HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Nadendla Manohar Says Jagan Sarkar Cracking Down On Farmers Suicides

Nadendla Manohar: రైతు ఆత్మహత్యలను ‘జగన్ సర్కార్’ తొక్కిపెడుతోంది – ‘నాదెండ్ల మనోహర్’..!

  • By hashtagu Published Date - 09:31 AM, Thu - 31 March 22
  • daily-hunt
12
12

సాగు నష్టాలు, అప్పుల వల్ల వచ్చిన ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న కౌలు రైతుల వివరాలు బయటకు రాకుండా తొక్కిపెట్టడానికి జగన్ రెడ్డి ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు అందాల్సిన నష్టపరిహారాన్ని కూడా ఇవ్వకుండా వేధిస్తోందని అన్నారు. జీవో 43 అమలు తీరు దారుణంగా ఉందని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ కనీసం గ్రామాల్లో పర్యటించిన పాపాన పోలేదని విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం పాలతోడు గ్రామంలో ఆర్ధిక ఇబ్బందులు, సాగు నష్టాలతో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన పిల్లా రామకృష్ణ అనే కౌలు రైతు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “ అన్నదాతల ఆత్మహత్యలు చాలా బాధాకరం. గ్రామస్థాయిలో వ్యవసాయ, పోలీస్, రెవెన్యూ శాఖలు స్పందించే తీరు బాధిత కుటుంబాలకు ఉపయోగపడటం లేదు. పిల్లా రామకృష్ణ అనే కౌలు రైతు గత ఏడాది నవంబర్ లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడితే… ఇప్పటి వరకు ఆ కుటుంబానికి నష్టపరిహారం అందలేదు అని చెప్పారు నాదెండ్ల.

పాదయాత్ర హామీ ఏమైంది?:
జగన్ తన పాదయాత్ర సమయంలో అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చారు. నవరత్నాలు పేరు చెప్పి ఇంటింటికి తిరిగారు. ఎవరైనా కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడితే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి రూ. 7 లక్షలు పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ కాగితాలు లేవు.. ఈ కాగితాలు లేవని బాధిత కుటుంబాలను వేధించడం సబబు కాదు. ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం బయటకు పొక్కకుండా ఉంటే వైఎస్ఆర్ బీమా కింద రూ. 2 లక్షలు ఇస్తామని బాధిత కుటుంబాలపై ఒత్తిడి తీసుకురావడం బాధాకరం అని అన్నారు నాదెండ్ల మనోహర్.

47 మంది చనిపోతే 8 మందికే పరిహారం:
రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలపై జనసేన పార్టీ సమాచారం తెప్పించుకుంటుంది. దాదాపు తొమ్మిది జిల్లాల సమాచారం వచ్చింది. ముఖ్యంగా అన్నపూర్ణ వంటి గోదావరి జిల్లాల్లో రైతుల ఆత్మహత్యలు బాధించాయి. మాకు ఉన్న అధికారిక లెక్కల ప్రకారం జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు 47 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వం మాత్రం కేవలం 8 మందికే రూ. 7 లక్షల పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంది. మిగతా వాళ్లు కాళ్లు అరిగేలా తిరిగినా అధికారులు స్పందించిన పాపాన పోలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ గ్రామాల్లో పర్యటించిన దాఖలాలు లేవు. బాధిత రైతు కుటుంబాలకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ పోరాటం చేస్తుంది. అవసరమైతే అధ్యక్షులు పవన్ కళ్యాణ్ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ కి మా పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో నాయకులందరు కలిసి వినతిపత్రం సమర్పిస్తారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోతే బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ పోరాటం చేస్తుందని” అన్నారు నాదెండ్ల మనోహర్.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Farmers Suicides
  • Nadendla Manohar
  • ys jagan

Related News

Pawan Kalyan

Pawan Kalyan: జ‌గ‌న్‌కు ప్ర‌త్యేక రాజ్యాంగం ఉందేమో.. ప‌వ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

గతంలో ప్రతిపక్ష నేతగా ఉండి కూడా జగన్ ప్రతిపక్ష హోదా తెచ్చుకోలేకపోయారని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రతిపక్షం ఇలా అసెంబ్లీకి దూరంగా ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన హెచ్చరించారు.

  • Central government issues GO allocating huge amount of urea to AP

    CM Chandrababu : ఏపీకి భారీగా యూరియా కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం జీవో జారీ

  • YCP's 'Annadatha Poru' aims at farmers' welfare...tensions across the state

    AP : రైతుల సంక్షేమమే లక్ష్యంగా వైసీపీ ‘అన్నదాత పోరు’ ..రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తతలు

  • Nara Lokesh

    Nara Lokesh : అన్నామలైతో మంత్రి లోకేశ్‌ భేటీ

  • 'Annadatta fight' over urea shortage in the state: YCP ready for agitation

    AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

Latest News

  • Hanuman Chalisa: హనుమాన్ చాలీసా విని గ్రౌండ్‌లోకి అడుగుపెట్టే టీమిండియా ఆట‌గాడు ఎవ‌రంటే?

  • CM Revanth: దక్షిణ భారత కుంభమేళా.. సీఎం రేవంత్ కీల‌క ఆదేశాలు!

  • Sushila Karki: నేపాల్ తొలి మహిళా ప్రధానమంత్రిగా సుశీలా కర్కి నియామకం

  • Engineering Colleges : సోమవారం నుంచి ఇంజినీరింగ్ కాలేజీలు బంద్?

  • Asia Cup 2025: ఎల్లుండి భార‌త్‌- పాక్ మ్యాచ్‌.. పిచ్ ప‌రిస్థితి ఇదే!

Trending News

    • Provident Fund Withdrawals: పీఎఫ్ ఖాతా ఉన్న‌వారికి శుభ‌వార్త‌.. ఏటీఎం నుంచి డ‌బ్బు విత్ డ్రా ఎప్పుడంటే?

    • PM Modi: పీఎం మోదీ 75వ పుట్టినరోజు.. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు!

    • Sachin Tendulkar: బీసీసీఐ అధ్యక్షుడిగా సచిన్ టెండూల్కర్?!

    • Suryakumar Yadav: కోహ్లీ, రోహిత్‌లను వెనక్కి నెట్టిన సూర్యకుమార్ యాదవ్!

    • Jagan Reddy: నిస్సిగ్గు అబద్ధాలే జగన్ రెడ్డి ఆయుధం.. కూటమి నేతలు ఫైర్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd