడాది చివరి అమావాస్య.. ఏ రోజు వచ్చిందో తెలుసా ప్రాముఖ్యత ఇదే

  • డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

  • గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

  • సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd