HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pm Modi Public Meeting At Visakhapatnam

Jagan Agenda Before Modi: మోడీ ఎదుటే `జ‌గ‌న్ ఎజెండా` కుండ‌బ‌ద్ద‌లు

వైసీపీ ఎజెండా ఏమిటో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఎదుట సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే మా ఎజెండా అంటూ ప‌రోక్షంగా బీజేపీకి జ‌ల‌క్ ఇచ్చారు. రాజ‌కీయాలకు అతీతంగా మోడీతో అనుబంధం ఉంద‌ని చెబుతూనే ఏపీ ప్ర‌యోజ‌నాల‌ను కాపాడే ఏ ఇత‌ర పార్టీల‌తోనైన జ‌త క‌ట్ట‌డానికి వెనుకాడ‌బోన‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సున్నితంగా పరోక్ష సంకేతాలు ఇవ్వ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం రేపుతోంది.

  • Author : CS Rao Date : 12-11-2022 - 11:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Modi Jagan
Modi Jagan

వైసీపీ ఎజెండా ఏమిటో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఎదుట సీఎం జగన్ మోహన్ రెడ్డి కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే మా ఎజెండా అంటూ ప‌రోక్షంగా బీజేపీకి జ‌ల‌క్ ఇచ్చారు. రాజ‌కీయాలకు అతీతంగా మోడీతో అనుబంధం ఉంద‌ని చెబుతూనే ఏపీ ప్ర‌యోజ‌నాల‌ను కాపాడే ఏ ఇత‌ర పార్టీల‌తోనైన జ‌త క‌ట్ట‌డానికి వెనుకాడ‌బోన‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సున్నితంగా పరోక్ష సంకేతాలు ఇవ్వ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం రేపుతోంది.

దేశ ప్రగతి రథసారథి, గౌరవనీయులు, పెద్దలు, ప్రధాని నరేంద్ర మోదీ గారికి విశాఖకు రావ‌డాన్ని హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నానని ముఖ్యమంత్రి జగన్ ఆత్మీయ‌త‌ను ప్ర‌ద‌ర్శించారు. చారిత్రక ఆంధ్ర యూనివర్శిటీలో ఈరోజు ఒకవైపు సముద్రం, మరోవైపు జన సముద్రం కనిపిస్తున్నాయని ఉత్తేజ‌ప‌రిచారు. ఈ సభకు ఉత్తరాంధ్ర జనం ప్రభంజనంలా తరలివచ్చారని అన్నారు. రాష్ట్రంలో ₹. 10,742 కోట్ల విలువైన పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తున్నందుకు రాష్ట్ర ప్రజలందరి తరపున, ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. విశాఖలోని ఏయూ గ్రౌండ్ లో ప్రధాని మోదీ సభలో జగన్ ప్రసంగం క్లుప్తంగా ముగిసింది.

Also Read:  Lokesh Yatra: పాద‌యాత్ర‌కు యువ‌కెర‌టం రెడీ

మూడేళ్ల‌లో రాష్ట్రంలో జ‌రిగిన అభివృద్ధి గురించి ప్ర‌స్తావించారు. ‘సార్, ఈ మూడేళ్లలో ప్రజలకు అనుకూలంగా ఎన్నో చేశాం. మహిళలకు సాధికారత, విద్య, వైద్యం, గ్రామ సచివాలయాలు వంటి కార్యక్రమాల్లో ఎంతో అభివృద్ధిని సాధించాం. గడప వద్దకే పాలన ప్రాధాన్యతగా అడుగులు ముందుకు వేస్తున్నాం. ఏపీకి మీరు పెద్ద మనసుతో ఎంతో చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో, ముఖ్యంగా మీతో మాకు ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. కేంద్రంతో మా అనుబంధం రాజకీయాలకు అతీతమైనది. రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా రైల్వే జన్ వంటి వాటిపై మేము పలుమార్లు చేసిన విన్నపాల పట్ల సానుకూలంగా స్పందించాలని కోరుకుంటున్నా. రాష్ట్రానికి మీరు చేసే ప్రతి సాయం, ఇచ్చే ప్రతి సంస్థ, ప్రతి రూపాయి మా అభివృద్ధికి దోహదపడతాయి. పెద్దలైన మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి` అంటూ జ‌గ‌న్ ప్ర‌త్య‌క్షంగా న‌మో అంటూనే ప‌రోక్షంగా నిల‌దీయ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌త్యేక హెలికాప్ల‌ర్లో ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్ కు ప్రధాని మోదీ చేరుకున్నారు. ఐఎన్ఎస్ చోళ గెస్ట్ హౌస్ నుంచి హెలికాప్టర్ లో సభాస్థలికి వ‌చ్చారు. ఈ సందర్భంగా మోదీకి కీలక నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రధానికి జగన్ శాలువా కప్పి సత్కరించారు. శ్రీరాముడి విగ్రహాన్ని బహూకరించారు. అనంతరం సభాస్థలి వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రధాని వీక్షించారు.

Also Read:  Pawan Kalyan: ఏపీ ప్రజలకు మంచిరోజులు రాబోతున్నాయి… మోదీ తో భేటీ తర్వాత పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన.!!

అభివృద్ధి పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఇప్పటికే పూర్తయిన పనులను జాతికి అంకితం చేశారు. అనంతరం భారీ బహింరంగ సభలో మోడీ ప్ర‌సంగించారు. ఏపీలో రూ. 10,742 కోట్లతో చేపట్టనున్న పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు, ఇప్పటికే పూర్తయిన పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయ‌డం ఆనందంగా ఉంద‌ని మోడీ అన్నారు. మోదీ సభను వైసీపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జ‌నాన్ని త‌ర‌లించారు. వీరి తరలింపు కోసం 4 వేల బస్సులు, పెద్ద సంఖ్యలో వాహనాలను ఏర్పాటు చేశారు. 8,500 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. భారీగా వ‌చ్చిన జనాలతో మద్దిలపాలెం జంక్షన్ జన సంద్రంగా మారింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra CM Jagan Reddy
  • modi visakha
  • PM Modi meets
  • PM modi visit
  • Visakha Capital
  • Visakhapatnam
  • vizag
  • vizag tour

Related News

Pawan Kalyan's Convoy Meets

Accident : పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కు ప్రమాదం

బుధవారం ఉదయం ఆయనను పికప్ చేసుకోవడానికి కాన్వాయ్ వాహనాలు విశాఖలోని సిరిపురం నుంచి పెద్దవాల్తేరు వైపు వెళ్తున్నాయి. ఈ క్రమంలో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో కాన్వాయ్‌లోని ఒక వాహనం అకస్మాత్తుగా సడన్ బ్రేక్ వేయడంతో, వెనుక వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి

    Latest News

    • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

    Trending News

      • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

      • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

      • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

      • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd