HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >No Need To Work With Petrol And Diesel This Machine Can Do Six Jobs Good News For Farmers

Farmers : పెట్రల్, డీజిల్‌తో పని లేకుండా..ఆ యంత్రంతో ఆరు పనులు రైతులకు గుడ్ న్యూస్!

  • Author : Vamsi Chowdary Korata Date : 08-12-2025 - 5:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Farmers
Farmers

రైతులకు ఉపయోగకరంగా ఉండేందుకు రీగ్రో అనే సంస్థ ఓ కొత్త యంత్రాన్ని తీసుకువచ్చింది. క్రాప్ సిక్సర్ పేరుతో ఓ కొత్త యంత్రం రూపొందించింది. ఈ యంత్రం సాయంతో ఆరు రకాల వ్యవసాయ పనులు చేసుకోవచ్చు, పైగా పెట్రోల్, డీజిల్ అవసరం లేదు. విశాఖలో జరిగిన ఆర్గానిక్ మేళా కార్యక్రమంలో దీనిని ప్రదర్శించారు. బ్యాటరీ సాయంతో పనిచేసే ఈ క్రాప్ సిక్సర్ తోడుంటే.. రైతులను సహాయకారిగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు.

భారతదేశానికి వెన్నెముక వ్యవసాయ రంగం. అలాంటి వ్యవసాయ రంగం ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఓ వైపు ప్రకృతి విపత్తులు, మరోవైపు గిట్టుబాటు ధరల సమస్యలను రైతన్నలను వెంటాడుతున్నాయి. వీటికి తోడు రోజురోజుకూ పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు.. వ్యవసాయాన్ని లాభసాటిగా కాకుండా నష్టాల పాలుజేస్తున్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలతో.. పలుచోట్ల వ్యవసాయానికి కూలీలు కూడా లభించని పరిస్థితి. ఈ నేపథ్యంలో వ్యవసాయ పెట్టుబడులు భారీగా పెరిగిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యల నుంచి రైతులను గట్టెక్కించేందుకు రీగ్రో అనే సంస్థ ఓ కొత్త పరికరం రూపొందించింది. క్రాప్‌ సిక్సర్‌ అనే పేరుతో సరికొత్త యంత్రాన్ని ఆవిష్కరించింది. ఈ యంత్రం సాయంతో ఆరు రకాల వ్యవసాయ పనులు చేసేందుకు వీలుంది. దీంతో ఈ పరికరానికి క్రాప్ సిక్సర్ అనే పేరు పెట్టారు.

క్రాప్ సిక్సర్ పరికరం సాయంతో దుక్కి దున్నడం మొదలుకుని.. కలుపుతీత వరకూ అనేక పనులు రైతులు సులభంగా చేసుకోవచ్చు. ఎరువుల పిచికారీ, చిన్న చిన్న కాలువలు, గోతులు తవ్వడం, పంట కోత, దుక్కి దున్నడం వంటి పనులు చేసుకునే వీలుంది. అలాగే ఈ క్రాప్ సిక్సర్ యంత్రానికి పెట్రోల్ , డీజిల్ వంటి ఇంధనాలు కూడా అవసరం లేదని రూపకర్తలు చెప్తున్నారు. బ్యాటరీ సాయంతో పనిచేసే ఈ యంత్రాన్ని.. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఎకరం వరకూ దుక్కి దున్నుకోవచ్చు. ఒక్క సారి ఫుల్ ఛార్జింగ్ కావటానికి సుమారుగా నాలుగు గంటల సమయం పడుతుంది. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లో జరిగిన ఆర్గానిక్ మేళా కార్యక్రమంలో ఈ యంత్రాన్ని ప్రదర్శించారు.

మరోవైపు వ్యవసాయ రంగంలో ఇటీవలి కాలంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం విప్లవాత్మక మార్పులను తెస్తోంది. రైతులు సెన్సార్లు, డ్రోన్లు వంటి పరికరాల సాయంతో నేలలోని తేమ, పోషకాలు, పంట ఆరోగ్యాన్ని అంచనా వేయగలుగుతున్నారు. అలాగే పురుగుల మందుల పిచికారీలనూ డ్రోన్ల వినియోగం ఎక్కువైంది. ఇక పొలంలో విత్తనాలు చల్లేందుకు, పంటకోత సమయాన్ని అంచనా వేయడానికి కూడా డ్రోన్లు ఉపయోగిస్తున్నారు. జీపీఎస్ సాయంతో పనిచేసే ట్రాక్టర్ల సాయంతో దుక్కి దున్నడం, విత్తు పనులు చేపడుతున్నారు. పొలాల్లో నీటి పంపిణీ కోసం ఐవోటీని కూడా అక్కడక్కడా ఉపయోగిస్తున్నారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సాయంతో వ్యవసాయ రంగాన్ని మరింత సమర్థవంతంగా, లాభదాయకంగా, పర్యావరణ అనుకూలంగా మారుస్తున్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Agricultural
  • Andhrapradesh
  • AP Farmers
  • Crop Sixer Machine
  • Visakhapatnam

Related News

Acham Naidu Vs Botsa Satyanarayana

బొత్స పై అచ్చెన్నాయుడు ఫైర్

Acham Naidu Vs Botsa Satyanarayana  వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ శాసనమండలిని శాసించాలని చూడటం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. గురువారం మండలిలో రాష్ట్ర అభివృద్ధిపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై వైసీపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల పాలనలో ఒక్క కంపెనీని కూడా తీసుకురా

  • Nara Lokesh

    ట్రిపుల్ ఐటీపై అసెంబ్లీలో మంత్రి లోకేశ్ క్లారిటీ

  • Pawan Kalyan Nandamuri Bala

    ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్‌తో ఎమ్మెల్యే బాలకృష్ణ భేటీ

  • Seattle agrees to pay $29 million compensation to Kandula Jahnavi family

    జాహ్నవి కందుల కుటుంబానికి 264 కోట్ల పరిహారం

  • Food Safety Officer Inspection guntur

    రెస్టారెంట్లతో తస్మాత్ జాగ్రత్త.! గుంటూరు హోటళ్లలో విస్తుపోయే నిజాలు..

Latest News

  • నాలుక కింద ఉప్పు ఉంచితే ఏమవుతుందో తెలుసా?

  • చెక్ బౌన్స్ అయితే ఎంత న‌ష్టమో తెలుసా?!

  • పవన్ కళ్యాణ్ తో బాలకృష్ణ భేటీ ! ఏంమాట్లాడి ఉంటారో అనే చర్చ !!

  • మహాశివరాత్రి నుంచి ఈ రాశుల వారి ద‌శ తిరిగిన‌ట్లే!

  • కేంద్రమంత్రి రామ్మోహన్‌తో సీఎం రేవంత్ భేటీ

Trending News

    • ఏఐ వాడుతున్నారా? అయితే ఇక‌పై జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

    • బౌలింగ్ యాక్షన్.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

    • ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోవడానికి స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ ఇదే!

    • ఏప్రిల్ 1 నుండి మారనున్న ప్ర‌త్యేక‌ నిబంధనలు ఇవే!

    • రైల్వే ప్ర‌యాణికుల‌కు మ‌రో అదిరిపోయే సూప‌ర్ న్యూస్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd