HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >New Six Lane National Highway In Ap

AP CM Chandrababu Naidu : ఏపీలో కొత్తగా ఆరు వరుసల జాతీయ రహదారి.. !

  • Author : Vamsi Chowdary Korata Date : 17-11-2025 - 3:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vijayawada Machilipatnam Na
Vijayawada Machilipatnam Na

విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారి 65 విస్తరణ వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరింది. ఈ మార్గంలోని నాలుగు వరుసల రహదారిని ఆరు వరుసలుగా విస్తరించేందుకు ప్రణాళికలు రచించారు. అందులో భాగంగా కన్సల్టెన్సీ సంస్థ డీపీఆర్ కూడా సిద్ధం చేసింది. ఈ డీపీఆర్ గురించి ఇటీవల నిర్వహించిన స్టేక్ హోల్డర్స్ సమావేశంలోనూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. డీపీఆర్‌లో అండర్ పాస్‌లు, ఫ్లైఓవర్ల ప్రస్తావన లేదని జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఈ వ్యవహారంపై జాతీయ రహదారుల సంస్థ అధికారులు.. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి్ కృష్ణబాబుతో సమావేశమయ్యారు. దీని గురించి వివరించారు.

కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏపీలో పలు మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణం వేగం పుంజుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణ పనులు కూడా చేపట్టాలని నిర్ణయించారు. అయితే విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారి -65 డీపీఆర్ గురించి ప్రస్తుతం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణ కోసం కన్సల్టెన్సీ సంస్థ సమగ్ర ప్రాజెక్టు నివేదిక ( డీపీఆర్) తయారు చేసింది. అయితే ఈ డీపీఆర్ మీద అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క ఫ్లైఓవర్, అండర్‌పాస్ లేకుండానేవిజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారి డీపీఆర్తయారు చేశారనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారం సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లింది.

విజయవాడలోని బెంజ్ సర్కిల్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మొదలయ్యే చినఓగిరాల వరకూ జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నారు. అయితే ఈ ప్రాంతంలో ఒక్క ఫ్లైఓవర్, అండర్‌పాస్ కూడా లేకుండా డీపీఆర్ తయారు చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన స్టేక్ హోల్డర్స్ సమావేశంలోనూ ప్రజా ప్రతినిధులు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వ్యవహారం కాస్తా సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కృష్ణబాబుతో.. జాతీయ రహదారి ప్రాధికార సంస్థ అధికారులు, మెట్రో అధికారులు ఇటీవల సమావేశమయ్యారు. డీపీఆర్ మీద వస్తున్న అసంతృప్తిని వివరించారు. అలాగే జాతీయ రహదారి విస్తరణ జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యల గురించి వివరించారు.

ట్రాఫిక్ సమస్యల నేపథ్యంలో.. వాటిని పరిష్కరించేందుకు బెంజ్ సర్కిల్ నుంచి అన్ని కూడళ్లను అనుసంధానం చేసేలా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ (ఎలివేటెడ్ కారిడార్)నిర్మాణం చేపట్టాలని.. లేదంటే అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్లు నిర్మించాలని స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు కోరినట్లు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కృష్ణబాబుకు వివరించారు. ఈ అంశాన్ని కృష్ణబాబు సీఎం చంద్రబాబు వద్దకు తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారి డీపీఆర్‌లో మార్పులు చేస్తారనే వార్తలు వస్తున్నాయి . అయితే డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ వైపు మొగ్గు చూపుతారా లేదా.. ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు విజయవాడ – మచిలీపట్నం మధ్య 64 కిలోమీటర్ల మేర రహదారిని ఆరు వరుసలుగా విస్తరించాలని నిర్ణయించారు. ఎన్టీఆర్ జిల్లాలో2 కిలోమీటర్లు, కృష్ణా జిల్లాలో 62 కిలోమీటర్ల మేరకు రహదారి విస్తరణ పనులు చేపట్టాలని గతంలో ప్రణాళికలు రచించారు. ఈ రహదారి విస్తరణ పనుల కోసం డీపీఆర్ తయారీని ఓ కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించారు. అయితే కన్సల్టెన్సీ సంస్థ రూపొందించిన డీపీఆర్ మీద ప్రస్తుతం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP CM Chandrababu Naidu
  • chandrababu naidu
  • machilipatnam
  • National highway
  • vijayawada

Related News

Srikakulam Mulapeta Port Wo

Mulapeta Port : ఏపీలో కొత్త పోర్ట్ ట్రయల్ రన్ మారిపోతున్న రూపురేఖలు!

శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. వాటర్‌ బ్రేక్‌ వాల్ నిర్మాణం పూర్తయి, బెర్తుల నిర్మాణం చివరి దశకు చేరుకుంది. అత్యాధునిక డ్రైడ్జర్లను దిగుమతి చేసుకోనున్నారు. పోర్టు నిర్మాణం 60% పూర్తయింది. రోడ్డు, రైల్వే ట్రాక్ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టుతో జిల్లా ఆర్థికాభివృద్ధికి ఊతం లభిస్తుంది. ఈ పనుల్ని వేగంగా పూర్తి చే సి త్వరలోనే అం

  • Cbn Acb Court

    AP CM Chandrababu Naidu : చంద్రబాబుపై అవినీతి కేసులు కొట్టేసిన హైకోర్టు..!

  • Godavari Pushkaralu 2027

    Godavari Pushkaralu 2027 : గోదావరి పుష్కరాలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్ ..15 నిమిషాల్లో బయటకి.!

Latest News

  • Pawan Kalyan: ఉస్తాద్‌లో పాత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని చూస్తామా?

  • Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ రైలు.. అస‌లు ఈ ట్రైన్ స్పెషాలిటీ ఏమిటీ?!

  • India-US Trade: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం త్వరలో ఖరారు అయ్యే అవకాశం!

  • Brain Ageing: వయస్సు కంటే ముందే మెదడు వృద్ధాప్యానికి చేరుకుందా?

  • Telangana Global Summit: తెలంగాణ గ్లోబ‌ల్ సమ్మిట్‌.. అస‌లు ఎందుకీ స‌మ్మిట్‌, పూర్తి వివ‌రాలీవే!

Trending News

    • House Construction: వారికి గుడ్ న్యూస్‌.. తక్కువ వడ్డీకే రూ. 25 ల‌క్ష‌ల వ‌ర‌కు హోమ్ లోన్!

    • Goa Tour : గోవాకు వెళ్లి యువత జాగ్రత్త..లేదంటే మీరే నష్టపోతారు !!

    • IndiGo Flight Disruptions : ఇండిగో విమానం రద్దుతో కూతురి పెళ్లికి వెళ్లలేకపోయిన తల్లిదండ్రులు

    • Zero Balance Accounts: బ్యాంక్ అకౌంట్ ఉన్న‌వారికి శుభ‌వార్త చెప్పిన ఆర్బీఐ!

    • Justin Greaves: టెస్టుల్లో గ్రీవ్స్ స‌రికొత్త ప్రపంచ రికార్డు.. నంబర్ 6లో బ్యాటింగ్ చేస్తూ డబుల్ సెంచ‌రీ!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd