Pawan Kalyan: ఏపీ ప్రజలకు మంచిరోజులు రాబోతున్నాయి… మోదీ తో భేటీ తర్వాత పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన.!!
- By hashtagu Published Date - 10:24 PM, Fri - 11 November 22

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం అనంతరం పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీతో భేటీ అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. మోదీని 8ఏళ్ల తర్వాత కలిశానని పవన్ చెప్పారు. పీఎంఓ, కార్యాలయం నుంచి తనను కలవాలని అధికారిక ప్రకటన వచ్చిందని…అందుకే ప్రధానమంత్రిని ఇవాళ కలిశానని పవన్ వెల్లడించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నట్లు పవన్ చె్ప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషంగా ఉండాలని..రాష్ట్ర డెవలప్ మెంట్ జరగాలని..దానికోసం తాను కృషి చేస్తానని మోదీ హామీ ఇచ్చినట్లుగా పవన్ కల్యాణ్ చెప్పారు.