HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Kalyan Comments On Ysrcp Leaders

Pawan Kalyan : విపత్తు సమయంలో చిల్లర రాజకీయాలు : పవన్‌ కల్యాణ్‌

రాష్ట్రంలో విపత్తు సమయంలో వైసీపీ నాయకులు ఇంట్లో కూర్చుని చిల్లర రాజకీయం చేస్తున్నారని, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి వరద బాధిత ప్రాంతాల్లో తనతో పాటు పర్యటించాలని వైసీపీ నాయకులకు సూచించారు.

  • Author : Latha Suma Date : 04-09-2024 - 9:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Kalyan tweet on the situation in Bangladesh
Pawan Kalyan

Pawan Kalyan:ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ బుధవారం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నాయకుల తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలో విపత్తు సమయంలో వైసీపీ నాయకులు ఇంట్లో కూర్చుని చిల్లర రాజకీయం చేస్తున్నారని, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి వరద బాధిత ప్రాంతాల్లో తనతో పాటు పర్యటించాలని వైసీపీ నాయకులకు సూచించారు. బడమేరులో తొంబై శాతం అక్రమణలే విజయవాడకు శాపంగా మారిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఇలాంటి విపత్తు పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు నాయుడు చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఈ వయసులో కూడా సీఎం చంద్రబాబు నాయుడు ట్రాక్టర్లు, జేసీబీలల్లో ఎక్కి వరద ప్రాంతాల్లో సంచరించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారని, ప్రతి ఒక్కరు ఆయన అభినందించాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.

చంద్రబాబు నాయుడు వరద ముంపు ప్రాంతాలకు బుల్డోజర్ ఎక్కి మరీ చేరుకుని, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వరద బాధితులకు సహాయం అందుతోంది. ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేయడం వైసిపి మానుకోవాలి.పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం #APGovtWithFloodVictims #PawanaKalyan #cmchandrababu #HashtagU pic.twitter.com/LpxnFoROl6

— Hashtag U (@HashtaguIn) September 4, 2024

తాను వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లడం లేదని వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై డీసీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. తాను వరద ప్రాంతాలకు వెలితే సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతుందని అధికారులు చెప్పారని, అందుకే తాను ఆ ప్రాంతాలకు వెళ్లలేదని డీసీఎం పవన్ కల్యాణ్ వివరణ ఇచ్చారు. అందుకే తాను ప్రాంతాలకు వెళ్లలేదని పవన్ కల్యాణ్ వివరణ ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మీరు పర్యటించి ఆ తర్వాత తనపై విమర్శలు చేయాలని డీసీఎం పవన్ కల్యాణ్ వైసీపీ నాయకుల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించాలంటే మిమ్మల్ని తన కాన్వాయ్ లో స్వయంగా తానే పిలుచుకొని వెలుతానని, ఆ తర్వాత ఆ ప్రాంతాలు పరిశీలించింది తనకు సలహాలు ఇవ్వాలని పవన్ కల్యాణ్ వైసీపీ నాయకులు సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ జిల్లా వరదల కారణంగా ఎక్కువగా దెబ్బతిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. 24 ఎస్ టీఆర్ఎఫ్ బృందాలు, 26 ఎన్ డీఆర్ఎఫ్ బృందాలు వరద ప్రాంతాల్లోసహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని డీసీఎం పవన్ కల్యాణ్ అన్నారు.

నేవీ నుండి రెండు హెలికాప్టర్లు, ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చిన నాలుగు హెలికాప్టర్ల ద్వారా వరద బాధిత ప్రాంతాల్లో ఆహారం అందిస్తున్నామని అన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది పాల్గొంటున్నారని ,175 బృందాలు విజయవాడ అర్బన్ లోనే పనిచేస్తున్నాయని, వరద ప్రభావం లేని జిల్లాల నుంచి పారిశుద్ధ కార్మికులు వచ్చి వరద సహాయక చర్యల్లో పనిచేస్తున్నాయని పవన్ కల్యాణ్ అన్నారు. ఇంట్లో కూర్చొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న వైసీపీ నాయకులు మొదట ప్రజలకు సహాయం చేసి మా ప్రభుత్వం పైన నిందలు వేస్తే బాగుంటుందని ఆ పార్టీ నాయకులకు పవన్ కల్యాణ్ సలహా ఇచ్చారు.

Read Also: EPS Pensioners: కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. పెన్షనర్లకు గుడ్ న్యూస్..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Chandrababu
  • Deputy CM Pawan Kalyan
  • disaster
  • ycp leaders

Related News

Ap Sanjeevani Scheme

త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’ – సీఎం చంద్రబాబు

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేసి, వారి ఆరోగ్య స్థితిగతులను నిరంతరం పర్యవేక్షించేలా రూపొందించిన 'సంజీవని' ప్రాజెక్టును త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు

  • Cm Chandrababu & Minister N

    మహారాష్ట్రకు చంద్రబాబు, లోకేశ్

  • CM Chandrababu participated in the parliamentary committees workshop

    పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్

Latest News

  • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

  • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

  • మూత్రం రంగును బట్టి మీ ఆరోగ్యాన్ని ఎలా గుర్తించాలి?

  • iGOT కర్మయోగి పోర్టల్‌లో ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త జాతీయ రికార్డు సృష్టించింది: సీఎం చంద్రబాబు

  • ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్

Trending News

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

    • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

    • ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

    • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

    • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd